"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

18 January, 2010

నిప్పుల్లో తడిచే తప్పెట ( మాదిగ దీర్ఘ కావ్యం)


-->
ఒంగోలు గిత్త - ఎజ్రాశాస్త్రి - పౌరుష కవిత్వం
ఒక రచనని గుర్తించటం సాహిత్య ప్రస్తావనలో తక్షణ కర్తవ్యంగా భావించాలి. విమర్శలో సాహి త్య ప్రస్తావన అనే భావనని గురించి వివరించటం కన్నా అందుకు తగ్గ కృషి చేయటవేు విమర్శకుల కర్తవ్యంగా నేను భావిస్తాను. విమర్శకి మరో కర్తవ్య పార్శం సాహి త్య ప్రస్తావనే. ఇటీవల వచ్చిన కొత్త ధోరణులని కొంతమంది విమర్శకులు యింకా జీర్ణంచేసికోలేదు. మన విమర్శకులు వాళ ధోరణిలోనుంచి రచయిత కృషిని పట్టించుకుంటున్నారుగాని రచన తరఫున వకల్తా పుచ్చుకొనే ధోరణికి అలవాటు పడలేదు. రచయిత రచన చేసిన తర్వాత రచయితనుంచి రచన విడిపోతుంది. యింక రచయితకి ఆరచనకి సంబంధం వుండదు. రచన పాఠకుడి వశం అవుతుంది. రచనని పాఠకుడి కంటే కూడా ముందుగా విమర్శకుడి గుర్తింపుద్వారా విమర్శకుడి మొదటి కర్తవ్యం ప్రారంభం అవుతుంది. ఆగుర్తింపు ద్వారా ఆరచనని, ఆరచయిత యితర రచనలని విమర్శకుడు గుర్తించి దానిని వీలున్న చోట ప్రస్తావన ద్వారా ఆరచనని పాఠకుడి దగ్గరికి తీసికెళాలి. అంచేత విమర్శలో సాహి త్య ప్రస్తావన ఒక గతి శీలక పాత్రనే కాక చైతన్య వంతమైన పాత్ర కూడా నిర్వహించి రచయితని బేరీజు వేసేందుకు కృషి చేస్తుంది. రచనా ప్రవాహాంలో ముందుకు నడుస్తున్న రచయిత రచనలని అతని కృషి, అతని బలాన్ని, బలహీ నతనీ ఎత్తి చూపటం సాహి త్య ప్రస్తావనలో జరగాల్సిన మొదటి తంతుగా భావించాలి.
నా సాహి త్య ప్రస్తావనలో భాగంగా గత పదేళనుంచి సాహి త్య కృషి చేస్తున్న దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి ఎదుగుదలని గుర్తించే ప్రయత్నవేు ఈ వ్యాసం నిర్వహి ంచే పాత్ర. నిజానికి రచనని గుర్తించే ముందు విమర్శకుడికి ఆరచయితకి సాన్నిహి త్య సంబంధం కూడా చాలా అవసరం. ఒక విమర్శకుడు తారసపడ్డ ప్రతి రచయితని, ప్రతి కవిని కప్పదాటుగా విమర్శంచే కర్తవ్యం నించి బైటపడి, తనకు దగ్గరగా వున్న,తనకు బాగా తెల్సిన, తన ప్రాంతీయ రచయిత కృషిని గుర్తించి ఆ విమర్శని ముందుకు తీసికెళటం చాలా సరైన చర్య. నిజానికి ఒక విమర్శకుడు ఒక రచయితని లేదా ఒక ధోరణి రచయితలని అంటిపెట్టుకొని వాళ కృషిని కాపాడటం కూడా సాహి త్య ప్రస్తావనలో సరైన చర్యగా భావించాలి.
దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి నాకుగత పదిఏళనుంచి బాగా తెలుసు. అతడి కవితా ప్రయాణాన్ని దగ్గర నుంచే గమనించటవేుకాక ప్రోత్సాహి ంచి అతనికి నా తోడ్పాటును ఈరోజు దాకా అందిస్తున్నాను. అందుకే ఈ పరిచయం.
చెప్పులుకుట్టే చేతుల వంశంనించి ఎదిగిన ఎజ్రాశాస్త్రి ఆ మాదిగ జాతి నిర్వహి స్తున్న యం.ఆర్‌.పి.యస్‌. ఉద్యమానికి బాసటగా నిలుస్తూనే కేవలం దళిత కవిత్వ నిర్వహాణా స్పృహా చాలదని గుర్తించటంలోనే అతని వ్యూహాంవుంది. దళిత ఉద్యమాన్ని బహుజనుల చేతికి అందించటం ద్వారా మాత్రవేు తమ జాతి ఆత్మగౌరవం మరింత పదును ఎక్కుతుందనే జాతీయ స్పృహా ఎజ్రాశాస్త్రిలో వుంది. అందుకే రచలని దళిత కవిత్వంలో భాగంగా కాక బహుజన కవిత్వ నిర్మాణంలో భాగంగా అతను కృషి చేస్తున్నాడు.
ఎజ్రాశాస్త్రి తన సాహి త్య ప్రస్థానంలో యిప్పటి వరకు వెలువరించిన రచనలు :
1) కర్రముక్క - దీర్ఘకవిత - ఆగస్ట్‌ 2005 ప్రచురణ
2) ఏరువాకై తిరిగి లేస్తా - కవితా సంకలనం - డిసెంబర్‌ 2006 ప్రచురణ
3) నిప్పుల్లో నడిచే తప్పెట - దీర్ఘకవిత - డిసెంబర్‌ 2008
పై రచనలేకాక నిరంతరంగా పత్రికల్లో అతని కవితలు వస్తున్నాయి. ఆ కవితల్లో ''బియ్యమూ - బంగారమాÑÑ అంటా వడ్లగింజ గురించి రాసిన అతని కవిత యిటీవల గొప్ప సంచలనం చేసింది.
కవిత్వం అంటే కేవలం ఓ అనుభవవేు కాదు, చరిత్రలో భాగం కూడా. రచన చేయటం చారిత్రక కర్తవ్యంగా భావించే క్రమలో నుంచే వెలువడింది కర్రముక్క దీర్ఘకవిత! ఏజాతి నైతే దూరంగా యింతకాలంగా తోసి వేశారో. ఆజాతే మరుభూమి దగ్గర్నించి, కళ్యాణ వేదికల దాకా దుడ్డుకర్రని చేత పట్టుకొని సమాజాన్ని ముందుకు నడిపించటవేుకాక - అన్నింట్లోను వారే ముందువుండి ఆ తర్వాత మరే జాతి అయినా, అనే సామాజిక ఆత్మగౌరవం దట్టించిన ఉద్యమ స్పృహాని ఈ కర్రముక్క దీర్ఘ కవిత నిరూపించింది. పాలక వర్గాల్ని ఎదురించే క్రమంలో భాగంగా ఈ కర్రముక్క ఓ ఆయుధంగా అవుతుందని ఎజ్రాశాస్త్రి ఎలుగెత్తి చాటాడు.
''కర్రముక్కకదా అనుకుంటే పొరపాటే / ఆకులు వలువలు ధరిస్తే, మహారణ్యం!, ఆకులు విదిల్చిచేతే ఒక మహా సింహాసనంÑÑ అనే ఎత్తుకొలుతో ప్రారంభమైన ఈ మహా ప్రవాహాం కవిత ఆ..... ''శత్రు సమూహాలపై ఈటేలు విసిరి / భూ భకాసురులపై ఒరిసెలు ఎత్తి / ఆ నాగరిక / అడవితల్లిబిడ్డలకు వనమూలికలై / వేర్లనుండి వైద్యాన్ని మొలిపించి / ఆకు పచ్చగా చిగిర్చింది నువ్వేకదా?ÑÑ అని ముక్తా యించటవేు కాక కర్రముక్కని విముక్తి దాతగా ప్రకటించడం ద్వారా ఆత్మ ప్రభోదాన్ని చాటి చెప్పటం జరిగింది!
కర్రముక్క దీర్ఘ కవితతో పాటు ఈ సంకలనం అతని మరిన్ని తొలినాటి కవితలు 16 దాకావున్నాయి.
''రెండు క్షణాల కౌగిలి / మూడో క్షణం చీదరింపు గతం అంటుకోలేదు / వర్తమానం వెంటరాదుÑÑ అంటూ క్షణికం మీద అతను విసిరిన వైరాగ్యంఅతని కవిత్వ సూటిదనాన్ని తాత్వికంగా విన్న విస్తుంది. ఈపోకడే అతని చాలా కవితల్లో కన్పిస్తాయి. కారణం ఎజ్రాశాస్త్రి ఒక ఆసుకవి. పైగా జానపదకవి. అనేకమంది జానపద కవుల మాదిరే అవలీలగా కవితలు అల్లుతాడు. ఈ అల్లిక అతని నోటి వెంట అనర్గళంగా ప్రవహి స్తుంది. అందుకే అతని రచనలు ధారగా ప్రవాహాంగా సాగుతాయి. చెప్పేవిధానంతో కవిత రాయట ద్వారా అతను రెండు ప్రయోజనాలు సాధిస్తున్నాడు. ఒకటి అతని రచన సూటిగా వుంటుంది. రెండు అస్పష్టత ధరి దాపులకు వెలకుండా సూటిగా పాఠకుడికి అనుభూతిని ప్రసాదిస్తుంది. అక్కడే అతని విజయం అతని బలహీ నతలు కూడా బైటపడ్తుంటాయి. ప్రవాహాంగా వచ్చేఅతని కవిత్వంలో అక్కడక్కడ కొన్ని నట్లు కన్పిస్తుంటాయి. ఇటీవల ఆ బలహీ నత ఒదలించుకొని సూటిగా కవితవెలువడటం యిటీవలి అతని కవితల్లో స్పష్టంగా కన్పిస్తోంది. అందుకు కారణం అతని నిత్యకృషి, సాదన, అధ్యయనం పైపెచ్చు నీర్భీకత. ఈ నిర్భీకతతోనే అతని కవితలు పండుతున్నాయి. అందునా బాల్యంలో వలకూలీ అయిన తండ్రితో కలిసి సేద్యం చేసిన చేతులు ఈ నాడు కలం పట్టుకొని ముందుకు వచ్చినప్పుడు 'ఏరువాకై తిరిగి లేస్తాÑ అనే సంపుటిని ప్రకటించటంలోనే రైతుకూలీల పట్ల, రైతాంగం పట్ల అతని ఆవేదన అర్ధమవుతుంది. రైతుల ఆత్మ హాత్యలకి చలించిన తాను, కళ్లముందర ప్రవాహామైన పంట చేజారిన చేతిలోని బిడ్డలా ఆత్రంగా చేతులెత్తి కాపాడమని ఆక్రోశించినట్లుంది పంటపొలం. అంటా ఓ భావ చిత్రాన్ని మన ముందు వుంచుతాడు. అలాగే రైతుని కూలి తల్లి ముక్కుపుడకై వెలిగే భాస్కరుడుగా చిత్రీకరించటంలోనే అతని భావుకత వెల్లడవుతుంది. రాయటంగా కాక చెప్పడంగా వచన కవితని ముందుకు తీసికెళటంద్వారా ప్రప్రధమంగా ఒక మంచి దళిత కవిగా పేరుతెచ్చుకొన్న ఎజ్రా ఒక సిద్ధాంతం కాడే ఆగిపోకుండా నిరంతర ప్రయాణంలో భాగంగా తన కవిత్వాన్ని బహుజనుల కోసం తర్వాత తర్వాతి రోజుల్లో మలచటం అతని ఎదుగదలని సూచిస్తుంది.ఏకవికూడా ఏదో ఒక సిద్ధాంతం దగ్గరే నిలబడ్తే కొన్నాళ తర్వాత రాయలేడు. చెప్పిందేచెప్పి ఆతర్వాత కనుమరుగై పోతాడు. అలా కాకుండా నిరంతర చలన శీలతతో సమాజానికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ కవిలో పరిణతి సాధ్యవుతుంది. ఆ పరిణతిని ఎజ్రా అందుకున్నాడని నేను భావిస్తున్నాను.
''మనస్సు తెరల మాటున నడిచి వెళిన నీ పాదముద్రల సవ్వడి మారు మ్రోగుతునే వుందిÑÑ అని నా నెచ్చెలి అనడంతో ఆ నెచ్చెలి అంబేడ్కర్‌ అనే మార్మికతని సాధించటం కూడా ఎజ్రా పరిణతలోని భాగవేు. అందుకే ఏరువాకైతిరిగి లేస్తా అని అనటంలో కూడా పాపులకోసం ఏసుక్రీస్తు మూడవదినం లేచినట్లుగా తానూ ముందుకు వస్తాననే మార్మిక ప్రయోగం చేయగలిగాడు. అంచేతనే ఏరువాకై తిరిగి లేస్తానని అనేక కవితలకి సూటి దనంతో పాటు అనేకానేక అర్థాలు పాఠకులు వెతుక్కోవల్సిన అవసరంవుంది. అందుకే ఈ సంకలనంలోని కవితలు ఏనాడు చదివినా పాఠకుడు ఫ్రేష్‌గా ఫీల్‌ అయ్యే వెసులు బాటుని అతని సంకలనంలో ని కవితలు కన్పిస్తాయి.
'నిప్పుల్లో దరువేయ్‌ వివక్షలను తరివేుయ్‌Ñ అనే వేుల్కొలుపుతో వచ్చిన మరో దీర్ఘకవిత ఎజ్రా యిటీవలనే వెలువరించిన సంకలనం! యిందులో మిగ్గు, ముడుసు, ఈరగ, గోరోజనం,శరాయి, బొక్కెన మొదలైన ప్రకాశం జిల్లా మాదిగపల్లె మాండలిక పదాలు కోకొల్లలుగా కన్పిస్తాయి. రచయిత తన ప్రాంతీయ స్పృహాని వెలువరించంద్వారా ఆరచనకి ఒక సజీవకతని సాధిస్తాడు. ఆ మాండలిక పదాలు చావకుండా అన్నమయ్య దగ్గర్నుంచి ఎజ్రాశాస్త్రి మొదలైన జానపద రచయితలంతా ఒకే మెలుకువతోనే ఆపదాలని బతికించగల్గుతున్నారు. భాషని సజీవం చేస్తున్నారు. భాష రచయిత చేతిలోని పనిముట్టు. దాన్ని ఒడుపుగా వాడుకోటంలోనే అతని నిర్మాణ కుశలత కన్పిస్తుంది. మాదిగ జాతిని వేుల్కొలిపే మాదిగ పురాణమిది అని ముక్తాయింగా వెలువరించిన 'నిప్పుల్లో నడిచే తప్పెటÑ మనల్ని మాదిగ పల్లెల్లోకి పరిగెత్తిస్తుంది.
''నా చేలో మొక్క / ఇటుకలో మట్టి/ చెప్పుకువేుకుÑÑ యిలాగ ప్రవాహా స్థాయిలో నడిచే యితని కవిత్వాన్ని పాడుకునే గుణం కూడావుంది. అందుకుతగ్గలయ, దరువు, అతని నిప్పుల్లో నడిచే తప్పెట కవిత్వంలో మనం వెతుక్కోవచ్చు. మిగతా దళిత కవుల మాదిరి ఆక్రోశం, నిందాస్తుతి, అపరిపక్వ పెళుసుదనం ఎజ్రా కవిత్వంలో ఎంతవెత్తుక్కున్నా కానరాదు. అందుకు భిన్నంగా మార్మికత, సూటిదనం, పరిగెత్తుతా, గెంతుతా ఆడుతూ పాడుతూ సాగే పరిమళాలు యితని కవిత్వంలో సాధారణ అంశాలు. ఎప్పుడూ గొప్ప మెళుకువతో కవిత్వం చెప్పిన లక్షణాలే మనకు కన్పిస్తాయి తప్ప స్పృహా దాటి గతి తప్పి నినాద స్థాయి రచనాతత్వం ఎజ్రా కవిత్వంలో మనకు కానరాదు. అందుకు భిన్నంగా నేడు సౌకుమార్యం, లాలిత్త్వం, పదాల ముప్పేటు దాడి, జాతిలోలత్వం నిండుగా యితని కవిత్వంలో వెదుక్కోవచ్చు. ఓ సుకుమార కవి ఎజ్రా! ఓ ప్రేమకుడి లాలిత్త్వం నిండివున్న యితని కవిత్వాన్ని ఎన్నాళయినా ఆస్వాదించవచ్చు. జాషువా కున్న నిర్భీకత, నిజాయితీ వున్న అసాధారణకవి ఎజ్రా శాస్త్రి. అతను ఆంధ్రుడు కావటం మన అదృష్టం. అందులోను కనిగిరి వాడు కావటం మరో గొప్ప అదృష్టం. ఒంగోలు గిత్త పౌరుషం యితని కవిత్వంలోనూ చూడచ్చు.
- శ్రీరామకవచం సాగర్‌
www. sriramakavachamsagar.wordpress.com

------------------------------------------------------------------------------------








ఆసుపత్రికి ఓమూల
పోస్టు మార్టం గదిలా
ఊరికి దూరంగా మాదిగ పల్లె
చర్మం లేని దట్టెంలా ఉంది
నాగజెముడు
బ్రహ్మాజెముడు
సర్కారుకంప
రేగి
కలివె
తుమ్మ
పరికి
ఒళంతాముళతో,
కంపల్లో రాలిపడుతున్న
రక్తపు చుక్కలు
తలమీద ముళకిరీటం
ఒళంతా గాయాలమయమైన
క్రీస్తులా ఉంది నా మాదిగపల్లె.
బతుకు భారమై
భుక్తికోసం
వలస జీవనం
సాగిస్తున్న
వాస్కోడిగామాలు
నా మాదిగ ప్రజలు
ఇంటి ముందర
రెండు ప్రయోగశాలలు
అమ్మసున్నం
అయ్యతంగేడు -
అయ్య వీరబాహుడిలా
కల్లుతాగి
కత్తులు పదును బెడ్తుంటాడు
కసాయి భాషనేర్వనికత్తి
అయ్యచేతిలో
కొవ్వొత్తిలా వెలుగుతుంది,
చెట్టుకింద కూర్చొని చెప్పులు కుడుతుంటే
బోధివృక్షం కింద
బుద్ధుడులా ఉండేవాడు
ఆరెకు,వారుకు, తోలుకు, నూలుకు మధ్య
''మిగ్గుÑÑలాంటి మనసున్న అయ్య
నే పాలు తాగక మారాంజేస్తె
వాల్లయ్య పేరుతో
నా పసితనానికి
పెద్దరికం తలపాగా చుట్టి
సంబరపడేవాడు
అమ్మ తొమ్మిదినెలలు
కడుపులో మోస్తే,
అయ్య తన గుండెలమీద,
బుజాల మీద మోసెవాడు.
తడుబ్బాత1 లేని అయ్య
నా పసి బెల్లానికి
''శరాయిÑÑ తొడిగి
సంబరపడేవాడు.
తన చద్దిబువ్వలో
నేను చిచ్చుళు పోస్తే
చీదరింపు లేక
కాటంరాజు తిరనాళలో
నన్ను బుజాలకెత్తుకొని... చిందయ్యెవాడు.
ఓ..న..మాలు రాని అయ్య
నాకు పెదబాల శిక్ష.
నా పలకా, బలపం,
నేను కలగటేరు
అయితే కల్లజూడాలని
కలలుగనేవాడు.
అయ్య తప్పెట దరువేస్తే
రైలు పట్టాలుదిగి
మాదిగ పల్లెలోకి
పరిగెత్తినట్లుండేది.
మా ఇంటిముందర
కల్పవృక్షం లేకపోయినా
చింతచెట్టుండేది
ఊరి పచ్చి బాలింతలకు
పత్యానికి పాతచింతకాయ పచ్చడి
కాసిన్ని కస్తూరి మాత్రలు,
చిటికెడు గోరోజనం అయ్యేవాడు అయ్య.
వేురు పర్వతమా
జాంబవతనయా
పసిడి నదులు
నీపాదాల గుండా
ప్రవహిాంచేవట
త్రేతాయుగంలో
శ్రీరాముని రాజకీయ సలహాదారుడివై
ద్వాపరయుగంలో
శ్రీకృష్ణునిపై
వీరోచితంగా పోరాడినావట
శూరుడా !
యుద్ధవీరుడా !
అద్భుత శమంతకమా,జాతిరత్నమా
కోహిానూర్‌ కూడా నీ ముందర వెలవెలే కదా!
నీవు నడిచొస్తుంటే
పొడిచొస్తున్న సూర్యుడిలా ఉంటావు!
బండా గుండ్రాయితో ఉగ్గునూరి
బుగ్గగిల్లి ఉగ్గుబెట్టి
తలకు సాంబ్రాణి ధూపవేుసి
దూలానికి జోలేసి
ఊగే ఉయ్యాల కాదు బాల్యం
నేను పీకి పారేసిన ముడుసు2
చదువుల్లో నేను సొలోమానురాజు
మా బడి మా ఊరిగుడి
అయ్యవారు పూజారి
నే గుడిముందర చెప్పులు
మెట్లవద్ద యాచకుణ్ణి
అక్షరాలు అయ్యవారి దయ
ఐదోతరగతి పుస్తకంలో
అంబేద్కర్‌ గుర్తొస్తుంటాడు
ఆరో తరగతి రాగానే
మహాకవి జాషువా
కష్టజీవిలా కనిపిస్తాడు.
జేెబులో రెండు ఈరగ (లివర్‌) ముక్కలు
నాకు చాక్‌లెట్స్‌,
కృష్ణ, కృపన్నలు
కరపత్రాల
కత్తులతో
కువ్వల్లో కనికట్టతేల్చి
జరుగుతున్న మోసాల్ని
లెక్కల్లో చిక్కు ముళువిప్పి
దండోరాకు నన్నొక
తప్పెట మూయాలనిరి
రాత్రి చర్చల చివరాకర్లో
క్రీస్తు రెండో రాకడ కొరకు
క్రైస్తవులంతా ఎదుర చూసినట్లు
మాదిగ మందిమంతా
మాదిగ నాయకుడికొరకు
ఎదురు జూస్తుండిరంటిని
ఎబిసిడిలు భాగవతం
బిబిసిలో బూర ఊదబడునని
మహానాయకుల సరసన
మాదిగ జాతికి కుర్చీలుంటాయని
జోష్యం జెప్పినానప్పుడు కాలజ్ఞానమై
మీరు ఆదర్శ స్వాప్నికులు
వెలకట్టలేని వెలుతురు దివ్వెలు
రేపటి తరాలకు నిప్పురవ్వలు
బాబూజీ వారసులు
బాబాసాహోబ్‌ ఆలోచనాపదŠంలో
పయనించే అరుంధతీ పుత్రులంటిని
కనకగిరి నెక్కి
కనక తప్పెటతో
దామాషాగురించి
కనిగిరి తాలూకాలో
దండోరా ఏసిన మొదటోన్ని
మా ఊరు సరస్వతికి
నిలయం కాకపోయినా
అరుంధతికి ఆలయం
పోలేరమ్మకు పుట్టిల్లు
ముత్యాలమ్మ తల్లి వేరేనా?
మా ఇంటి ఆడపడుచు
బక్క ఎద్దుచర్మం
బొక్కెన తోలు
బక్కరైతుకు చెప్పులు
తొండానికి తోలు
దండేనికి తునకలు.
పసుపురోగ పాడావు
చండ్రకోల వారులు అల్లి
బొడ్డారులు3 మెడగంటలు
తలకుచ్చులు.
కరువు కాటకాలు
పన్నుపోటు, వెన్నుపోటు
జమాబందీలకు
ఏలానికి, తాలానికి
చావులకు, సంబరాలకు
చాటింపు, దండోరాలై
పీర్లగుండాల నడిపించి
ప్రభలైనా
పూలబండ్లయినా
వెలిగేది వాళు
ఎగిరేది వేుము.
పాలు పెరుగు ఎరగని
పాలేరు బ్రతుకు మాది
వేగుచుక్క వేులుకొని
ఏడుగాల్ల పెడ
ఇంటిముందు కళాప
ఎరువు బండ్లు, బరువు బండ్లు
ఏడు బర్రెల పాడి
చిట్టు, పొట్టు
గాటిలో గడ్డి
దూడ మూతికి చిక్కం
నా ముంతలో పున్నీళు.
కాడెడ్లకు కొండగడ్డి
పాడి బర్రెకు పచ్చగడ్డి
పైటాలకు నాకు రాగిముద్ద
మాపైగుడ్డలు బాప్తీస్మాలు
పొందితేగాని చాకలన్నముట్టడు
దొరలు కాళు పట్టిన చేతులు
మా తల వెంట్రుకలేనాడు ముట్టాడుకనుక?
పై చదువులకు
నే పట్నం మెట్లెక్కితే
అమ్మా కళళో నే కన్నీళౌతా
అయ్య నా పాదాలకు చెప్పులై
ముద్దాడతాడు.
ఐదు రొట్టెలు
రెండు చేపలకై కాక
చర్మంచుట్టిన
ఎముకలగూడు
నడిచే అస్తిపంజరంనేను
నిత్యం పస్తులై, నిస్తులై
పాఠాలతో
పొట్ట నింపుకొని
ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణతే
శలవు దినాలన్నీ
నాకు పనిదినాలే
నేను పునాది రాయి
తీసిపారేసిన రాయి తలకు మూలరాయి
నే చేలో మొక్క
ఇటుకలో మట్టి
చెప్పుకు వేుకు
చేనుకు కంచె
చేలో ఎరువు
కంచెలో మంచె
మంచె విూద వడిశల
వడిశలలోన రాయి
తోకలేని పిట్టలెన్నో
తల ఊపుతూ మోకరిల్లి
ఉభయకుశలోపరి అంటూ
క్షేమాలను మోసుకొచ్చి
చావుకబుర్లు తీసుకొచ్చి
మసిబూస్తే మరణమని
పసుపైతే పెళని
నాతో పరిపరి చదివించుకొని
ఏడూళకు దారినేను
దిక్కునేను
నేనుపట్టా పట్టుకొని
నడిచొస్తుంటే
జమాబందికొస్తున్న
తహాసిల్‌దారులా
నా మాదిగపల్లె
''తునకల హారాలతో
స్వాగతం పలికేది
కరువు శిలువను మోస్తూ
కాలాన్ని ఎల్లదీస్తూ
పల్లేర్ల మీద బతుకుబండినీడిస్తూ
కట్టెల మోపులు
కలబందలు
గోగు, గురివిందలు
పావలో బేడో
అర్ధణో, అణాతో
పొట్ట పోసుకొని
ఆకలి కలెవకాయలు
నెమ్మిపండ్లు
దొంగిలిన
దోసకాయలు
వేరుశనక్కాయాలు
గెణుసుగడ్డలు
అడవిగడ్డలు, పిల్లేర్లతో
పొట్టనిండక
పస్తులై, నిస్తులై
పొగరాని పొయ్యిజీవితం
నారై, నీరై, మొక్కై
పుడమితల్లి పొత్తిళలోచేర్చి
పంటకు జోల పాటపాడి
వేుఘమా! వర్షమైవచ్చి
నారైతు పంటను ముద్దాడమని
తూర్పు, పడమటిగాలులు
వింజామరలై వీచమని
ఉత్తర దక్షణాదులుయ్యా లూపమని
చిరుపొట్ట కాగానే
వడిశలై పిట్టల్నితోలి
చిరుగాలులూ!
శ్రీమంతంచేయమని
గింజకాగానే
గాలిహాోరుల
తుఫానులు తాకొద్దని
ప్రకృతి నాల్గుదిక్కులమొక్కి
పంటను రైతు ఇంటచేర్చి
వేుమంతా చేలో
కొయ్య కాళలా మిగిలిపోతాం
కుప్పనూర్చి
తూర్పారబట్టి
గాలికి ఎగిరే తాలు గింజలం
రాసి అడుగుమట్టి గింజలం.
దేవుని మాన్యాలన్నీ
దెయ్యాల పాలు
నైవేద్యాలన్నీ బూతాలపాలు.
జానెడు కొమ్ములు తిరిగిన
మెడబలసిన దున్నపోతును సైతం
ఏటుకునరికి
పొలినై బలినైన
ఊడ్చడానికి
ఏడ్చడానికి సెంటుభూమిలేదు.
జీవితాన్ని తెగిన చెప్పులా ఈడుస్తున్నా
వేసక్టమీ అంటే అయ్యకు ఉరి
సారా కోసం సావుకైన సిద్దం
కుచేలుడు సంతానాన్ని
కలరా కబలిస్తున్నా
అతిసారా అంతమొందించినా
మసూచి మట్టుబెడుతున్నా
పోలియో అంగవైకల్యమైనా
వ్యాధినిరోధక టీకాలంటే
చెట్టు
పుట్ట
గాదే
గరిసెలై
ఏడూళు ఏకమై
ఏడుపులు
పెడబొబ్బలు.
పల్లె రాబందులకు విందు
తమలపాకులు తుంచారని
తలకాయలు తెంచారు
అరటిగెలనరికారని
అరికాళునరికారు.
గొర్రెల్లోబడ్డా తోడేళా
వేుకల్లోబడ్డా చిరుతల్లా
నాలుగెద్దుల కదŠలో పులిలా
విభజించి పాలించే
తెల్లదొరలకు తీసిపోరు
రైతుల పెళంటే
చెప్పులు పువ్వుల్లా
పాదాలకింద పోస్తాడు అయ్య
గజ్జల గుత్తైపోయి
చిందులు శివాలై
చిట్లిన తప్పెటలా
గోడకిందవాలి పోతాడు
పండగంటే
వడ్లగింజలో
బియ్యపుగింజ!
సంవత్సరానికో ప్రసాదం!!
ఈ వసంతాని కోసం
నా పల్లె ప్రజలు వలస పకక్షుల్లో
కలిసిపోయింది.
జబ్బుకు
జాడ్యానికి
జిల్లేడు పసరు నస్యం
కళల్లో కలికం
సొంటి
వొంటేలువైద్యం
కషాయం
పాషాణం
లంకణానికో పత్యం
వరిబువ్వగంజి
టీగ్లాసులే కాదు
మందుగ్లాసులు
ఊరిని పల్లెను రెండుగా
చీలుస్తాయి
కొంపలు నిప్పంటుకుంటే
కులం వాగులో
విద్యుత్‌లా ప్రవహిాస్తుంది
దాహానికి దోసెళతో
దేబిరించాల్సిందే
బూడిదలో ఉచ్చ
బుడ్డోడిమంత్రం
కొండ నాలుక పెరిగిందని
చిమట కాకర్లబోతే
ఉన్న నాలుక ఊడిపోయే
తేలు మంత్రం
భూతాలకు తంత్రం
చేతబడి
చిల్లంగి
బాణామతి
అమాయకత్వం
ఆసరాగ పెట్టుబడి
ముగ్గులేసి
నిగ్గుతేల్చి
మాదిగోడికి పాతాళం.
రైతు పంటచేతికొస్తే
నేను మగదŠ సామ్రాజ్య
యువరాజునే మరి
గంగిరెద్దుల ఆట, నిప్పుల్లో నడుస్తున్న
కణకతపెట్లు, కర్రసాములు
మల్లయుద్దాలు
వీధినాటకంలో నేనెప్పుడూ
వీర బాహున్నే
మాదిగ మాష్టీలు
ముష్టియుద్దాలు
మల్లయోధులై
సాముగరిడీలై
యుద్ధవీరులైన మాదిగసేన!
నాపేట కోట ప్రాకారం
అల్లంత దూరాన
నాడెక్కలి సుందరి
చెలికత్తెలతో
తన సౌందర్య సుమాల
సువాసనలతో నన్నా కర్షించి
ఆహ్వానం పలుకుతుంది.
కోరమీసాలు మెలివేసి
కిర్రుచెప్పులు కాల్లతొడిగి
నెత్తికి సమురుబూసి
నా నిలువెత్తు మూర్తి మత్వానికి
మాల కొండన్న
నూరు నెంబరు నూలుపంచ
ఖద్దరులాల్చి ఆరుమూరల కండువాతో,
వెనకాముందు సైన్యాలున్నట్లు
అశ్వాలు
ఐరావతాలు
కదులుతున్నట్లు నేనుకదులుతుంటే
అంతఃపుర సుందరాంగులు
లేలేత లేగదూడల కొవ్వుల పువ్వులతో
వసనెయ్యి4 ప్రమిదల తో
నాకు ఆహ్వానం పలికినట్లుండేది
నేను నాప్రియురాలు
మందహాసంతో
ఆ నులక మంచవేు పట్టుపరుపు
పందిరిమంచం
ఆపై మా ప్రణయ గాధలెన్నో?
నా జీవితపురాణం
నాలుకమీద లిఖించుకున్న 'ఆసాదిÑÑ
వల్లిస్తూ
జంబూద్వీపము
జాంబవ పురాణం
యజ్ఞ జ్వాలలనుండి
ఉద్భవించిన అరుంధతిని
వశిష్టుడు వలచి
కులపెద్దల ఆజ్ఞతో
పరిణయమాడి
ఆకాశంలో నక్షత్రమై
స్త్రీ జాతికి ఆదర్శవంతమై
నూతన దంపతులకు
దర్శన మొసంగుచు
వెలుగొందుతున్న మాదిగ
మహా పతివ్రత చరిత్రలివి.
కొమ్ము లూదుతూ
జయ జయ ధ్వనులతో
కీర్తిస్తున్న కొమ్ములవారు
నా ఆస్తాన పూజారి
వశిష్టుడి వేునమామ
నాజాతిగురువు మాదిగ దాసరి
జంధ్యాలతో
ఇంద్రలోకము నుండి
దిగివచ్చిన దేవేంద్రుడిలా
లక్ష్మణుడికి ప్రాణంప్రసాదించిన
సంజీవినిలా
పెళి పేరంటాలకు
మంత్రోచ్ఛరణలతో
ఉద్భవించిన ఓంకారానికి
కారణ భూతుడిలా
కాలాన్ని తాళపత్రగ్రందŠంజేసి
చేతబట్టి
చావు -
రేవుల
క్రతువులోనర్చి
అగ్నిహాోత్రుడు మాదిగదాసరి.
నేను సూర్యరదŠమెక్కి
కోట్లపగ్గాలు చేతబట్టి
తూర్పుతీరం నుండి
విజయ దుంధుభి మోగిస్తున్న
విజయ సారధినేను.
వందకోట్లు పాదాలు కందకుండా
కాలు కింద మోపకుండా
నాచర్మంతో చెప్పులు కుట్టినవాడను
మకుటములేని మహారాజులా
వెలగుతున్నవాడను.
నూరు కోట్ల భారతీయులను
పాలితులుగా జేసుకొని
రారాజు, మహారాజు కాగలవాడను.
బాటా, కరోనా, లోటస్‌, లిబర్టీ
నాతోలు ముక్కలు,
నాతోటకలుపు, మొక్కలు
చెప్పు నాజాతి జండా
డప్పు నా ఎజండా
చర్మం నా తంత్రి
జన సముద్రంలో
బాప్తీస్మం పొందిన వాడిని
మృత్యువుని జయించినవాడిని
కల్పవృక్షం నావంట చెఱకు,
కామధేనువు నాకూరాకు
అమృతం నా మధుపానం
మృత్యుంజయుడనై లేచిన వాడిని
నేను మాదిగోణ్ణి
నాకిక మరణంలేదు
నీలివేుఘాల పతాకం చేతబట్టి
లక్షల డప్పుల సింహా నాదంతో
ఐరావతాన్ని అధిరోహిాంచి
నేను రాజ్యంవైపు నడుస్తా.
-దుగ్గనపల్లి ఎజ్రాశాస్త్రి, ఇం.నెం. 43-3-714, ఓల్డ్ విజేత స్ట్రీట్, ఇందుర్తి నగర్, ఒంగోలు-523 001

2 comments:

Anandakiran said...

sir,
i want to get"madiga samachara lekha" . how can i get?/

Unknown said...

Great inspiring poetry