"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

07 సెప్టెంబర్, 2026

అరసం ఆధ్వర్యంలో ఎండ్లూరి సుధాకర్ గారి కావ్య త్రయం పై ఆచార్య దార్ల ప్రసంగం

 ఆచార్య ఎండ్లూరి  ‘కావ్యత్రయం’దళిత చైతన్య పరిణామానికి ప్రతీక

- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్య.

ఆంధ్రజ్యోతి దినపత్రిక 7.9.2026 సౌజన్యంతో 
ప్రభంజనం దినపత్రిక 7.9.2026 సౌజన్యంతో 

మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

 సమాజంలో మూడు తరాల దళితుల సామాజిక అస్తిత్వానికి దర్పణంగా ఎండ్లూరి సుధాకర్ గారి కావ్య త్రయం (కొత్త గబ్బిలం, వర్గీకరణీయం, గోసంగి దీర్ఘకావ్యాలు) నిదర్శనంగా నిలుస్తుందనిహెచ్ సీయు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం వారి వారం వారం అంతర్జాల ప్రసంగ పరంపరలో భాగంగా ఆదివారం ఉదయం (6.9.2026) ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రత్యేక ప్రసంగం చేశారు. ఈ సమావేశానికి అరసం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి అధ్యక్షత వహించారు.ఈ మూడు దీర్ఘకావ్యాలను సమగ్రంగా పరిశీలిస్తే దళిత అస్తిత్వం, హక్కులు, చారిత్రక గుర్తింపు అనే మూడు కీలక దశలుగా అవి కనిపిస్తాయని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. దళిత జీవితానుభవాన్ని కేవలం వ్యక్తిగత వేదనగా కాకుండా సామాజిక చరిత్రగా, సామాజిక చరిత్రను అస్తిత్వ ప్రశ్నగా, అస్తిత్వ ప్రశ్నను హక్కుల పోరాటంగా సుధాకర్‌ తన కావ్యాల్లో మలిచారని దార్ల వివరించారు. ‘కొత్త గబ్బిలం’లో దళిత స్వరం కోసం అన్వేషణ, ‘వర్గీకరణీయం’లో హక్కు కోసం వాదన, ‘గోసంగి’లో చరిత్రలో అస్తిత్వాన్ని పునఃస్థాపించుకునే ప్రయత్నం కనిపిస్తుందని చెప్పారు.

దిశ దినపత్రిక 7.9.2026 సౌజన్యంతో 
విశాలాంధ్ర దినపత్రిక 7.9.2026 సౌజన్యంతో 
నినాదం దినపత్రిక 7.9.2026 సౌజన్యంతో 



సాక్షి దినపత్రిక 7.9.2026 సౌజన్యంతో 

విశ్వవిద్యాలయంలో పనిచేసే ఆచార్యులు చేయాల్సిన పనులన్నీ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చేస్తున్నారని, ఎండ్లూరు సుధాకర్ గారి కావ్యత్రయాన్ని చక్కటి విశ్లేషణాత్మక ప్రసంగం ద్వారా మూడు దీర్ఘ కావ్యాల్లోని సాహిత్య, సామాజిక, చారిత్రక పరిణామాలను శాస్త్రీయంగా విశ్లేషించారని సభాధ్యక్షులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ ప్రసంగంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో అరసం కార్యదర్శి ఆనంద్,  ఆచార్య ఎన్.ఈశ్వరరెడ్డి, రచయిత డా.వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి,  టి.రమణయ్య, లెనిన్ బాబు, గోవింద్, అధిక సంఖ్యలో సాహితీవేత్తలు, పరిశోధకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.