"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

పత్రికలు దార్ల (విద్యా సమాచారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పత్రికలు దార్ల (విద్యా సమాచారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26 మార్చి, 2024

హెచ్ సియు తెలుగు శాఖను సందర్శించిన సిఐఐఎల్ బృందం

 హెచ్ సియు తెలుగు శాఖను సందర్శించిన సిఐఐఎల్ బృందం


ఆంధ్రజ్యోతి దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో

వెలుగు దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో


నమస్తే దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో



తెలుగు న్యూస్ టైమ్స్ దినపత్రిక పత్రిక, 26.3.2024 సౌజన్యంతో

ఈనాడు దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో


సాక్షి దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో
నవతెలంగాణ దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో

దిశ దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో

మన తెలంగాణ దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో


నమస్తే తెలంగాణ పత్రిక, 26.3.2024 సౌజన్యంతో

మైసూర్ లో ఉన్న భారతీయ భాషా సంస్థలో శిక్షణ పొందుతున్న కొంతమంది పరిశోధకులు అధ్యాపకులు సోమవారం నాడు (25.3.2024) హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగుశాఖను, సందర్శించారు. దీంతోపాటు ఇక్కడే ఉన్న అంతరిస్తున్న భాషలు మరియు మాతృభాషల అధ్యయన సంస్థ (సి ఇ ఎల్ & ఎం టి ఎస్) శాఖను కూడా సందర్శించారు. 





 ఆరుగురు సభ్యులు గల ఈ బృందానికి డాక్టర్ మిరియాల సత్యనారాయణ నాయకత్వం వహించారు. వీరిని తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,  సి ఇ ఎల్ & ఎం టి ఎస్  శాఖ అధ్యక్షులు పమ్మి పవన్ కుమార్ నీ, తెలుగు శాఖలో ఉన్న ఇతర అధ్యాపకులు ఆచార్యులు ఎం. గోనా నాయక్, పి.వారిజారాణి,  వంగరి త్రివేణి,‌ డా.బాణాల భుజంగరెడ్డి, డా.పి.విజయ్ కుమార్, డా. భాశెట్టి లత తదితరులను కలిశారు‌ ఈ బృందంలో ఏ.ప్రేమ, సంతోష్, కవిత, దక్షిణామూర్తి, సి.బసవరాజు, కుముద తదితరులు ఉన్నారు. 

భారతీయ భాషా సంస్థ (సిఐఐఎల్) భారతప్రభుత్వానికి, పార్లమెంటుకు భాషాసంబంధమైన విషయాలలో ప్రధాన సలహాదారు సిఐఐఎల్ , భారతీయ భాషలకు సంబంధించిన పరిశోధన, పరరక్షణ వంటివెన్నో ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఈ బృందానికి నాయకత్వం వహించిన డా.మిరియాల సత్యనారాయణ వివరించారు. సిఐఐఎల్ లోని ప్రాంతీయ భాషా కేంద్రాలు( ఆర్ ఎల్ సి)భారతీయ భాషలను బోధించడంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నాయని డా.మిరియాల పేర్కొన్నారు. దక్షిణ ప్రాంతీయ భాషా కేంద్రం, మైసూరు త్రిభాషా సూత్రం ఆధారంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ఉపాధ్యాయులకు పరిశోధకులకు దక్షిణ భారతీయ భాషలను బోధిస్తోంది. పదినెలల కోర్సులో భాగంగా తెలుగు, మలయాళు కన్నడ, తమిళం కోర్సులను నేర్చుకునేందుకు మైసూరులో ప్రత్యకమైన శిక్షణనివ్వడం జరుగుతుందని డా.మిరియాల చెప్పారు . శిక్షణలో భాగంగా ఈ విద్యాసంవత్సరంలో (2023-24) తెలుగు భాషను నేర్చుకుంటున్న తెలుగు టీచర్లు రెండు తెలుగు రాష్ట్రాలలో భాషా వైవిద్యాన్ని తెలుసుకునేందుకు తెలుగు రాష్ట్రాలలో పర్యటన చేయడం లక్ష్యంగా పెట్టుకొని, ఈ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ ని ఎంపిక చేసుకున్నామని తెలిపారు.

జనప్రతిధ్వని దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో


తెలుగు భాషా సంస్కృతిక, చారిత్రిక, మత, సామాజిక, ఆర్థికాంశాలను మరింత లోతుగా తెలుసుకునేందుకు 14 రోజుల ఈ ఎడ్యుకేషన్ టూర్ ఎంతగానో ఉపకరిస్తుందని ఆయన అన్నారు. దీనిలో భాగంగానే,  తెలుగు భాషా సాహిత్య బోధనల్లో అత్యుత్తమ స్థాయిలో ఉన్న సంస్థలలో హెచ్ సియు, తెలుగు శాఖ ఒకటి కావడం వల్ల ఈ విశ్వవిద్యాలయాన్ని తమ బృందం సందర్శించామని, వివిధ కార్యక్రమాలను ఈ విశ్వవిద్యాలయంతో కలిసి చేయడానికి ఒక (యం ఓ యు)  చేసుకోవాలని భావిస్తున్నామని ఈ బృందానికి నాయకత్వం వహించిన డా.మిరియాల సత్యనారాయణ చెప్పారు. పరస్పరం కలిసి పనిచేయాలని ఆకాంక్ష మంచిదేనని అయితే అటువంటి ఒప్పందాలు చేసుకోవడానికి విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఒక విధానం ఉంటుందని, దాని ద్వారా చేయాలని, సంబంధిత ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేస్తారని తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చెప్పారు.


ప్రజాప్రశ్న దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో

ఇటువంటి సందర్శనవల్ల  భాషల స్థితిగతులు అవగాహన చేసుకోవచ్చని అంతరిస్తున్న భాషలు మరియు మాతృభాషల అధ్యయన సంస్థ (సి ఇ ఎల్ & ఎం టి ఎస్) అధ్యక్షులు ఆచార్య పమ్మి పవన్ కుమార్ చెప్పారు. తెలుగు నేర్చుకుంటున్న విద్యార్థులతో అధ్యాపకులు మాట్లాడారు. తెలుగు నేర్చుకోవడంలో ఉన్న కొన్ని మెళకువలను అధ్యాపకులు వివరించారు. 


14 ఫిబ్రవరి, 2024

వెయ్యేళ్ళ తెలుగు పద్య సాహిత్య వైభవం (13.2.2024) ప్రత్యేక ప్రసంగం

ప్రజాప్రశ్న దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో 
ఆంధ్రజ్యోతి దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో 

ఈ నగరం దినపత్రిక,14.2.2024 సౌజన్యంతో 


దిశ దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో 
తరణం దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో 
విశాలభారతి దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో 
నవతెలంగాణ దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో 
మన తెలంగాణ దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో 
ఈనాడు  దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో 
ఆంధ్రప్రభ  దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో 
సాక్షి దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో 
నమస్తే న్యూస్  దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో 
ఆంధ్రజ్యోతి    దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో 
తెలుగు లోకం (రాజమహేంద్రవరం)దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో 

జన ప్రతిధ్వని (రాజమహేంద్రవరం ) దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో 

ఈనాడు దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో 

https://telugunewstimes.in/telugu-language-has-the-power-to-unite-the-languages-of-the-world/



ప్రపంచ భాషల్ని తనలో కలుపుకోగలిగే శక్తి తెలుగు భాషకే ఉంది’

  • మహాసహస్రావధాని డా.మేడసాని మోహన్ వ్యాఖ్య. 


ప్రపంచంలోని అనేకభాషలను తనలో కలుపుకోగలిగీ సహజత్వాన్ని కోల్పోని మహత్తరశక్తి తెలుగు భాషకు స్వంతమని మహాసహస్రావధాని డా.మేడసాని మోహన్ పేర్కొన్నారు. హెచ్ సియు తెలుగు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నాడు (13.2.2024) మానవీయ శాస్త్రాల ఆడిటోరియంలో ‘వెయ్యేళ్ళ తెలుగు పద్య సాహిత్య వైభవం’ అనే అంశంపై ప్రత్యేక ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో డా.మేడసాని మోహన్ ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. తెలుగు వారి వారసత్వం, సంస్కృతి, సాంప్రదాయిక జ్ఞానాన్ని పొందడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆచార్య దార్ల వివరించారు. తెలుగు ద్రావిడ భాషా జన్యమే అయినప్పటికీ అధికంగా సంస్కృత ప్రభావం ఉందని, దాని వల్ల వేద సంస్కృతి తెలుగు భాషలో కనిపిస్తుందని డా.మేడసాని మోహన్ వ్యాఖ్యానించారు. తెలుగులో ఛందోబద్ధమైన పద్యం ఒక ప్రత్యేకత కాగా, అవధానం మరింత ప్రత్యేకంగా వెలుగొందుతుందని ఆయన వివరించారు. నన్నయ, తిక్కన, ఎర్రని, శ్రీనాథ, పోతన, శ్రీకృష్ణ దేవరాయల, పెద్దనాదికవుల పద్య విశష్టతలను సోదాహరణంగా ఆయన వివరించారు. మానవుల మనస్తత్వాన్ని ఆంధ్ర మహాభారతంలో ఉన్నాయనీ దాన్ని నన్నయ ఎంతో పరిశీలనతో వివిధ పాత్రల రూపంలో సృజనీకరించారని ఆయన వివరించారు. 

ఇతరభాషలతో పోలిస్తే తెలుగుకి గొప్ప రామణాయికత, ఇతర భాషల్లో లేని అనేక ప్రక్రియలు ఉన్నాయని  ముఖ్య అతిథిగా పాల్గొన్న మానవీయ శాస్త్రాల విభాగం డీన్ ఆచార్య వి.కృష్ణ  పేర్కొన్నారు. పద్యాల్లోని భావుకత, సౌందర్యంతో పాటు ఆ పద్యం అందించే మూలధర్మాన్ని కూడా అవగాహన చేసుకోవాలని ఆయన ఉద్బోధించారు.

మన విశ్వవిద్యాలయం ఐఓఈ ప్రాజెక్టు ద్వారా ఇటువంటి సదస్సులు, ప్రత్యేక ఉపన్యాసాలకు ఆర్థిక సహాయం చేస్తారని, దాని ద్వారా విద్యార్థులు ఎప్పటికప్పుడు నూతన విషయాలను, విజ్ఞానాన్ని పొందవచ్చునని గౌరవ అతిథిగా పాల్గొన్న ఆచార్య ఎం.మురళీమనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య ఎం.గోనానాయక్, ఆచార్య పమ్మి పవన్ కుమార్, ఆచార్య డి.విజయలక్ష్మి, ఆచార్య వారిజారాణి, డా.భూక్యాతిరుపతి, డా.బాణాల భుజంగరెడ్డి, డా.డి. విజయకుమారి, పరిశోధకులు,విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



తెలుగు న్యూస్ టైమ్స్, చెన్నై దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో 

















10 జనవరి, 2024

భారతీయ భాషా దినోత్సవం (9.1.2024) HCU

 విభిన్న భాషల మధ్య ఐక్యతే భారతదేశ విశిష్టత

                -ఆచార్య సి.మృణాళిని వ్యాఖ్య 

కార్యక్రమానికి ముందుగా పత్రికల స్పందన

భారతీయ భాషా ఉత్సవం ఆహ్వాన పత్రిక





స్వాగతం పలుకుతున్న ఆచార్య జె.భీమయ్య

ఆచార్య తారకేశ్వర్ గార్ని ఆహ్వానిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

భారతీయ భాషా ఉత్సవం లక్ష్యాలను, కార్యక్రమాన్ని వివరిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు


ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తున్న కళ్యాణి బృందం

ముఖ్య వక్తగా విచ్చేసిన ఆచార్య సి మృణాళిని గార్ని సత్కరిస్తున్న ఆచార్య వి.కృష్ణ, డీన్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్

కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన చైర్మన్ ఆచార్య వి.కృష్ణ, డీన్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ గారితో ఆచార్య దార్ల




అధ్యక్షోపన్యాసం చేస్తున్న ఆచార్య వి.కృష్ణ, డీన్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్


 భారతీయ భాషా ఉత్సవం బేనర్ కట్టిన స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ఆవరణలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

భారతీయ భాషలతో పెట్టిన ముగ్గు

ఆచార్య మృణాళిని, ఆచార్య తారకేశ్వర్ లను ఆహ్వానించి, ముందుగా డీన్ కార్యాలయంలో కార్యక్రమంపై చర్చించిన ఆచార్య వి.కృష్ణ, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య జె.భీమయ్య, ఆచార్య ఫజులుల్లా, ఆచార్య అన్నపూర్ణ,  ఆచార్య పిల్లలమర్రి రాములు

భారతీయ భాషోత్సవంలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు,పరిశోధకులు, అధ్యాపకులు

భారతీయ భాషోత్సవంలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు,పరిశోధకులు, అధ్యాపకులు

భారతీయ భాషోత్సవంలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు,పరిశోధకులు, అధ్యాపకులు

కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

ఉపన్యసిస్తున్న ఆచార్య సి.మృణాళినిగారు

                                    ఉపన్యసిస్తున్న ఆచార్య సి.మృణాళినిగారు

తరణం దినపత్రిక, 10.1.2024 
....
పత్రికలలో ప్రచురించిన భారతీయ భాషా ఉత్సవానికి సంబంధించిన వార్తల క్లిప్పింగులు

నవతెలంగాణ దినపత్రిక, 10.1.2024 

సాక్షి దినపత్రిక, 10.1.2024 

విశాలభారతి దినపత్రిక, 10.1.2024 

ఈనాడు దినపత్రిక, 10.1.2024 

తెలుగు న్యూస్ టైమ్స్, చెన్నై  దినపత్రిక, 10.1.2024 

ఆంధ్రజ్యోతి దినపత్రిక, 10.1.2024 

తెలుగులోకం దినపత్రిక, రాజమహేంద్రవరం, 10.1.2024

జనప్రతిధ్వని దినపత్రిక, 10.1.2024 
మాట్లాడుతున్న ఆచార్య తారకేశ్వర్


కవిత చదివి వినిపిస్తున్న ఆచార్య అన్నపూర్ణ 


వందన సమర్పణ చేస్తున్న ఆచార్య ఫజుల్ ఉల్లా


భారతదేశంలో భిన్న భాషలు ఉన్నప్పటికీ వాటి మధ్య ఐక్యత కొనసాగడం భారతీయ భాషలలోని విశిష్ట లక్షణం అని, దానికి మహాభారతాన్ని సజీవ ఉదాహరణగా పేర్కొనవచ్చునని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్, సిలికానాంధ్ర ( యుఎస్ఏ) తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సి.మృణాలిని పేర్కొన్నారు. మంగళవారం (9.1.2024) హెచ్ సి యు మానవీయ శాస్త్రాల విభాగం ఆధ్వర్యంలో భారతీయ భాషోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

మహాకవి సుబ్రహ్మణ్య భారతి జన్మదినోత్సవాన్ని భారతీయ భాషా దినోత్సవంగా ప్రతి యేడాది డిసెంబర్ 11 వతేదీన జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, ఆ కార్యక్రమాన్ని  ఈనెల 9వ తేదీన స్కూల్ ఆఫ్ హ్యూమానిటిస్ ఆడిటోరియంలో డీన్, ఆచార్య వి.కృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. మహాభారతాన్ని మూలంలో భావం కోల్పోకుండా తెలుగులోకి అనుసృజన చేసిన గొప్పతనం కవిత్రయ భారతానికి చెందుతుందని, వ్యాస మహాభారతంలోని పరమార్థాన్ని యథాతధంగా తెలుగులోకి తీసుకొచ్చారన్నారు. తెలుగు ప్రజలకు భక్తి కంటే లౌకిక విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ అనీ, ఆ దిశగానే సాహిత్యం కూడా వెలువడిందన్నారు. సుబ్రహ్మణ్య భారతి తన రచనల్లోకందుకూరి వీరేశలింగం పంతులుగారిని ఒక పాత్రగా చేసి ఆయన గొప్పతనాన్ని వర్ణించారని సోదాహరణంగా వివరించారు. తమిళ కవి అయినప్పటికీ తెలుగు సుందరమైన భాషగా సుబ్రహ్మణ్య భారతి ప్రశంసించడం ఆయనలోని జాతీయతా స్ఫూర్తికి నిదర్శనం అన్నారు. అటువంటి సుబ్రహ్మణ్య భారతి పేరుతో భారతీయ భాషా దినోత్సవాన్ని జరపడం ఎంతో ఔచిత్యమైన చర్యగా ఆచార్య మృణాళిని వ్యాఖ్యానించారు. కేంద్ర సాహిత్య అకాడమీ కూడా 24 భాషలలో జాతీయస్థాయిలో పురస్కారాలను ఇస్తుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. 

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన డీన్ ఆచార్య వి. కృష్ణ మాట్లాడుతూ భారతీయ భాషా దినోత్సవం భారతీయసమైక్యతకు నిదర్శనంగా భావింంచాలన్నారు. మరొక ప్రత్యేక అతిథి ఇఫ్లూ యూనివర్సిటీ అనువాద శాఖ అధ్యక్షులు ఆచార్య వి.బి.తారకేశ్వర్ భారతదేశంలోను, రాష్ట్రాలలోను భిన్న భాషలకు కేంద్రంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందీ శాఖ అధ్యక్షులు ఆచార్య సి.అన్నపూర్ణ సుబ్రహ్మణ్య భారతి కవితలను, ఆచార్య పిల్లలమర్రి రాములు తెలుగు కవితను ఆలపించారు. ఈకార్యక్రమానికి సమన్వయకర్తగా తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యవహరించినా, 

 తులనాత్మక సాహిత్య కేంద్రం, ఉర్దూశాఖల అధ్యక్షులు ఆచార్య జె.భీమయ్య, ఆచార్య ఏ.ఎమ్.ఫజులుల్లాలు కార్యక్రమానికి స్వాగతం, వందన సమర్పణలు చేశారు. కార్యక్రమంలో మానవీయ శాస్త్రాల విభాగంలోని అన్ని శాఖల అధ్యక్షులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.