సామాజిక వాస్తవికతవైపే
ఆధునిక తెలుగు సాహిత్య పయనం
జనం ప్రతిధ్వని దినపత్రిక, 10.3.2025 సౌజన్యంతోతెలుగు లోకం దినపత్రిక, 10.3.2025 సౌజన్యంతో
నవతెలంగాణ దినపత్రిక, 10.3.2025 సౌజన్యంతో
అర్థ శతాబ్దపు ఆంధ్ర కవిత్వం ప్రగతిశీల మార్గంలో నడిచిందని, 1910 నుండి 1960 వరకు మధ్యలో కొంతమంది కవులు సంప్రదాయ పద్యకవిత్వాన్ని అనుసరించినా గురజాడ, కృష్ణశాస్త్రి, కాళోజీ, దాశరథి, శ్రీశ్రీ వంటి వారంతా సామాజిక వాస్తవికతను ప్రతిబింబించే రచనలే చేశారని శ్రీపాద గోపాలకృష్ణమూర్తి తన గ్రంథంలో వివరించారని హెచ్ సి యు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం వారు అంతర్జాలం ద్వారా ఆదివారం నాడు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రత్యేక ప్రసంగం చేశారు. ఈ సమావేశానికి అరసం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరసం నిర్వహిస్తున్న ప్రసంగాల్లో భాగంగా డాక్టర్ శ్రీపాద కృష్ణమూర్తిగారి అర్థ శతాబ్దపు ఆంధ్ర కవిత్వంపై ఈ ప్రసంగాన్ని ఏర్పాటు చేశామని, మా తరువాతి తరంలో ఆచార్య దార్ల ప్రముఖ విమర్శకులనీ, విస్తృతమైన అధ్యయనం చేసే సాహితీవేత్త అనీ, ఆయన తెలుగు సాహిత్య విమర్శకులలో శ్రీపాద కృష్ణమూర్తి విమర్శగురించి మాట్లాడతారని అన్నారు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగులో భారతీయ ఆలంకారిక సిద్ధాంతాలు, సాహిత్య విమర్శ సూత్రాలతో తన రచన కొనసాగుతుందని, లండన్లో చదివారనీ, ఫిజిక్స్ లో డాక్టరేట్ సాధించారనీ, ఆయన లోతైన సాహిత్య విమర్శను చేశారని, ఆధారం లేకుండా ఏ ప్రకటననూ చేయరని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సోదాహరణంగా వివరించారు. తెలుగులో ఆధునికతా, నవ్య కవిత్వం అనేది ఒక్కసారిగా, ఒక వ్యక్తి పరంగా రాలేదని, భారత జాతీయ ఉద్యమం సంస్కరణ ఉద్యమం వంటి వాటి ప్రభావాలు భారతీయ దేశంలో ఆధునికతకు కారణమయ్యాయని, అదే తెలుగు సాహిత్యంలో కూడా ప్రతిబింబించిందని శ్రీపాద కృష్ణమూర్తి తన గ్రంథంలో నిరూపించారని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు విశ్లేషించారు. అనేకమంది ఈ సమావేశంలో అరసం రాష్ట్ర సభ్యులు ఆనంద్, డా. శివప్రసాద్, రచయితలు, రచయిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి