

జాతీయ సమగ్రతను పెంపొందించుకోవడానికి మాతృభాషల్ని నేర్చుకోవాలని, దీనిక అనువాదాలు ఎంతగానో సహకరిస్తాయని ఆయన ఉద్బోధించారు. నిందర్ ఘుగైణ్వి తన పుస్తకాన్ని విక్రమ్ జీత్ దుగ్గల్ గార్కి అంకితమిచ్చి, సత్కరించారు. స్థానిక సాహిత్య, సాంస్కృతిక సంస్థలవారు కూడా కమీషనర్ ని ఘనంగా సత్కరించారు.

తన మాతృభాష పంజాబీలో మంచి పుస్తకాన్ని రాసి, తనకి అంకితమిచ్చిన నిందర్ ఘుగైణ్విని కమీషనర్ శ్రీ విక్రమ్ జీత్ దుగ్గల్ ఘనంగా సత్కరించారు.
పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యఅతిధి వి.రవికుమార్ గారు మాట్లాడుతూ, వ్యవస్థలో భిన్న దృక్కోణాలుంటాయని, మంచి చెడుల్ని బేరీజు వేసుకొని, సమాజం సక్రమంగా నడవడానికి కావాల్సిన అంశాల్ని రచయితలు పాఠకులకు అందించాలన్నారు. ఈ పుస్తకంలో జడ్జిల గురించి, వారి దగ్గర పనిచేసే సేవకులు గురించి రాసినా, అవి కేవలం జడ్జిలకు మాత్రమే చెందినవిగా భావించకూడదన్నారు. అలాంటి వాళ్ళు రకరకాల సంస్థల్లోను ఉంటారన్నారు.
డా.దార్ల వెంకటేశ్వరరావు పుస్తకాన్ని సమీక్షిస్తూ, దానిలోని మంచిచెడులను విశ్లేషించారు. పీడన ఎక్కడైతే ఉంటుందో అక్కడ దాన్ని ఎదుర్కొనే చైతన్యం కూడా పుట్టుకొస్తుందనీ, దీనిలో భాగంగానే ఈ పుస్తకాన్ని చూడాలని అన్నారు. పీడన వివిధ స్థాయిల్లో ఉంటుందనీ, దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఒక మార్గాన్ని చూపిస్తుందన్నారు. పుస్తకంలోని వివిధ విషయాలను సోదాహరణంగా వివరిస్తూ, ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా వారి వారి స్థాయిల్లో సంఘర్షణను ఎదుర్కోవలసి వస్తుందనీ, అయితే, కిందిస్థాయిలో వాళ్ళు వ్యక్తం చేసినంత వేగంగా ఆ సంఘర్షణ బయటపడదనేది చాలా కొద్దిమంది మాత్రమే అవగాహన చేసుకుంటారని విశ్లేషించారు. అలాంటి సంఘర్షణలెన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయని, ఈ పుస్తకాన్ని రాయడంలో మూలరచయితతో పాటు, అనువాదకుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశంసించారు.


నమస్తేతెలంగాణ దినపత్రిక, పెద్దపల్లి జిల్లా 19-12-2016 సౌజన్యంతో
సాక్షి దినపత్రిక, పెద్దపల్లి జిల్లా 19-12-2016 సౌజన్యంతో
ఆంధ్రభూమి దినపత్రిక, పెద్దపల్లి జిల్లా 19-12-2016 సౌజన్యంతో
నవతెలంగాణ దినపత్రిక, పెద్దపల్లి జిల్లా 19-12-2016 సౌజన్యంతో
ఈనాడు దినపత్రిక, పెద్దపల్లి జిల్లా 19-12-2016 సౌజన్యంతో
Ninder Ghugianvi తన Facebook లో ఇలా రాసుకున్నారు.
ਕਦੇ ਸੋਚਿਆ ਨਾ ਸੀ ਕਿ ਤੇਲਗੂ ਵਿਚ ਮੇਰੀ ਕਿਤਾਬ ਦਾ ਅਨੁਵਾਦ {ਨੈਣੂ ਜੱਜ ਗਾਰੀ ਸੇਵਕੁਡਨੀ}ਡਾ ਪਟਨ ਰਹੀਮ ਖਾਂ ਉਰਦੂ ਯੂਨੀ: ਹੈਦਰਾਬਾਦ ਦੇ ਪਰੋਫੈਸਰ ਵਲੋਂ ਹੋਵੇਗਾ, ਤੇਲੰਗਾਨਾ ਸੂਬੇ ਵਿਚ ਰਿਲੀਜ ਹੋਵੇਗੀ, ਉਥੋਂ ਦੇ ਲੋਕ ਤੇ ਵਿਦਵਾਨ ਇਕੱਠੇ ਹੋ ਕੇ ਪਰੰਪਰਾਗਤ ਢੰਗ ਨਾਲ ਸਨਮਾਨਿਤ ਪਗੜੀ ਸਿਰ ਉਤੇ ਰੱਖ ਕੇ ਏਨਾ ਪਿਆਰ ਸਤਿਕਾਰ ਦੇਣਗੇ, ਸੱਚ ਜਾਣੋ, ਬਹੁਤ ਆਦਰ ਮਿਲਿਆ। ਅਸ਼ਕੇ ਜਾਈਏ ਵੀਰ ਪਿਆਰੇ ਵਿਕਰਮਜੀਤ ਦੁੱਗਲ IPS ਕਮਿਸ਼ਨਰ ਰਾਮਾਗੁੰਡਮ ਦੇ। ਮਾਣਯੋਗ ਜੱਜ ਵਾਰੂਲੀ ਰਵੀ ਕੁਮਾਰ ਆਂਧਰਾ ਪਰਦੇਸ ਹਾਈਕੋਰਟ ਕਿਤਾਬ ਰਲੀਜ ਕਰਨ ਉਚੇਚਾ ਪਧਾਰੇ। ਡਾ ਦਾਰਲਾ ਵੈਕੇਂਟਸ਼ਵਰ ਰਾਓ ਤੇਲਗੂ ਪਰੋਫੈਸਰ ਸੈਂਟਰਲ ਯੂਨੀ: ਤੇ ਡਾ ਸੰਗਨਾ ਭਠਲਾ, ਜੀ ਲਕਸਮਣ ਰਾਓ, ssp ਸਨਪਰੀਤ ਸਿੰਘ,ਅੰਦੇ ਸਦਾ ਨੰਦ ਸਵਾਮੀ ਸਮੇਤ ਕਈ ਤੇਲਗੂ ਵਿਦਵਾਨਾਂ ਨੇ ਕਿਤਾਬ ਬਾਰੇ ਭਾਸ਼ਣ ਦਿਤੇ। ਕੀ ਗੱਲ ਕਰਾਂ ਤੇ ਕੀ ਛੱਡਾਂ? ਏਨਾ ਪਿਆਰ ਮਿਲਿਆ ਕਿ 4 ਘੰਟੇ ਸਮਾਗਮ ਨੂੰ ਮਾਣਦੇ ਸਰੋਤੇ ਅੱਕੇ-ਥੱਕੇ ਨਹੀਂ। ਕੁਝ ਝਲਕਾਂ ਤਸਵੀਰਾਂ ਦੀ ਜੁਬਾਨੀ।
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి