"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

29 ఏప్రిల్, 2011

DALIT LITERATURE /M.A., Telugu /Semester – IV


UNIVERSITY OF HYDERABAD
End of Semester Examinations, April, 2011
School of Humanities, M.A., Telugu
Semester – IV
Course Title: HT: 576 DALIT LITERATURE
Date of Examination: 20 -04-2011

Time: 10.00 A.M. to 1.00 P.M                                                            Max. Marks: 60

I  కింది ప్రశ్నలలో ఒకదానికి వ్యాసరూప సమాధానాన్ని రాయండి.                (1x15 =15 మార్కులు)
తెలుగులో దళితసాహిత్యం ఆరంభ వికాసాలను వివరించండి.
      (లేదా)
దళిత సాహిత్య చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ, మౌలిక భావనలను పేర్కొనండి.

II  కింది ప్రశ్నలలో రెండింటికి వ్యాసరూప సమాధానాలు రాయండి.                (2x15 = 30 మార్కులు)
1.పాలేరు నాటకంలోని వస్తు, శిల్ప విశేషాల్ని  పేర్కొనండి.
2. మునివాహనుడు  నాటకాల్లోని వస్తు, శిల్ప వైవిధ్యాన్ని సమీక్షించండి. 
3.జగడం నవలలో గల దళిత జీవితాన్ని ఆవిష్కరించండి.
4.పోలయ్య కథలలో గల మత పరిస్థితుల్ని విశ్లేషించండి.

III   కింది కవితా ఖండికలోని  సౌందర్యాన్ని విశ్లేషించండి                      (1x15 =15 మార్కులు)
‘‘ ముప్పుఘటించి వీని కులమున్‌, గలిమిన్‌ గబళించి దేహమున్‌
బిప్పియొనర్చునీ భరతవీరుని పాదముకందకుండగాు
జెప్పులు గుట్టి జీవనము సేయును గాని నిరాకరింపలే
దెప్పుడు నప్పువడ్డది సుమీ భరతావని వీని సేవకున్‌ ’’         -గుఱ్ఱం జాషువ
        (లేదా)
‘ఇప్పుడు మా మాట ఆత్మగౌరవం 
ఇప్పుడు మా బాట విముక్తి
మా పెట్టుబడికి విశ్రాంతి లేదు 
రెండు చేతుల రెండు కాళ్ళ 
రెండు రెండు దినాల ఉపవాసాల గంజినీళ్ళ నిర్విరామ శ్రమగీతంతో 
మాకు తెలిసిన జీవితమంతా త్రికాలాల్లో  
మీ అందరికీ వొంగివొంగి ఉండటం
  ఇప్పుడంతా మూడ కాలాలూ 
మూడు అవమానాగ్నులే 
ముప్పొద్దులా శ్రమలోంచి పుట్టిన చెమట చుక్క 
ఆత్మాభిమానం విసిరే విచ్చుకత్తి 
మూడు పాయలుగా చీలిన మేనంతా 
క్రోధార్ణవమే అయ్యింది
నిజమే మేమెరిగిన జీవితమంతా 
శిలావిగ్రహాలుగా మిగలటం
త్యాగమే మా జీవితం
భోగ భోగ భోగం మీ లక్ష్యం ’’ - బన్న ఐలయ్య

a.u.seminar

22 ఏప్రిల్, 2011

Telugu Poetics paper


UNIVERSITY OF HYDERABAD
 Centre for Integrated Studies
End of Semester Examinations, April, 2011
I.M.A., Humanities, Semester – VI
Course Title: Telugu Poetics-II
Date of Examination: 21 -04-2011

Time: 10.00 A.M. to 1.00 P.M                                                            Max. Marks: 60

I.  కింది ప్రశ్నలలో రెండిoటికి వ్యాసరూప సమాధానాలు రాయం డి.                (2x15 =30 మార్కులు)
1. దోషం అంటే ఏమిటి? కావ్యాలంకార సంగ్రహంలో గుణ దోషాల తత్త్వాన్ని వివరించండి
2. కావ్యాలంకార సంగ్రహంలో గల ముఖ్యమైన శబ్దదోషాలను సోదాహరణంగా పేర్కొనండి
3. కావ్యాలంకార సంగ్రహంలో గల ముఖ్యమైన అర్థదోషాలను సోదాహరణంగా విశదీకరించండి
II.  కింది పద్యాలను పూరించండి.                                                   (5x1=5=మార్కులు)
1. కవులు ప్రయోగింపని.....ఖేటసంస్తుతుడనుగన్‌
2. ఇలు దనసంకేతంబున...... సాగరకర్ణయాన యలక లనంగన్‌
3. క్రమహీనమక్రమంబగు....... లెనయే? యనుగన్‌
4. ఛందము యతియుం...... నరహరి ననుగన్‌
5. నడుమనొక ........ నీకొనర్పుగావలద’’నుగన్‌
III. కింది వాటిలో ఏవైనా రెండిరటిని పాదభంగం కలగకుండా పద్యాలను రాసి, వాటి లక్షణాలను వివరించండి.
(2x5=10 మార్కులు)
 1. చ్యుతసంస్కారము           2. పునరుక్తి          3. సందిగ్ధము              4. సమాప్త పునరాత్తము

Iప కింది వాటిలో ఐదింటిని సోదాహరణంగా పేర్కొనండి.                                      (5x3=15 మార్కులు)
1. ఉపమ          2.అనన్వయం             3. ఉత్ప్రేక్ష         4. వృత్యానుప్రాస
5. ముక్తపదగ్రస్తం  6. అతిశయోక్తి            7. యమకం      8. లాటానుప్రాస
(లేదా)
అలంకారాలు అంటే ఏమిటి?కావ్యానికి సౌందర్యాన్ని కలిగించే శబ్దార్థాలంకారాలను కొన్నింటిని సోదాహరణంగా
వివరించండి.

18 ఏప్రిల్, 2011

university of hyderabad admission notification

http://www.uohyd.ernet.in/index.php/admissions
Ph.D Telugu Model Paper 2010

Dr.G.V.Ratnakar essay about Saint Ravidas

నిర్గుణ భక్తి కావ్యంలోని గొప్ప విశేషం ఏమంటే వారి యొక్క మానవీయ దృక్పథం. వారి దృష్టి విలాసవంతమైన ఐశ్వర్యమైన జీవితాన్ని గడుపుతున్న వారిపై పడలేదు. వారి కవితా వస్తువు సామాన్య మానవుడు. సమాజంలో విభిన్నమైన వైషమ్యాల మధ్య పడి నలుగుతున్న ఆ వ్యక్తి వారికి ఆధారం.
భక్తి సాహిత్యం హిందీ సాహిత్యపు నిర్మాణంతోపాటు భారత సామాజిక పరిస్థితులకు పరిష్కారం చూపిస్తూ భారతీయ సామాజిక పరిస్థితిని బలంగా ప్రభావితం చేసింది. సంత్‌ రవిదాసు సామాజిక అస్థిరత్వాన్ని తగ్గించేందుకు బాగా ప్రయత్నించారు. సంత్‌ రవిదాసు బోధన, ఆయన సాధన సామాజిక జీవితానికి దగ్గరగా ఉంది. రవిదాసు భారతీయ సామాజిక ధార్మిక రంగాల్లోకి తన కరుణ, స్నేహభావాన్ని ప్రసరింపజేశాడు.
ఆయన కవిత్వానికి సంపూర్ణ జీవితం ఆధారంగా ఉంది. ఆయన జీవితం బహుముఖమైంది. సామాజిక ప్రగతికి ప్రతిబంధకాలైన వాటిపట్ల, ఆ ఆచారాల పట్ల, రవిదాస్‌ యుద్ధాన్ని ప్రకటించాడు. నాటి సామాజికత మూఢ విశ్వాసాలపై ఆయన తిరగబడ్డాడు. సామాజిక జఢత్వం కారణంగా ఆయన అనేక కష్టాల పాలయ్యాడు. తనని కష్టాల పాల్జేసిన సామాజిక జఢత్వాన్ని నిరోధించేందుకు ఆయన తన రచనల్ని ఆయుధాలుగా ప్రయోగించాడు. తన సమాజాన్ని హీన భావన నుండి విముక్తం చేసి వారిలో ఆత్మగౌరవ భావనని రవిదాసు కలిగించాడు. సంత్‌ రవిదాసు భక్తి, సాహిత్యం సమాజం నుండి మనిషిని తొలగించే ప్రయత్నం చేయలేదు. ఆయన విశాలమైన దృష్టి సమాజంలో సమానత్వపు బీజాల్ని నాటేందుకు తోడ్పడ్డాయి. నాటి సమాజంలో మత ప్రభావం అధికంగా ఉండడంతో ఆయన మతం, భక్తి మాధ్యమాలుగా తన భావనల్ని ప్రయోగించాడు. అన్యాయం, అసమానత్వం, కర్మకాండలు, దురాచారాల్ని వ్యతిరేకిస్తూ సంత్‌ రవిదాసు విప్లవాత్మకమైన రూపంలో మన ముందుకు వస్తున్నాడు. ఆయన తన వృత్తి పట్ల గౌరవభావం ఉంది. ఆయనకు తన కులం పట్ల ఉన్న భావన ఏమంటే తనకి అవకాశం ఉంటే ప్రతి జన్మలోనూ ఇదే కులంలోనే పుట్టాలని కోరుకున్నాడు. ఆయన ప్రేమ సద్భావాల అసలైన రూపాన్ని విశ్వాసంగా గ్రహించి సమాజానికి మార్గం చూపాడు. నిద్రపోతున్న ఆత్మని నిద్రలేపి పోరాట మార్గంవైపు మరలించాడు. ఆయన ప్రబోధాలు మానవ విముక్తి ప్రశ్నలతో సామాజిక సందర్భంతో కలిసి ప్రయాణించాయి.హిందీ కవిత్వ చరిత్రని ఒకసారి పరిశీలిస్తే, చరిత్ర పేజీలని వెనక్కి తిప్పితే నాటి సంత్‌ రవిదాసు చుట్టూ అలముకున్న పరిస్థితి ఎంత భయంకరమో, అమానవీయమైనదో తెలుస్తుంది. నిరంతరం దాడులు, అణచివేతలతో కూడిన భయకంపితమైన భారతీయ సమాజం నివాసాలు కోల్పోయి రేయింబవళ్లు భయం నీడ క్రింద బ్రతికిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిరంతరం వారి బ్రతుకు పోరాటం గోచరమౌతుంది. అలాంటి భయంకరమైన పరిస్థితిలో రవిదాసు ప్రభవించడం అనేది కారు చీకటిని దునుమాడిన ప్రజ్ఞా సూర్యునిలా తప్ప మరేమీ లేదు.
భారతీయ సామాజిక వ్యవస్థలో అసమానతలే పునాదులుగా గల సిద్ధాంతం మధ్య విదేశీ దండయాత్రల నడుమ భారతీయ సమాజం రవిదాసు బోధనల్ని శిరసావహించి ఆ పరిస్థితుల్లో వెలుగు దివిటీల్లా నిలబడింది. సంత్‌ రవిదాసు వ్యక్తిత్వం వినోదాలకు దూరంగా ఉండేది. ఆయన దార్శనిక బోధనలు ముసుగు కప్పుకొని ఉండేవి కావు. రవిదాసు పుట్టుక గురించి కొంత వివాదం ఉంది. కొంతమంది ఆయన (క్రీ.శ 1376లో జన్మించాడని కొంతమంది ఆయన క్రీ.శ 1471లో జన్మించాడని అంటారు. ఆయన 126 సంవత్సరాలు జీవించాడని చెప్తారు. రవిదాస్‌ రామాయణంలో ఆయన తండ్రి పేరు 'రాహు' తల్లి పేరు 'కర్మా' అని చెప్పుకున్నారు. ఆయన భార్య పేరు 'లోనా' అని చెప్పారు. ''నాగర్‌ జనా మేరీ జాతి విఖ్యాత చమార్‌'' అని ఆయన స్వయంగా తనని తాను 'చమార్‌'గా పరిచయం చేసుకొని కుల అహంకారాన్ని ఖండించాడు.
రవిదాసు తన బోధనల్లో తన వృత్తిని ఇలా ప్రకటించుకున్నాడు. ''జాకే కుటుంబ్‌ కే ఢేడ్‌ సమ్‌ ఢోర్‌ ఢోవత్‌!/ ఫిరిహుః ఆజహు జనారసీ ఆస్‌పాస్‌!'' రవిదాసు చెప్పులు కుట్టి, చెప్పులు మరమ్మత్తు చేసి పేదరికంతో వారణాసి దగ్గర సాధారణమైన జీవితాన్ని గడిపాడు. పుస్తక జ్ఞానం లేకున్నా ఆయన ఆత్మజ్ఞానపు అంతిమ స్థానాన్ని చేరుకున్నాడు. ఆయన జ్ఞానాన్ని ఆర్జించి దేశమంతటా పర్యటించాడు. ఆయన ప్రబోధాలకు ప్రభావితం చెంది ఘాలీరాణి, మీరాభాయి ఆయన శిష్యులుగా మారారు. సంత్‌ రవిదాసు సాహిత్యం అనేక చోట్ల దొరుకుతుంది. సాగర్‌ ప్రచురణ సభ పరిశోధన పత్రాలననుసరించి క్రింది పుస్తకాలు ఆయనవి అందుబాటులో ఉన్నాయి. 'రైదాస్‌ బేక్‌ బాని'. రైదాస్‌జీకి సాఖీ, తథా పద్‌, మొదలైనవి రవిదాసు 1576లో చనిపోయాడని కొందరు 1597లో చనిపోయాడు. మరికొందరు ప్రకటించారు.
రవిదాసు ఒకచోట- ''ఎకై మాటకీ సభీ భాండె/ కాన శూద్ర్‌ క్యా పాండె'' శూద్రుడు పండితుల మధ్య ఎలాంటి తేడాలు లేవు. అందరిలో ఒకేరకమైన రక్తం ప్రవహిస్తుంది. రక్తమాంసాలు కూడా ఒకలాగే ఉంటాయి''. అంటాడు సంత్‌ రవిదాసు మరోచోట ఇలా అంటారు - హిందూ పూజయీ దెహరా. ముసల్‌మాన్‌ మసీతి రవిదాస్‌ పూజయీ ఉస్‌రామ్‌కో, జిస్‌ నిరంతర్‌ ప్రీతి||
హిందువులు దేవతల్ని పూజిస్తారు. ముస్లింలు మసీదులోకెళ్లి నమాజ్‌ చదువుతారు. కానీ ప్రతి మనిషిలో కూడా ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవున్ని పూజించటం అన్నింటికన్నా ఉత్తమం. అందరికీ బ్రతికే అవకాశం ఇవ్వాలి. మనుషులు ఒకరితో ఒకరు ప్రేమ భావంతో స్నేహితుల్లా మెలగాలి అని అర్థం. మరోచోట - మసిజిద్‌ సోం కభు ఘిక్‌ నహిఁ మందిర్‌ సోసహిఁ ప్యార్‌, దో మహం అల్లాV్‌ా రామ్‌ నహీఁ, కV్‌ా రవిదాస్‌ చముర్‌|| రవిదాసు తనని తాను చముర్‌ అని ప్రస్తావించుకుంటూ ప్రత్యేకమైన ఆలోచనని కలిగిస్తున్నాడు. మాకు మసీదుపై వ్యతిరేకత లేదు. దేవాలయంపై ప్రత్యేక ప్రేమ లేదు. వ్యర్థమైన పూజలు ఇవన్నీ. అజ్ఞానాన్ని వదిలి జ్ఞానం పొంది నిజమైన మనసుతో మానవ సేవ చేయాలంటాడు. ఈ విధంగా హిందూ మతపు పతన దశలో ప్రవక్తగా ఉద్భవించి అనేక మతాల మూఢనమ్మకాల్ని వ్యతిరేకించి, మానవీయ ధర్మాన్ని ప్రవచించి భారతదేశ అంటరాని కులాలకి మహోన్నతమైన మర్గాన్ని చూపించిన సంత్‌ రవిదాస్‌ సదాస్మరణీయుడు.
డా|| జి.వి రత్నాకర్‌ 


Dr.G.V.Ratnakar essay about Saint Ravidas

నిర్గుణ భక్తి కావ్యంలోని గొప్ప విశేషం ఏమంటే వారి యొక్క మానవీయ దృక్పథం. వారి దృష్టి విలాసవంతమైన ఐశ్వర్యమైన జీవితాన్ని గడుపుతున్న వారిపై పడలేదు. వారి కవితా వస్తువు సామాన్య మానవుడు. సమాజంలో విభిన్నమైన వైషమ్యాల మధ్య పడి నలుగుతున్న ఆ వ్యక్తి వారికి ఆధారం.
భక్తి సాహిత్యం హిందీ సాహిత్యపు నిర్మాణంతోపాటు భారత సామాజిక పరిస్థితులకు పరిష్కారం చూపిస్తూ భారతీయ సామాజిక పరిస్థితిని బలంగా ప్రభావితం చేసింది. సంత్‌ రవిదాసు సామాజిక అస్థిరత్వాన్ని తగ్గించేందుకు బాగా ప్రయత్నించారు. సంత్‌ రవిదాసు బోధన, ఆయన సాధన సామాజిక జీవితానికి దగ్గరగా ఉంది. రవిదాసు భారతీయ సామాజిక ధార్మిక రంగాల్లోకి తన కరుణ, స్నేహభావాన్ని ప్రసరింపజేశాడు.
ఆయన కవిత్వానికి సంపూర్ణ జీవితం ఆధారంగా ఉంది. ఆయన జీవితం బహుముఖమైంది. సామాజిక ప్రగతికి ప్రతిబంధకాలైన వాటిపట్ల, ఆ ఆచారాల పట్ల, రవిదాస్‌ యుద్ధాన్ని ప్రకటించాడు. నాటి సామాజికత మూఢ విశ్వాసాలపై ఆయన తిరగబడ్డాడు. సామాజిక జఢత్వం కారణంగా ఆయన అనేక కష్టాల పాలయ్యాడు. తనని కష్టాల పాల్జేసిన సామాజిక జఢత్వాన్ని నిరోధించేందుకు ఆయన తన రచనల్ని ఆయుధాలుగా ప్రయోగించాడు. తన సమాజాన్ని హీన భావన నుండి విముక్తం చేసి వారిలో ఆత్మగౌరవ భావనని రవిదాసు కలిగించాడు. సంత్‌ రవిదాసు భక్తి, సాహిత్యం సమాజం నుండి మనిషిని తొలగించే ప్రయత్నం చేయలేదు. ఆయన విశాలమైన దృష్టి సమాజంలో సమానత్వపు బీజాల్ని నాటేందుకు తోడ్పడ్డాయి. నాటి సమాజంలో మత ప్రభావం అధికంగా ఉండడంతో ఆయన మతం, భక్తి మాధ్యమాలుగా తన భావనల్ని ప్రయోగించాడు. అన్యాయం, అసమానత్వం, కర్మకాండలు, దురాచారాల్ని వ్యతిరేకిస్తూ సంత్‌ రవిదాసు విప్లవాత్మకమైన రూపంలో మన ముందుకు వస్తున్నాడు. ఆయన తన వృత్తి పట్ల గౌరవభావం ఉంది. ఆయనకు తన కులం పట్ల ఉన్న భావన ఏమంటే తనకి అవకాశం ఉంటే ప్రతి జన్మలోనూ ఇదే కులంలోనే పుట్టాలని కోరుకున్నాడు. ఆయన ప్రేమ సద్భావాల అసలైన రూపాన్ని విశ్వాసంగా గ్రహించి సమాజానికి మార్గం చూపాడు. నిద్రపోతున్న ఆత్మని నిద్రలేపి పోరాట మార్గంవైపు మరలించాడు. ఆయన ప్రబోధాలు మానవ విముక్తి ప్రశ్నలతో సామాజిక సందర్భంతో కలిసి ప్రయాణించాయి.హిందీ కవిత్వ చరిత్రని ఒకసారి పరిశీలిస్తే, చరిత్ర పేజీలని వెనక్కి తిప్పితే నాటి సంత్‌ రవిదాసు చుట్టూ అలముకున్న పరిస్థితి ఎంత భయంకరమో, అమానవీయమైనదో తెలుస్తుంది. నిరంతరం దాడులు, అణచివేతలతో కూడిన భయకంపితమైన భారతీయ సమాజం నివాసాలు కోల్పోయి రేయింబవళ్లు భయం నీడ క్రింద బ్రతికిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిరంతరం వారి బ్రతుకు పోరాటం గోచరమౌతుంది. అలాంటి భయంకరమైన పరిస్థితిలో రవిదాసు ప్రభవించడం అనేది కారు చీకటిని దునుమాడిన ప్రజ్ఞా సూర్యునిలా తప్ప మరేమీ లేదు.
భారతీయ సామాజిక వ్యవస్థలో అసమానతలే పునాదులుగా గల సిద్ధాంతం మధ్య విదేశీ దండయాత్రల నడుమ భారతీయ సమాజం రవిదాసు బోధనల్ని శిరసావహించి ఆ పరిస్థితుల్లో వెలుగు దివిటీల్లా నిలబడింది. సంత్‌ రవిదాసు వ్యక్తిత్వం వినోదాలకు దూరంగా ఉండేది. ఆయన దార్శనిక బోధనలు ముసుగు కప్పుకొని ఉండేవి కావు. రవిదాసు పుట్టుక గురించి కొంత వివాదం ఉంది. కొంతమంది ఆయన (క్రీ.శ 1376లో జన్మించాడని కొంతమంది ఆయన క్రీ.శ 1471లో జన్మించాడని అంటారు. ఆయన 126 సంవత్సరాలు జీవించాడని చెప్తారు. రవిదాస్‌ రామాయణంలో ఆయన తండ్రి పేరు 'రాహు' తల్లి పేరు 'కర్మా' అని చెప్పుకున్నారు. ఆయన భార్య పేరు 'లోనా' అని చెప్పారు. ''నాగర్‌ జనా మేరీ జాతి విఖ్యాత చమార్‌'' అని ఆయన స్వయంగా తనని తాను 'చమార్‌'గా పరిచయం చేసుకొని కుల అహంకారాన్ని ఖండించాడు.
రవిదాసు తన బోధనల్లో తన వృత్తిని ఇలా ప్రకటించుకున్నాడు. ''జాకే కుటుంబ్‌ కే ఢేడ్‌ సమ్‌ ఢోర్‌ ఢోవత్‌!/ ఫిరిహుః ఆజహు జనారసీ ఆస్‌పాస్‌!'' రవిదాసు చెప్పులు కుట్టి, చెప్పులు మరమ్మత్తు చేసి పేదరికంతో వారణాసి దగ్గర సాధారణమైన జీవితాన్ని గడిపాడు. పుస్తక జ్ఞానం లేకున్నా ఆయన ఆత్మజ్ఞానపు అంతిమ స్థానాన్ని చేరుకున్నాడు. ఆయన జ్ఞానాన్ని ఆర్జించి దేశమంతటా పర్యటించాడు. ఆయన ప్రబోధాలకు ప్రభావితం చెంది ఘాలీరాణి, మీరాభాయి ఆయన శిష్యులుగా మారారు. సంత్‌ రవిదాసు సాహిత్యం అనేక చోట్ల దొరుకుతుంది. సాగర్‌ ప్రచురణ సభ పరిశోధన పత్రాలననుసరించి క్రింది పుస్తకాలు ఆయనవి అందుబాటులో ఉన్నాయి. 'రైదాస్‌ బేక్‌ బాని'. రైదాస్‌జీకి సాఖీ, తథా పద్‌, మొదలైనవి రవిదాసు 1576లో చనిపోయాడని కొందరు 1597లో చనిపోయాడు. మరికొందరు ప్రకటించారు.
రవిదాసు ఒకచోట- ''ఎకై మాటకీ సభీ భాండె/ కాన శూద్ర్‌ క్యా పాండె'' శూద్రుడు పండితుల మధ్య ఎలాంటి తేడాలు లేవు. అందరిలో ఒకేరకమైన రక్తం ప్రవహిస్తుంది. రక్తమాంసాలు కూడా ఒకలాగే ఉంటాయి''. అంటాడు సంత్‌ రవిదాసు మరోచోట ఇలా అంటారు - హిందూ పూజయీ దెహరా. ముసల్‌మాన్‌ మసీతి రవిదాస్‌ పూజయీ ఉస్‌రామ్‌కో, జిస్‌ నిరంతర్‌ ప్రీతి||
హిందువులు దేవతల్ని పూజిస్తారు. ముస్లింలు మసీదులోకెళ్లి నమాజ్‌ చదువుతారు. కానీ ప్రతి మనిషిలో కూడా ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవున్ని పూజించటం అన్నింటికన్నా ఉత్తమం. అందరికీ బ్రతికే అవకాశం ఇవ్వాలి. మనుషులు ఒకరితో ఒకరు ప్రేమ భావంతో స్నేహితుల్లా మెలగాలి అని అర్థం. మరోచోట - మసిజిద్‌ సోం కభు ఘిక్‌ నహిఁ మందిర్‌ సోసహిఁ ప్యార్‌, దో మహం అల్లాV్‌ా రామ్‌ నహీఁ, కV్‌ా రవిదాస్‌ చముర్‌|| రవిదాసు తనని తాను చముర్‌ అని ప్రస్తావించుకుంటూ ప్రత్యేకమైన ఆలోచనని కలిగిస్తున్నాడు. మాకు మసీదుపై వ్యతిరేకత లేదు. దేవాలయంపై ప్రత్యేక ప్రేమ లేదు. వ్యర్థమైన పూజలు ఇవన్నీ. అజ్ఞానాన్ని వదిలి జ్ఞానం పొంది నిజమైన మనసుతో మానవ సేవ చేయాలంటాడు. ఈ విధంగా హిందూ మతపు పతన దశలో ప్రవక్తగా ఉద్భవించి అనేక మతాల మూఢనమ్మకాల్ని వ్యతిరేకించి, మానవీయ ధర్మాన్ని ప్రవచించి భారతదేశ అంటరాని కులాలకి మహోన్నతమైన మర్గాన్ని చూపించిన సంత్‌ రవిదాస్‌ సదాస్మరణీయుడు.
డా|| జి.వి రత్నాకర్‌ 


Dr.G.V.Rattnakar essay about Saint Ravidas

నిర్గుణ భక్తి కావ్యంలోని గొప్ప విశేషం ఏమంటే వారి యొక్క మానవీయ దృక్పథం. వారి దృష్టి విలాసవంతమైన ఐశ్వర్యమైన జీవితాన్ని గడుపుతున్న వారిపై పడలేదు. వారి కవితా వస్తువు సామాన్య మానవుడు. సమాజంలో విభిన్నమైన వైషమ్యాల మధ్య పడి నలుగుతున్న ఆ వ్యక్తి వారికి ఆధారం.
భక్తి సాహిత్యం హిందీ సాహిత్యపు నిర్మాణంతోపాటు భారత సామాజిక పరిస్థితులకు పరిష్కారం చూపిస్తూ భారతీయ సామాజిక పరిస్థితిని బలంగా ప్రభావితం చేసింది. సంత్‌ రవిదాసు సామాజిక అస్థిరత్వాన్ని తగ్గించేందుకు బాగా ప్రయత్నించారు. సంత్‌ రవిదాసు బోధన, ఆయన సాధన సామాజిక జీవితానికి దగ్గరగా ఉంది. రవిదాసు భారతీయ సామాజిక ధార్మిక రంగాల్లోకి తన కరుణ, స్నేహభావాన్ని ప్రసరింపజేశాడు.
ఆయన కవిత్వానికి సంపూర్ణ జీవితం ఆధారంగా ఉంది. ఆయన జీవితం బహుముఖమైంది. సామాజిక ప్రగతికి ప్రతిబంధకాలైన వాటిపట్ల, ఆ ఆచారాల పట్ల, రవిదాస్‌ యుద్ధాన్ని ప్రకటించాడు. నాటి సామాజికత మూఢ విశ్వాసాలపై ఆయన తిరగబడ్డాడు. సామాజిక జఢత్వం కారణంగా ఆయన అనేక కష్టాల పాలయ్యాడు. తనని కష్టాల పాల్జేసిన సామాజిక జఢత్వాన్ని నిరోధించేందుకు ఆయన తన రచనల్ని ఆయుధాలుగా ప్రయోగించాడు. తన సమాజాన్ని హీన భావన నుండి విముక్తం చేసి వారిలో ఆత్మగౌరవ భావనని రవిదాసు కలిగించాడు. సంత్‌ రవిదాసు భక్తి, సాహిత్యం సమాజం నుండి మనిషిని తొలగించే ప్రయత్నం చేయలేదు. ఆయన విశాలమైన దృష్టి సమాజంలో సమానత్వపు బీజాల్ని నాటేందుకు తోడ్పడ్డాయి. నాటి సమాజంలో మత ప్రభావం అధికంగా ఉండడంతో ఆయన మతం, భక్తి మాధ్యమాలుగా తన భావనల్ని ప్రయోగించాడు. అన్యాయం, అసమానత్వం, కర్మకాండలు, దురాచారాల్ని వ్యతిరేకిస్తూ సంత్‌ రవిదాసు విప్లవాత్మకమైన రూపంలో మన ముందుకు వస్తున్నాడు. ఆయన తన వృత్తి పట్ల గౌరవభావం ఉంది. ఆయనకు తన కులం పట్ల ఉన్న భావన ఏమంటే తనకి అవకాశం ఉంటే ప్రతి జన్మలోనూ ఇదే కులంలోనే పుట్టాలని కోరుకున్నాడు. ఆయన ప్రేమ సద్భావాల అసలైన రూపాన్ని విశ్వాసంగా గ్రహించి సమాజానికి మార్గం చూపాడు. నిద్రపోతున్న ఆత్మని నిద్రలేపి పోరాట మార్గంవైపు మరలించాడు. ఆయన ప్రబోధాలు మానవ విముక్తి ప్రశ్నలతో సామాజిక సందర్భంతో కలిసి ప్రయాణించాయి.హిందీ కవిత్వ చరిత్రని ఒకసారి పరిశీలిస్తే, చరిత్ర పేజీలని వెనక్కి తిప్పితే నాటి సంత్‌ రవిదాసు చుట్టూ అలముకున్న పరిస్థితి ఎంత భయంకరమో, అమానవీయమైనదో తెలుస్తుంది. నిరంతరం దాడులు, అణచివేతలతో కూడిన భయకంపితమైన భారతీయ సమాజం నివాసాలు కోల్పోయి రేయింబవళ్లు భయం నీడ క్రింద బ్రతికిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిరంతరం వారి బ్రతుకు పోరాటం గోచరమౌతుంది. అలాంటి భయంకరమైన పరిస్థితిలో రవిదాసు ప్రభవించడం అనేది కారు చీకటిని దునుమాడిన ప్రజ్ఞా సూర్యునిలా తప్ప మరేమీ లేదు.
భారతీయ సామాజిక వ్యవస్థలో అసమానతలే పునాదులుగా గల సిద్ధాంతం మధ్య విదేశీ దండయాత్రల నడుమ భారతీయ సమాజం రవిదాసు బోధనల్ని శిరసావహించి ఆ పరిస్థితుల్లో వెలుగు దివిటీల్లా నిలబడింది. సంత్‌ రవిదాసు వ్యక్తిత్వం వినోదాలకు దూరంగా ఉండేది. ఆయన దార్శనిక బోధనలు ముసుగు కప్పుకొని ఉండేవి కావు. రవిదాసు పుట్టుక గురించి కొంత వివాదం ఉంది. కొంతమంది ఆయన (క్రీ.శ 1376లో జన్మించాడని కొంతమంది ఆయన క్రీ.శ 1471లో జన్మించాడని అంటారు. ఆయన 126 సంవత్సరాలు జీవించాడని చెప్తారు. రవిదాస్‌ రామాయణంలో ఆయన తండ్రి పేరు 'రాహు' తల్లి పేరు 'కర్మా' అని చెప్పుకున్నారు. ఆయన భార్య పేరు 'లోనా' అని చెప్పారు. ''నాగర్‌ జనా మేరీ జాతి విఖ్యాత చమార్‌'' అని ఆయన స్వయంగా తనని తాను 'చమార్‌'గా పరిచయం చేసుకొని కుల అహంకారాన్ని ఖండించాడు.
రవిదాసు తన బోధనల్లో తన వృత్తిని ఇలా ప్రకటించుకున్నాడు. ''జాకే కుటుంబ్‌ కే ఢేడ్‌ సమ్‌ ఢోర్‌ ఢోవత్‌!/ ఫిరిహుః ఆజహు జనారసీ ఆస్‌పాస్‌!'' రవిదాసు చెప్పులు కుట్టి, చెప్పులు మరమ్మత్తు చేసి పేదరికంతో వారణాసి దగ్గర సాధారణమైన జీవితాన్ని గడిపాడు. పుస్తక జ్ఞానం లేకున్నా ఆయన ఆత్మజ్ఞానపు అంతిమ స్థానాన్ని చేరుకున్నాడు. ఆయన జ్ఞానాన్ని ఆర్జించి దేశమంతటా పర్యటించాడు. ఆయన ప్రబోధాలకు ప్రభావితం చెంది ఘాలీరాణి, మీరాభాయి ఆయన శిష్యులుగా మారారు. సంత్‌ రవిదాసు సాహిత్యం అనేక చోట్ల దొరుకుతుంది. సాగర్‌ ప్రచురణ సభ పరిశోధన పత్రాలననుసరించి క్రింది పుస్తకాలు ఆయనవి అందుబాటులో ఉన్నాయి. 'రైదాస్‌ బేక్‌ బాని'. రైదాస్‌జీకి సాఖీ, తథా పద్‌, మొదలైనవి రవిదాసు 1576లో చనిపోయాడని కొందరు 1597లో చనిపోయాడు. మరికొందరు ప్రకటించారు.
రవిదాసు ఒకచోట- ''ఎకై మాటకీ సభీ భాండె/ కాన శూద్ర్‌ క్యా పాండె'' శూద్రుడు పండితుల మధ్య ఎలాంటి తేడాలు లేవు. అందరిలో ఒకేరకమైన రక్తం ప్రవహిస్తుంది. రక్తమాంసాలు కూడా ఒకలాగే ఉంటాయి''. అంటాడు సంత్‌ రవిదాసు మరోచోట ఇలా అంటారు - హిందూ పూజయీ దెహరా. ముసల్‌మాన్‌ మసీతి రవిదాస్‌ పూజయీ ఉస్‌రామ్‌కో, జిస్‌ నిరంతర్‌ ప్రీతి||
హిందువులు దేవతల్ని పూజిస్తారు. ముస్లింలు మసీదులోకెళ్లి నమాజ్‌ చదువుతారు. కానీ ప్రతి మనిషిలో కూడా ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవున్ని పూజించటం అన్నింటికన్నా ఉత్తమం. అందరికీ బ్రతికే అవకాశం ఇవ్వాలి. మనుషులు ఒకరితో ఒకరు ప్రేమ భావంతో స్నేహితుల్లా మెలగాలి అని అర్థం. మరోచోట - మసిజిద్‌ సోం కభు ఘిక్‌ నహిఁ మందిర్‌ సోసహిఁ ప్యార్‌, దో మహం అల్లాV్‌ా రామ్‌ నహీఁ, కV్‌ా రవిదాస్‌ చముర్‌|| రవిదాసు తనని తాను చముర్‌ అని ప్రస్తావించుకుంటూ ప్రత్యేకమైన ఆలోచనని కలిగిస్తున్నాడు. మాకు మసీదుపై వ్యతిరేకత లేదు. దేవాలయంపై ప్రత్యేక ప్రేమ లేదు. వ్యర్థమైన పూజలు ఇవన్నీ. అజ్ఞానాన్ని వదిలి జ్ఞానం పొంది నిజమైన మనసుతో మానవ సేవ చేయాలంటాడు. ఈ విధంగా హిందూ మతపు పతన దశలో ప్రవక్తగా ఉద్భవించి అనేక మతాల మూఢనమ్మకాల్ని వ్యతిరేకించి, మానవీయ ధర్మాన్ని ప్రవచించి భారతదేశ అంటరాని కులాలకి మహోన్నతమైన మర్గాన్ని చూపించిన సంత్‌ రవిదాస్‌ సదాస్మరణీయుడు.
డా|| జి.వి రత్నాకర్‌ 


11 ఏప్రిల్, 2011

ఈ పదేళ్ళ కవిత్వం పట్టుకున్నదేమిటి?

Courtesy : సూర్య పత్రిక ‘‘ అక్షరం'' 11-4-2011

సరదాగోనో, సీరియస్‌గానో పదేళ్ళ కవిత్వాన్ని గమనిస్తే ఎలా ఉంటుంది? లేదా పదేళ్ళ నుండి కవులు ఎలాంటి కవిత్వాన్ని రాస్తున్నారు? లేదా పదేళ్ళలో పత్రికలు, ఇంటర్నెట్‌ పత్రికలు ఎలాంటి కవిత్వానికి ప్రాధాన్యాన్నిస్తున్నాయి? పోనీ, పత్రికలకేమాత్రం సంబంధం లేకుండా కవులే స్వయంగా ప్రచురించుకున్న పుస్తకాల్లోనో, స్వేచ్చగా రాసుకోగలిగే అవకాశం ఉన్న బ్లాగుల్లోనో ఎలాంటి కవిత్వం కనిపిస్తుంది? మొదలైన ప్రశ్నలకు అందరికీ సంతృప్తికరమైన సమాధానాన్నివ్వలేకపోయినా, అలాంటి ప్రయత్నంతో వెలువడిన ఒక కవితాసంకలనాన్ని చూపించవచ్చు.దీని పేరు ‘‘అనేక’’ సుమారు 2000 నుండి 2009 వరకూ తెలుగులో వచ్చిన వచన కవితల్లో 182 కవితల్ని అఫ్సర్‌, వంశీకృష్ణ సంపాదకత్వంలో ‘‘అనేక’’ పేరుతో సారంగపబ్లికేషన్స్‌ వారు ప్రచురించారు. విలువైన విషయాల్ని ప్రస్తావిస్తూ సంపాదకీయం రాసినా, కొన్ని అంశాల్ని స్పర్శించలేకపోయారు. పైగా సేకరించిన కవితల్లోని అంశాల కంటే ఇతర అంశాల్ని ఎక్కువగా ప్రస్తావించినట్లుంది.
దండోరా నుండి గ్లోబలైజేషన్‌ దాకా, ముస్లిం సాంస్కృతికత నుండి ‘‘గుజరాత్‌ గాయం’’ దాకా వచ్చిన కవిత్వ సంకలనాల నుండి కవితల్ని తీసుకున్నా, ఆ యా కాలాల్లో వచ్చిన ఉద్యమాన్ని ప్రాతినిథ్యం వహించగలిగే కవితల్ని ఎంపిక చేయకపోవడం వల్ల ఈ పదేళ్ళ కాలంలో వచ్చిన ఉద్యమాలకి సరైన ప్రాతినిథ్యం ఇచ్చినట్లనిపించట్లేదు. ఆ ఉద్యమాల ప్రస్తావన చేసినా ఆ ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గని కవిత్వం రాసేవారి కవితల్ని ఎంపికచేయకుండా దీన్ని ‘‘ఒక ముద్రవేసిన తరువాత ఆ కవిని ఆ ముద్రలోంచి చూసి అతని కవిత్వ సారాన్ని, స్థానాన్ని అంచనా వేయడం అందరూ చేస్తారు. కనుక, అటువంటి పనిచేయడం లేదని’’ చెప్పుకుంటూ, మరో కవితని వేయడం కవి లక్ష్యాన్ని, ఆ కాలంలో ఆ ఉద్యమం పట్ల కవి ఆశించిన దాన్ని నీరు కార్చేప్రయత్నం చేసినట్లవుతుంది. ఉదాహరణకు ఎండ్లూరి సుధాకర్‌, కృపాకర్‌మాదిగ, దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి వంటి వాళ్ళు దండోరా గురించి బలమైన కవిత్వాన్ని రాస్తే, దాన్ని విస్మరించి, వాళ్ళు ఒకానొక సందర్భంలో రాసిన కవితల్ని ప్రచురించారు. అమ్మాయిలపై పెరుగుతున్న యాసిడ్‌ దాడుల గురించి ఎండ్లూరి సుధాకర్‌ రాసిన ‘‘దు:ఖగంధకామ్లవర్షం’’, కృపాకర్‌ సెజ్‌ లను వ్యతిరేకిస్తూ ‘ప్రత్యేక చావుమండళ్ళు’ అంటూ రాసిన కవితను, ఎజ్రాశాస్త్రి ‘‘మా ఊరికో శ్మశానం కావాలి’’ అని ప్రపంచీకరణ ప్రభావాన్ని పట్టిచూపే కవితల్నీ ఎంపిక చేశారు. ఎండ్లూరి దళితగోవిందం, ఖైర్లాంజీ సంఘటనలపైనా, ఇంకా రకరకాలుగా దళిత, మాదిగ జీవితాన్ని పండిరచిన కవితలెన్నో రాశారు. అలాగే మిగాతా వాళ్ళు కూడా రాసినా,వాటిని పట్టించుకోకుండా, మాదిగ జీవితానికే మాత్రం సంబంధం లేని కవి సీతారాం రాసిన ‘కుప్పం కాబ్లర్‌’’ కవిత తీసుకున్నారు.
‘‘ఈ చెట్టు కిందే /
మాతాత గూటం పాడతాడు /
దీనిలోనే మా అయ్య నడిచాడు /
నేనూ ఇక్కడే పాతుకుపోయాను పాతికేళ్ళుగా.../
ఇలా కొనసాగిన కవితలో ‘‘ ఈ మధ్యనే ఓ కవిగాడు దాపురించాడు నాకు /
నన్ను గమనించే వాడంటే నాకు పడదు.../
పాడెకడతానంటాను వాడి కవిత్వానికి నేను’’ వంటి కవిత్వాన్ని ఎంపికచేశారు.
అలాగే ఒక ముస్లిం దేశభక్తినీ, స్త్రీవేదననీ వ్యక్తీకరించిన ముస్లిం రచయితల కవితల కంటే కొండేపూడి నిర్మల రాసిన 
‘‘ దేశద్రోహికన్నీటి చుక్క’’ ను ప్రచురించారు. దీనిలో చూడండి
‘‘ఆస్తితో సహా ఆడదాన్ని ఏలుకోవడానికి /
కీర్తివంతులయిన నా అత్తింటి వారెవరో ముందుకొస్తారు /
బహుశా మరికొన్నిసార్లు వితంతువునవడానికి నేను /
పులకించిపోవాలి /
నిఖా సంబరాలు వెలిసిపోకుండానే /
ఫాతెహాలకు దర్బారు తీరిన మన జీవితాల్లో /
దేనికి మాత్రం అర్థసందర్భాలున్నా’’ యని ముస్లిం స్త్రీవేదనను పలికించారు. వీటి కంటే మరింతబలంగా తమ సమస్యల్ని మూలాల్లోకి వెళ్ళి, భాషతో సహా షాజహానా మరికొంతమంది ఇంతకంటే బలమైన కవిత్వాన్ని రాయలేదా? దీన్ని బట్టి కేవలం కవిత్వానికిచ్చిన ప్రాధాన్యం, ఆ అస్తిత్వం కోసం కవిత్వం రాసిన వారికివ్వలేదనిపిస్తుంది. దీన్నిబట్టి అస్తిత్వ ఉద్యమాల్ని గుర్తిస్తున్నట్లా? ఆ ఉద్యమాల పరిధి విస్తరించాలని భావిస్తున్నట్లా? స్త్రీవాదంలోని దళిత స్త్రీవాదాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని బలంగా అభివ్యక్తీకరించిన జూపాక సుభద్ర కవితల్ని వదిలేసి మరో కవితని ప్రచురించారు. ప్రాంతీయవాదాన్ని బలంగా వ్యక్తీకరించే కవితలు అనేకం ఉండగా వాటినీ పట్టించుకోకపోయినా, తెలంగాణ కవుల్నీ, కవిత్వాన్నీ మాత్రం అధికశాతంగానే రికార్డ్‌ చేయగలిగారు. అలాగే, కొద్దోగొప్పో ముస్లిం, క్రైస్తవ కవిత్వాన్ని రిప్రజెంట్‌ చేసే కొన్ని కవితలకు చోటు లభించినా,అందులోనూ బలమైన కవితల్ని తీసుకోలేదు.
ఎంపిక చేసిన వారికి స్వేచ్చ ఎంత ఉన్నా, అన్నింటికీ ఆర్థిక కోణమే ప్రధానమనే రీతిలో సంపాదకీయం కొనసాగించినా, కవిత్వం పేరుతో సౌందర్యానుభూతికే అధికప్రాముఖ్యాన్నిస్తూనే, ఆర్థిక సంఘర్షణలే నిర్దిష్టవాదాలు బయలుదేరడానికీ, బలం పుంజుకోవడానికీ కారణభూతమైయ్యాయని, అందువల్ల ప్రపంచీకరణ నీడలోనే పదేళ్ళ కవిత్వం నడిచిందనే సూత్రీకరణ చేసేప్రయత్నం చేశారు. నిజానికిది ప్రపంచాన్నీ, ఆంధ్రప్రదేశ్‌నీ అమెరికా ఆర్థిక నయనాలతో చూడ్డమే తప్ప, అన్ని అస్తిత్వ ఉద్యమాలకీ ఆర్థికమే కారణమనడం సరికాదు.కమ్యూనిష్టులు ప్రతిదాన్నీ ప్రపంచీకరణతో ముడిపెట్టి దాన్ని వ్యతిరేకించడం ఒక ఫ్యాషన్‌గా మార్చుకున్నట్లు, దేశీయవాస్తవికతను విస్మరించి కులాన్నీ, ప్రాంతీయతనీ దానిలోనే ఇరికించాలనుకునే ప్రగతిశీల గతస్మృతుల్నీ, అనుబంధాల్నీ వీడలేని సాహితీవేత్తలు కూడా ప్రయత్నిస్తున్నారు.దీనిలో భాగంగానే దీన్నీ భావించాలి.
ఈ దేశంలో ఏదో ఒకకులంలో పుట్టినా, పైకి కులం బాధ కనిపించనట్లుంటూనే, వాళ్ళు ఒక రాజకీయశక్తిగా ఎదగలేకపోవడానికి, ఆర్థికశక ి్తలేకపోయినా, సాంఘికంగా కులం వల్ల లభించిన అవకాశాల కారణంగా వైయక్తికంగానూ, వ్యవస్థీకృతంగానూ ముందుకి వెళ్ళడానికి కూడా కేవలం ఆర్థికపరమైన అంశాలే కారణమని భావించాలా?అయితే, ఈ పదేళ్ళలో వెనుకబడినతరగతుల నుండి నాయకత్వాన్ని వహించగలవాళ్ళు ఉన్నా, పెట్టిన పార్టీల్ని మళ్ళీ అగ్రవర్ణఆధిపత్యంలో నడుస్తున్న పార్టీల్లోనే విలీనం చేయడం వెనుక కులం కారణమా? ఆర్థిక పరిస్థితులు కారణమా? అనేది ఆలోచించాలి.
ఈ పదేళ్ళలో అటుసామాజికంగాను,రాజకీయంగాను దళితులు, వెనుకబడిన తరగతులు ముందుకొస్తున్నట్లే కవిత్వంలోను తమదైన బలమైన ముద్రను వేయడమే కాకుండా, పదిహేనువందల యేండ్లపాటు ఆధిపత్యాన్ని వహించిన కవిత్వానికి అర్థశతాబ్దంలోనే వణుకుపుట్టించగలిగారు. ‘‘వెనుకబడిన తరగతులు’’గా సాధించలేని అభివృద్ధిని ‘‘వెనుకబడిన కులాలు’’గా గుర్తింపజేసుకోవడం ద్వారా సాధించవచ్చని ఉద్యమాలు మొదలైయ్యాయి. తమ నిజమైన శత్రువుని గుర్తించడంలో కొంచెం అటూ ఇటైనా ఈపదేళ్ళలో వెనుకబడిన కులాల వాళ్ళు తమ జీవితానుభవాల నుండి ‘‘వెంటాడే కలాలు’’ పేరుతో 2001లో ఒక కవితా సంపుటిగా బయటకొచ్చారు. దీనిలోనూ ఆర్థికాంశాలున్నా, వాటికంటే కుల చైతన్యమే ప్రధానంగా కనిపిస్తుంది. వీళ్ళని వృత్తుల వాళ్ళగానే కాకుండా కులవృత్తుల వాళ్ళుగా పరిగణించడం వల్ల వాళ్ళ నిజమైన అస్తిత్వాన్ని గుర్తించినట్లవుతుంది.కానీ, శ్రామికుల చట్రంలోనే కట్టేయడం వల్ల వెనుకబడిన కులాల వాళ్ళకి తీరని అన్యాయమే జరిగిందని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటు, ఉద్యమాలతో ముందుకొస్తున్నారు.
సుమారు రెండు దశాబ్దాల పాటు తెలుగు కవిత్వాన్ని నిలదీసిన దండోరా కవిత్వాన్ని జల్లెడపట్టి ఉత్తమకవిత్వాన్ని ఒకచోటకు చేర్చిన కవితాసంకలనం ‘‘కైతునకలదండెం’’ (2008). ఈ దేశంలో కులం, మతం తమనెలా పీల్చిపిప్పిచేశాయో కులాన్ని ఆశ్రయించుకున్న ఆర్థిక, రాజకీయ,సాంస్కృతికాంశాల్ని రికార్డ్‌ చేసిన కవితా సంకలనమిది. ఇలాగే మతం తమనెలా హింసించిందో వ్యక్తిగతంగాను, సంకలనాల రూపంలోను ఈ పదేళ్ళలో ముస్లిం, క్రైస్తవ మైనారిటీకవిత్వానికి సంబంధించినవి వచ్చాయి. వీటినీ ఆర్థికపునాది మింగేసిందన్నట్లే చూపారు. కుల, మత పీడనను బలంగా చెప్పిన కవితలు దీనిలో తీసుకోలేదు. సంకలనంలో ఉన్నవాటి గురించి మాట్లాడాలంటే ఈ పదేళ్ళలో వెలువడిన ‘‘కవిత్వాన్ని’’ పట్టకోగలిగినా, కవుల ఆత్మల్ని పట్టించుకోలేదు. కవుల ఆశయాల్ని, లక్ష్యాల్ని గుర్తించాల్సిన కవితల్ని విస్మరించి కవుల్ని మాత్రం గుర్తించారు.పైకి ప్రపంచీకరణ ప్రభావమనే వ్యవస్థీకృత చైతన్యంగా కనిపించినా, వాళ్ళ జీవితలోతుల్ని తాకని కవిత్వాన్ని స్వీకరించి, ఆ వ్యక్తుల్ని గుర్తించి, పరోక్షంగా వైయక్తికతకు పీఠం వేశారు.
పుస్తకంలో ఎంపిక చేసిన కవితల్ని వివిధ విభాగాలుగా చేసి, ఆ విభాగానికి ఒక్కో పేరు పెట్టడంలో నూతనత్వం కనిపిస్తున్నా, కేవలం అవి ఆ వర్గంలోకి మాత్రమే వచ్చే కవితలని స్పష్టంగా చెప్పలేనివీ అనేకం అందులో ఉన్నాయి.అక్షరం, అనుభవం, అస్తిత్వం, అలజడి, ఆందోళన, అతడు`ఆమె, ఆవలితీరం, అనంతరం అని ‘‘అ,ఆ’’లతో ఒక క్రియేటివిటీని ప్రదర్శించడం చాలా మందికి అది ఒక చమత్కారమనిపించినంతగా, అందులోని సీరియెస్‌నెస్‌ గుర్తించకపోచ్చు.
కవిత్వ చరిత్ర మాత్రమే తెలుగు సాహిత్య చరిత్రగా వక్రీకరించడం సరైంది కాదని మన సాహిత్య చరిత్రకారుల్ని తప్పుపట్టిన విమర్శకులకు, మళ్ళీ అలాంటి అవకాశం ఇవ్వకుండా మాత్రం జాగ్రత్త పడుతూనే ఈ సంకలనాన్నితీసుకొచ్చారు. సుమారు తొమ్మిది వందల సంవత్సరాలుగా అవిచ్చిన ప్రవాహమైన పద్యకవిత్వాన్ని భావకవిత్వం బద్దలు కొడితే, భావకవిత్వంలోని స్వేచ్ఛాప్రియత్వం పేరుతో సమాజాన్ని పట్టించుకోనికవుల్ని అభ్యుదయకవిత్వం గాడిలో పెట్టింది. రాయడం వరకే పరిమితమైపోతే కుదరదని, దాన్ని ఆచరణలోనూ చూపాలని విప్లవకవిత్వం కవుల్ని మరింత హెచ్చరిస్తే, ఆచరణలోని ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ స్త్రీ, దళిత,బహుజన, ప్రాంతీయ, ముస్లిం, క్రైస్తవ మైనారిటీ కవిత్వ ఉద్యమాలు ముందుకొచ్చిన తర్వాత చాలామంది కలాలు మూతపడ్దాయి. దానితో అంతకు ముందు రాసిన వాటితోనే తమకి దక్కిన ‘‘కవి’’ గౌరవ మర్యాదల్ని కొనసాగించుకుంటూ పోతున్నవాళ్ళెంతో మంది ఉన్నారు. ఆధునికంలో ఉంటూనే, ‘‘గతకాలము మేలు, వచ్చు కాలముకంటే’’ అని పైకి అనకపోయినా, గతంలో రాసిన కవిత్వాన్నే నెమరువేసుకుంటూ మాత్రం బతికేస్తున్నవాళ్ళున్నారు. ఇలాంటప్పుడు నొప్పించక, తానొవ్వక ‘‘మానవతావాదం’’ పేరుతో సమకాలీనతను ఏమాత్రం పట్టించుకోకుండా కేలండర్‌ కవిత్వాన్ని రాస్తూ, ప్రభుత్వకవులుగా బతికేస్తున్న వాళ్ళూ ఉన్నారు. ఇలాంటిస్థితి పట్ల ఈ పదేళ్ళ కవిత్వాన్ని గమనిస్తున్న కవి ఇలా అంటున్నాడు.
‘‘బాధలేదని కాదులే!/
కాకపోతే, ఎవరిబాధో తప్ప/
రాయలేనితనం / .....
సొంతమూ, పరాయీ అని కాదు కాని/
నువ్వు నీదేహంలో సంచరించడం మానేసి /
ఎంతకాలం అయ్యింది, చెప్పకూడదూ,కాస్త ’’ (అఫ్సర్‌) అనడంలో నిత్యం రాయాల్సిన కవులు ఎందుకు రాయడంలేదో తెలుసుకోవాలనే తహతహ కనిపిస్తుంది. కవులు, సాహితీవేత్తలు అందరి ఓట్లు తమకి దక్కుతాయో లేదో, ఏదోలా దక్కించుకోవాలనుకొనే చాలా మంది రాజకీయవేత్తల్లా ప్రవర్తించకూడదనే ఆవేదన చాలామందికి ఉందని ఈ కవితా ఖండికచెప్తుంది. కానీ, దీనిలో నిజంగా అలా స్పందించిన వారి కవిత్వమేది? పదేళ్ళ కవిత్వాన్ని ఓ చోటుకి తీసుకుని రావాలనే ప్రయత్నం మంచిదే కాని, పదేళ్ళనే కాలంలో జరిగిన సంఘటనల్ని సరైన రీతిలో గుర్తిస్తే మరింత బాగుండేది.
(అనేక ` పదేళ్ళ కవిత్వం) కవితా సంకలనం, సంపాదకులు : అఫ్సర్‌, వంశీకృష్ణ, సారంగబుక్స్‌ ప్రచురణ, వెల. రూ.199లు. పుటలు: 400 ప్రతుల కోసం సంప్రదించాల్సిన చిరునామా: పాలపిట్టబుక్స్‌, లేదా ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలు)
-డా॥దార్ల వెంకటేశ్వరరావు
9989628049
(సూర్య పత్రిక ‘‘ అక్షరం’’ 11-4-2011)

01 ఏప్రిల్, 2011

ఆత్మహాత్యల కొనసాగింపే విగ్రహ విధ్వంసం -దివికుమార్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనసాహితి

 
From: divi kumar <divikumar1949@gmail.com>
Date: Fri, Apr 1, 2011 at 4:15 PM
Subject: Dear Daarla gaaru--Please forward my article in full text form to our literary friends.Please incorporate the same in your BLOG for many viewers. Yours Divikumar
To: vrdarla@gmail.com


(విగ్రహాలు.....వైఖరులు.....విధ్వంసాలు....! ఆంధ్రజ్యోతి శీర్షిక)

    సామ్రాజ్యవాద యుగంలో, ప్రపంచీకరణ థలో తెలుగుజాతిని ఆత్మహాత్యల సంస్కృతి పెనుభూతమై వెన్నాడుతోంది. వేలాది రైతుల, చేతివృత్తుల వారి ఆత్మహాత్యలు మనకు తెలుసు. 'మహాÑ నాయకులు (వై.యస్‌.రాజశేఖరరెడ్డి)  మరణవార్తలనో, (చంద్రబాబు) అరెస్టు వార్తలనో విని తట్టుకోలేక కూడా ఆత్మహాత్యలు జరిగాయి. ప్రత్యేక తెలంగాణా సాధన కోసం అమాయక విద్యార్ధులు వందలాదిమంది ఆత్మహాత్యలు చేసుకున్నారు. ఇలా ఆత్మహాత్యలనేది ఒక సంస్కృతిగా మారిపోవటం తెలుగుజాతినే తీవ్రంగా కలచివేస్తోంది. ఆధునిక చరిత్ర నుండి ఎన్నో పోరాటానుభవాలను పొందిన జాతి, స్వాతంత్రోద్యమం-వీర తెలంగాణా విప్లవ పోరాటం, శ్రీకాకుళోద్యమం, సిరిసిల్లా జగిత్యాల జైత్రయాత్రలు తదితర అనేక ఉద్యమాల అనుభవాలతో తలపండిన జాతి.....ఆత్మహాత్యా సంస్కృతిలో  చిక్కుపోవటం నిజంగా చారిత్రక విషాదం. ఈ విషాదం వెనుక వ్యక్తిగత-సామాజిక రాజకీయ-సాంస్కృతిక పరిణామాల వికృతపర్యవసానాలున్నాయి.
    అవి అలా వుండగా ఒక జాతి స్వయంగా తన భాషా, సాహిాత్య, సాంస్కృతిక ప్రతీకలుగా నిలిచిన వైతాళికుల విగ్రహాలపై దాడి చేసుకోవటం, విరగగొట్టుకోవటం, విధ్వంసం గావించుకోవటం, విసిరి నీళల్లోకి పడదోసేయటం కూడా ఆత్మహాత్యా సదృశమైనదే. నిజవేు! కొందరు దుందుడుకువాదులు, విధ్వంస స్వభావులు, విద్వేషం  తలకెక్కించుకున్న వారు, క్షణికోద్రేకపరులే ఆ దుశ్చర్యకు పాల్పడి వుండొచ్చు గాక! అయితే అది పదŠకం ప్రకారం, వ్యూహాత్మకంగా, కుట్రపూరితంగా జరిగిందనేది ఎవరం విస్మరించలేం. తనస్వార్ధ అధికార ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం, స్పష్టంగా తెలిసి కూడా ఉద్దేశ్యపూర్వకమైన నిర్లక్ష్యాన్నీ, ప్రేక్షక పాత్రనూ పోషించింది. జాతి వికాసానికి నిర్మాణాత్మకమైన ప్రగతిశీల రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలనందించలేని అభివృద్ధి నిరోధక ప్రభుత్వం విధ్వంసాత్మక చర్యల నడ్డుపెట్టుకొని తన ప్రాణం నిలుపుకోవాలని యత్నించటం కూడా రాజకీయాలలో వ్యక్తమవుతున్న ఒకానొక పతన సాంస్కృతిక విలువగానే చూడాల్సి వుంటుంది.
    ఆత్మహాత్యల కారణాలను గ్రహిాంచటానికి వివరణలూ, విశ్లేషణలూ చేసుకోవటం వేరు, వాటికి సాంఘిక ఆమోదాన్ని (సోషల్‌ జస్టిఫికేషన్‌) కల్పించటానికి ప్రయత్నించటం వేరు. ఆత్మహాత్యలను ఖండించని వారెవరుంటారు? వాటిని వీరోచిత చర్యలుగా అభివర్ణించటం అభూతకల్పనల అనుభూతి కవిత్వాలను అల్లటం, వాటిని అడ్డుపెట్టుకొని విద్వేష భావజాలాలలను వ్యాప్తి చేయటం మాత్రం ఖచ్చితంగా ఆత్మహాత్యల సంస్కృతికే దోహాదపడుతుంది.
    మార్చి 10వ తేదీన హౖదరాబాదులో టాంక్‌ బండ్‌పై జరిగిన విగ్రహాల విధ్వంసం తెలుగు జాతి తనను తాను సాంస్కృతిక ఆత్మహాత్య గావించుకోవటం తప్ప మరేమీ కాదు.
    ఇదొక సామూహిాక ఆత్మహాత్య. ఒక ప్రాంతం వారిపైనే ఉద్దేశించినట్టుగా ఇది స్పష్టమవుతోంది. గానీ పదిహాేను కోట్ల జనులున్న ఒక విశిష్ట మానవ జాతి తన స్వంత చేతులతో తన గుండెను తాను పొడుచుకోవటం లేక తన మెడను తాను ఖండించుకోవటం.....ఆత్మహాత్య కాక ఇంకేమిటి?
    ''తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు.....రాసిన వేమన, మానవ సమాజాన్ని ఉద్దేశించి మనదైన భాషలో ఒక జీవితసత్యాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటాడు. తెలుగువాడు  ప్రపంచంలో తలెత్తుకు చెప్పుకోగలిగిన సాంస్కృతిక విలువలను వేమన మనకందిస్తే ఇప్పుడు మనం ప్రపంచం ముందు తలదించుకోవాల్సిన దురవస్థలో చిక్కుకున్నాం. వేమన పద్యం రానివాడూ, శ్రీశ్రీ కవితావాక్కుని ఎరగనివాడూ తెలుగునాట ఎవరైనా వున్నారా? ''సుకవి జీవించు ప్రజలనాల్కలందు అని గుర్రం జాషువా చెప్పింది ప్రపంచ కవులందరకూ వర్తించదా? విశ్వనరుడే సుకవి కాగలుగుతాడు. హ్రాస్వ దృష్టి గలవాడు బావిలో కప్పలా మిగులుతాడు.
    జాతి ''ఆత్మహాత్యలను నిర్దుష్టంగా ఖండించలేకపోవటం కూడా ఆ జాతికి ఆత్మహాత్యాసదృశమైనదే! జాతి జీవితంలో అదొక ద్రౌపదీ మానభంగంలా, కురువంశానికొచ్చిన కళంకంలా చారిత్రక విషాదంగా మిగిలిపోతుంది. సాహిాత్యకారులై వుండి భాష, సాహిాత్యం, సంస్కృతుల జాతీయ ప్రతీకలపై దాడి జరిగితే కొందరు దుర్మోధనులై విర్రవీగటమూ, ఇంకొందరు కర్ణులై (ఉద్యమ)-స్నేహా బంధానికి కట్టుబడి పోవటమూ, ఇతరులు భీష్మపితామహులై తలను వాల్చుకోవటమూ జరుగుతోందంటే ''దకక్షులెవ్వారలుపేక్షసేతురొ, వారల చేటగుగాకÑÑ (తిక్కన-ఉద్యోగపర్వం) అనక తప్పటం లేదు.
    విధ్వంసాన్ని ''విధ్వంసం అనటంలోనే కుట్రదాగుందిఅనటమంటే...నోరెత్తి మాట్లాడటాన్నే నిషేధించటం కాదా యిది! 'వివిధ (13.3.2011) స్పందనలలో నన్ను అత్యంత నిరాశపరిచింది వరవరరావు మాటలు. ఆయనతో నాకు 42 ఏళ పరిచయం. ఆయన డాక్టరేట్‌ పట్టా కోసం పరిశోధించి ప్రచురించిన ''తెలంగాణా విమోచనోద్యమం-తెలుగు నవల. సమాజ సాహిాత్య సంబంధాల విశ్లేషణఒక రిఫరెన్స్‌ బుక్‌లా నా పుస్తకాల అరల్లో చేతికందుబాటులో వుండే గ్రందŠం. ఆయన విమర్శ-ఆత్మవిమర్శ గురించి, తప్పులు సరిదిద్దుకోవటంలో ఆ ప్రక్రియ విశిష్టతను గురించీ ఎక్కువగా రాస్తారు.  విమర్శ-ఆత్మవిమర్శే కాదు. ఆత్మఖండన అనేది కూడా ఒకటుంటుంది. జలగం వెంగళరావు ప్రభుత్వంలో ఆస్థానకవి పదవిని అలంకరించిన దాశరధిని ''నిజాముకు వ్యతిరేకే గాని రాచరికానికి కాదనిÑÑ తాత్పర్యం చెప్పిన వరవరరావు (సృజన సంపాదకీయం-సెప్టెంబరు 77) దాశరధికి అన్యాయం ఎవరో చేశారన్నట్టు రాయటం ఏం సబబు? పైన పేర్కొన్న పరిశోధన గ్రంధంలో తెలంగాణా చరిత్రను తడిమిన ఆయన కొమరం భీం పేరు ప్రస్తావించనే లేదు. తాను స్మరించని పేరుని ఎవరో విస్మరించారనటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? జీవితపు అట్టడుగు పొరల నుండి ప్రజాఉద్యమ నాయకునిగా ఎదిగిన కోరాపుట్‌ చాషీమూలియా ఆదివాసీ సంఘం నాయకుడు కేండ్రుక అర్జున్‌ హాత్యను ఖండించలేని వరవరరావు కొమరం భీం విగ్రహాం గురించి పదే పదే ప్రస్తావించటమొక వైరుధ్యం కాదా?
    ''తెలంగాణా విమోచనోద్యమం......లో ఆయన రాసిన ఈ వాక్యాలు చూడండి. ''ఆరంభకాలంలో ఈనాటి ఆంధ్రదేశమంతా తెలంగాణవేు... తెలంగాణమంటే తెలుగువారుండే దేశమని అర్ధం. ఇది ప్రాచీన శబ్దం....రెండో నిజాం అయిన నిజామాలీఖాన్‌ 1766లో కోస్తా జిల్లాలను, 1800ల్లో రాయలసీమను ఇంగ్లీషు వారికి దత్తం చేశాడు. విశాలమైన తెలంగాణం ఈ విధంగా రెండు భాగాలుగా చీలిపోయింది (పేజీ 25) తెలంగాణా విమోచనోద్యమం-ఫ్యూడల్‌ భూస్వామ్య సంబంధాల నుంచి విముక్తి అనే అర్ధంలో ఇంకా అసంపూర్ణంగానే మిగిలిపోయింది. (పేజీ 42-తెలుగు నవల-పరిశోధనా గ్రంధం నుండి)
    ఆంధ్ర-తెలంగాణా అనే భావన విషయంలో వీర తెలంగాణా పోరాట నవలలు ఆరింటిని వరవరరావు పరిశోధించి నిగ్గు తేల్చిన సారాన్ని తానే నిరాకరించే విధంగా ప్రయాణించటం నాలాంటి వాడికది విషాదం. ఆయన ''ఆత్మ ఖండనకు (స్వవచన వ్యాఘాతం అనొచ్చునేమో) పాల్పడుతుంటే తనను తాను పల్చన చేసుకొంటున్నాడనేదే నా బాధ.
    ఆయన పరిశీలించిన 6వ నవల 'సింహాగర్జన (రచన. పమిడిముక్కల లక్ష్మీకాంతమోహాన్‌) అది సాయుధ పోరాటం రెండవ థ ముగియక ముందే రాసిన నవల. వరవరరావు మాటల్లోనే ముల్కీ-నాన్‌ముల్కీ (తెలంగాణ-ఆంధ్ర) అన్న భావనతో ఆంధ్ర నుండి వచ్చిన కావ్రేుడ్‌ పట్ల ''విముఖత-వ్యతిరేకత-ఈర్ష్య కలిగి వుండటం ''సంకుచితమైనదిÑÑ. ''నేరంÑÑ చేయటంతో సమానమైనది. అంతేకాదు కమ్యూనిస్టు పార్టీకి హానిని కలిగించే ''నీచపు ఆలోచనÑÑ ఇవన్నీ వరవరరావు రాసినవే. పాఠకులు స్పష్టంగా అర్ధం చేసుకోగలందుకు కొద్ది పేరాలు యదŠాతధంగా యిస్తున్నాను.
    ''నిజాయితీ, త్యాగం, సేవాభావం, కృషి విషయంలో రామిరెడ్డిలో వేలెత్తి చూపడానికి ఏ లోపమూ లేదు. కాని అతనికి తెలియకుండానే అతని మనసులో ముల్కీ-నాన్‌ముల్కీ (తెలంగాణ ఆంధ్ర) అనే ఒక భావన ఏర్పడి తాలూకా ఆర్గనైజరుగా ఆంధ్రరాష్ట్ర కమ్యూనిస్టు కమిటీ పంపించిన గుంటూరుజిల్లా నివాసి శ్యాంసుందర్‌రావు పట్ల విముఖత, వ్యతిరేకత, ఈర్ష్యాభావాలు ఏర్పడినాయి. శ్యాంసుందర్‌రావు శత్రువుచేతిలో చిక్కి శత్రువు ప్రాణాలు తోడేస్తున్నప్పుడు కూడా రామిరెడ్డి జాడ చెప్పకపోయినప్పుడు గానీ తాను ఎంత సంకుచితంగా ఒక వుత్తమమైన కావ్రేుడ్‌ గురించి ఆలోచించాడో రామిరెడ్డి గ్రహిాంచుకోలేదు. అతనిలోని ఈ బలహీానతను ఒక సామాన్య కార్యకర్త కూడా ఎత్తి చూపాడు.
    ఆసఫ్‌జాహిా పరిపాలన వలన రెండు వందల సంవత్సరాల పాటు మూడుకోట్ల తెలుగు ప్రజలు వేర్పడి జీవించవలసి వచ్చింది. ఆంధ్ర ప్రాంతంలోని రెండుకోట్ల ప్రజలు ఒక రాజకీయ ఆర్ధిక వ్యవస్థలోనూ తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు మరొక రాజకీయ ఆర్ధిక వ్యవస్థలోనూ జీవించవలసి రావడం వల్ల ఆర్ధిక రాజకీయ రంగాల్లోనే కాకుండా సాంఘిక రంగంలో కూడా మానసిక అవగాహానలో కూడా అంతర్వులు, అవగాహానా సమస్య ఏర్పడినవి. ఈ ఆర్ధిక రాజకీయ వ్యత్యాసాలకు కారణమైన పాలకవర్గాలే ఈ అవగాహానా సమస్యలను పరిష్కరించే కృషికి బదులు అవి అపోహాలుగా, పరస్పర అవిశ్వాసాలుగా పెరిగే స్థితికి తీసుకుపోయినవి. ఈ స్థితిని తొలగించవలసిన కమ్యూనిస్టు పార్టీ కూడా ఈ స్థితి వల్ల వచ్చిన సమస్యలు ఎదుర్కోక తప్పలేదు.
    తాను నేరం చేస్తున్నానని తన హాృదయాంతరాళంలో రామిరెడ్డి నమ్మాడు. అలాంటి నీచపు ఆలోచన పార్టీకి హానికరమని కూడా అతడు నమ్మాడు. కాని తన బలహీానతను మాత్రం అతడు వదిలించుకోలేకపోయాడు.
    శ్యాంసుందర్‌రావును యూనియన్‌ పోలీసులు చంపారన్న వార్త విన్నప్పుడు ఆవేదనతో రామిరెడ్డి హాృదయం వ్రయ్యలయ్యింది. రామిరెడ్డి పశ్చాత్తాపంతో తపించిపోయి తోటి కావ్రేుడ్స్‌ వద్ద తన సంకుచితమైన ఆలోచనలు చెప్పుకుని క్షమాపణ కోరుకున్నాడు.
    తెలంగాణ రైతాంగ పోరాటం నిర్వహిాంచిన కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల్లో కూడ చుట్టూవున్న భూస్వామ్య సంస్కృతి ప్రభావం వల్ల ప్రాంతీయ, మత, కులతత్త్వాలు పూర్తిగా లేకుండాపోలేదు. ఈ కార్యకర్తలు కూడా యీ వ్యవస్థ నుంచి వచ్చినవాళే. ఆకాశంలోనుంచి వూడిపడినవాళు కాదు. కనుక కొత్త ఆలోచనలు వాళను కొత్తగా మలచాల్సిందే తప్ప పాత అలవాట్లు లేకుండానే, పాత భావాలు లేకుండానే వాటితో ఘర్షణ పడకుండానే వాళు కొత్త సమాజ నిర్మాణానికి పూనుకున్నారనుకోవడం అసహాజమైన విషయం. ఈ అంశాన్ని సూచనప్రాయంగా చూపించడానికే రచయిత రామిరెడ్డి పాత్రలో ఈ బలహీానతను చిత్రించాడని అర్ధం చేసుకోవచ్చు. ఈ నవలా రచయిత ఉద్యమాన్ని దూరంనుంచి చూసినవాడు కాకుండా ఉద్యమంలో తలమునకలుగా వున్నవాడుగా కనిపిస్తాడు. ఈ బలహీానతలు వుండడం కాని వున్నాయని చిత్రించడంగాని లోపం కాదు. ఈ బలహీానతలున్నా కార్యకర్తలు అవి దాచుకుని నటించలేదు. వ్యక్తం చేసి సరిదిద్దుకున్నారు. ఆచరణలో సరిదిద్దుకున్నారు. విమర్శ ఆత్మవిమర్శ అనే మార్క్సిస్టు అవగాహానతో తమ ఆచరణను మెరుగుపర్చుకున్నారు. పోరాటం మందగించినపుడు ఈ ఆత్మవిమర్శ, విమర్శ, లోపించి ఈ బలహీానతలే ప్రబలంగా పైకి వచ్చాయి.ÑÑ (తెలంగాణా విమోచనోద్యమం-తెలుగు నవల పేజీ 419-420)
    ఆనాడు (1980) వరవరరావుగారి అవగాహాన ప్రకారం ''కుల-మత-ప్రాంతీయ తత్త్వాలకుకారణం భూస్వామ్య సంస్కృతీ ప్రభావం. ఉద్యమ కార్యకర్తలు ఈ బలహీానతల్ని విమర్శ-ఆత్మవిమర్శ అనే మార్క్పిస్టు అవగాహానతో తమను తాము సరిదిద్దుకున్నారు. ఆచరణను మెరుగుపరచుకున్నారు. ''పోరాటం (ఫ్యూడల్‌ వ్యతిరేక) మందగించినపుడు ఈ ఆత్మవిమర్శ, విమర్శ లోపించి ఈ బలహీానతలే ప్రబలంగా పైకి వచ్చాయి.ÑÑ అని కూడా ఆయనే రాశారు. తెలంగాణాలో ఇంకా 'పచ్చ(పాములా)గా వున్న భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కొనసాగాల్సిన పోరాటాన్ని కమ్యూనిస్టు ఉద్యమం నీరుగార్చుకున్న ఫలితంగానే యిలా జరుగుతోందని నాబోటివాని ఆవేదనా పూర్వక ఆరోపణ. పోరాటం ఉధృతంగా సాగిన కాలంలో తెలంగాణా-ఆంధ్ర సాధారణ ప్రజల నడుమ ఐకమత్యం వుండింది. పాలకుల నడుమ కూడా (కోస్తాజిల్లాల్లో క్రూరంగా పోలీసు నిర్బంధాలూ-బూటకపు ఎన్‌కౌంటర్లూ...1948-51లో చాలా జరిగాయి) ఐక్యత వుంది. ప్రజల నడుమ అనైక్యతను పెంచుతున్నది భూస్వామ్య-బూర్జువా పాలకులేనని వరవరరావుగారు కూడా 30 ఏళ క్రితం చెప్పారు. ఇప్పుడు తన మాటలనే తాను ఖండించుకుంటూ...ఆత్మఖండన గావించుకోవటం....టాంక్‌బండ్‌పైన విధ్వంసాన్ని ఖండించకుండా 'ప్రజలపేరుతో పరోక్ష సమర్ధింపుకు పూనుకోవటం ఆయన స్థాయికి తగదు. సింహావలోకనం నవల 60సం||ల క్రితపుది. వరవరరావు పరిశోధన 30 ఏళ నాటిది. ఆయన చేసుకుంటున్నది ఆత్మఖండన కాకుండా 'విమర్శ-ఆత్మవిమర్శల పరికరంతో గతితార్కిక అభివృద్ధి క్రమంలో తాను సాగుతున్నానని ఆయన భావిస్తుంటే.....మొత్తంగా వామపక్ష ఉద్యమంలోనే అది చర్చనీయంశమవుతుంది. అపుడు సాహిాత్యకారులు ప్రాంతాలుగా కాక దృక్పదŠం ప్రాతిపదికగా మరోసారి విభజనకు గురికావాల్సి వుంటుంది.

-దివికుమార్‌
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనసాహితి