"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

27 ఆగస్టు, 2025

మదర్ థెరీసా సేవారత్న పురస్కారాల ప్రదానం: ముఖ్య అతిథి గా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు (26.8.2025)

 మదర్ థెరీసా సేవారత్న పురస్కారాల ప్రదానం



తమతమ రంగాల్లో అంకితభావంతో పనిచేసేవారికి ఎప్పుడూ సముచిత గుర్తింపు లభిస్తుందనీ, అటువంటి వారికి  ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సేవారత్న పురస్కారాల అందించడం ఎంతో ప్రోత్సాహకరమని ముఖ్య అతిథిగా విచ్చేసిన హెచ్ సియు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.  ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం మాదాపూర్ డివిజన్ పరిధిలో గల స్వాతి హైస్కూల్ లో కన్వీనర్ తాడిబోయిన యాదవ్ అధ్యక్షతన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మదర్ థెరీసా చిత్రపటానికి పూలమాలలు వేసి, క్రొవ్వొత్తులు వెలిగించి అంజలి ఘటించారు. సమాజంలో మానవసేవే మాధవసేవగా భావించి వివిధ రంగాలలో విశేషమైన సేవలందించిన అయిదుగురు సేవా మూర్తులకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, గౌరవ అతిథిగా హాజరైన రాగం మల్లికార్జున యాదవులు సేవారత్న అవార్డులను (దుశ్శాలువ, జ్ఞాపిక, పగిడి, తాంబూలం) ప్రదానం చేశారు. 

శ్రీమతి ఎన్.సుజాత, ఎన్. శ్రీకాంత్, శ్రీ రాంమోహన్ (సత్యసాయి సేవా దళ్ సభ్యులు), డాక్టర్ రఘు అరికపూడి (సామాజికవేత్త), శ్రీ పాటూరి వెంకటేశ్వర్లు (వ్యక్తిత్వ వికాస నిపుణులు, సామాజిక వేత్త) ఈ పురస్కారాల్ని అందుకున్నారు.  ఈ సందర్భంగా ముఖ్య అతిథి దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ “ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడిన నాటి నుండీ చేస్తున్న అనేక సేవాకార్యక్రమాల్ని చేస్తుంది. దీనిలో భాగంగా వివిధ రంగాల్లో అంకితభావంతో పనిచేసేవారిని గుర్తించా,నుకోవడం మంచి నిర్ణయం. ఇటువంటి పురస్కారాల వల్ల నిజంగా పని చేసేవారికి ఎంతో ఆత్మతృప్తి లభిస్తుంద’ని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రశంసించారు. పేదల్లో మళ్ళీ అత్యంత పేదవాళ్ళకు, కుష్టు రోగులకు, ఎయిడ్స్ బాధితులకు వ్యాధిగ్రస్తులకు ప్రేమతో సేవ చేశారు మ. సుమారు 45 సంవత్సరాలు పాటు భారతదేశంతో సహా ప్రపంచంలో అనేక దేశాలలో ఉన్న వేలాదిమంది పేదవాళ్లకు, వయోవృద్ధులకు మదర్ థెరీసా తన సేవలను విస్తరించారు. ఆమె అల్బీనియాలో పుట్టి, అనేక దేశాలలో జీవించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆమెకు గౌరవనీయమైన పౌరషత్వాన్ని ప్రకటించాయి. అంత గొప్ప సేవకురాలు పేరుతో ఈ పురస్కారాలు ఇవ్వడంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఉన్న గొప్ప ఆశయం తెలుస్తుంది అని ఆయన అన్నారు.




తమకు తగిన గుర్తింపు లభించడం పట్ల పురస్కార గ్రహీతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేసి, ఈ ప్రోత్సాహంతో మరింత మందికి స్ఫూర్తినిచ్చేలా పనిచేస్తామని, తమ కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో రాగం మల్లికార్జున యాదవ్, స్వాతి  హైస్కూల్ కరస్పాండెంట్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి‌ఫణి కుమార్ ఎం.బసవ లింగం, సత్యసాయి సేవాసమితి,  సభ్యులు డా.రామన్న, బి.వి.కే.రావు, సుబ్బారావు, మూర్తిగారు, జి.వి.రావు, విష్ణు ప్రసాద్, శివరాం కృష్ణ, పాలం శీను, విద్యార్థులు తదితరులు. పాల్గొన్నారు.























కామెంట్‌లు లేవు: