భారతీయ భాషల ప్రచారం & బహుభాషావాదానికి మద్ధతు ఇవ్వడంపై రంగారెడ్డి జిల్లాలో గల నవోదయ లీడర్ షిఫ్ శిక్షణాసంస్థలో 18.11.2024 నుండి 22.11.2024 వరకు టి.జి.టి (తెలుగు) ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. దీనిలో నా ఎం.ఏ. క్లాస్మేట్స్ డా.ఎస్.ఎల్ .వి.ఉమామహేశ్వరరావు, వెలగా ఈశ్వరరావులతో పాటు మా సీనియర్స్ డా.దంటు హేమలత, డా.రామకృష్ణలు, మా జూనియర్ మిత్రుడు డా.మొయిలి శ్రీరాములు, నాకు తెలియని ఉపాధ్యాయులు దీనిలో పాల్గొిన్నారు. నేను రీసోర్స్ పెర్సన్ గా స్టోరీ టెల్లింగ్ ఏజ్ ఏ పెడగాజీ ( ఒక బోధనాశాస్త్రంగా కథాకథనం) అనే అంశంపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ చేశాను.

ప్రసంగిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, పూర్వ శాఖాధ్యక్షులు, తెలుగుశాఖ, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగార్ని పరిచయం చేస్తున్న డా.ఎస్.ఎల్.వి. ఉమామహేశ్వరరావు
ప్రసంగిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, పూర్వ శాఖాధ్యక్షులు, తెలుగుశాఖ, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్.
శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు.
ప్రతిస్పందన తెలియజేస్తూ వెలగా ఈశ్వరరావు మా ఎం.ఏ . ఎంట్రన్స్ ప్రస్తావన చేశాడు. ఆంధ్రాయూనివర్సిటీ. ఎం.ఏ తెలుగు ఎంట్రన్స్ లో నేను త్వరగా పరీక్ష రాసి, పేపర్ ఇచ్చేసిన సంఘటన గుర్తుచేశాడు. ఆ ఎంట్రన్స్ లో నాకు రెండో ర్యాంకు రావడాన్ని కూడా చెప్పాడు.
ఈ ప్రసంగం నాకొక తీపిగుర్తునిచ్చింది. ఈ ప్రసంగం కోసం బి.యిడి.,, టి.పి.టి వంటి శిక్షణా కార్యక్రమాలేవీ చేయకపోయినా టీచింగ్ మెథడ్స్ బాగా అధ్యయనం చేయాల్సి వచ్చింది. మూడు మోడల్స్ లో నా ప్రసంగాన్ని వివరించాను. నా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఆ సంస్థవారికి సమర్పించాను. నా ప్రసంగం కూడా అందరినీ ఆలోచింపజేసిందని భావిస్తున్నాను.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి