"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

18 ఫిబ్రవరి, 2024

తొలి తెలుగు లిటరరీ కాంగ్రెస్ మహాసభల్లో ఆచార్య దార్ల ప్రసంగం (17.2.2024)

ఆంధ్రజ్యోతి దినపత్రిక, 18.2.2024 సౌజన్యంతో 






 తెలుగు న్యూస్ టైమ్స్ చెన్నై సౌజన్యంతో 


దిశ దినపత్రిక, 18.2.2024 సౌజన్యంతో 







తెలుగు లిటరరీ కాంగ్రెస్, తెలుగు శాఖ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతున్న హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 
తెలుగు లిటరరీ కాంగ్రెస్, తెలుగు శాఖ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతున్న హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

నవతెలంగాణ దినపత్రిక, 18.2.2024 సౌజన్యంతో 
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తో డా . గిన్నారపు ఆదినారాయణ 
తెలుగు లిటరరీ కాంగ్రెస్ లో పాల్గొన్న రెండు రాష్ట్రాల తెలుగు శాఖ అధ్యక్షులు, అధ్యాపకులతో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 
సమావేశంలో పాల్గొన్న తెలుగు శాఖ అధ్యక్షులతో ఆచార్య సి.కాశీం, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తదితరులు 
తెలుగు లిటరరీ కాంగ్రెస్, తెలుగు శాఖ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతున్న హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 




తెలుగు భాష అమలు 
ఆచరణాత్మక విధానంతోనే‌ సాధ్యం 

తెలుగు భాష అభివృద్ధి, అది చదువుకునే వారికి ఉపాథి అవకాశాలు రావాలంటే ఆచరణాత్మక భాషా విధానం కావాలని, సమాజంలో వాస్తవాన్ని పాఠ్యాంశాల బోధనలన్నీ ఆచరణాత్మకంగా ప్రభుత్వాలు అమలు చేయాలని హెచ్ సి యు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలుగు మహాసభ ( లిటరరీ కాంగ్రెస్) సభలలో తెలుగు శాఖల అధ్యక్షులు సమావేశంలో పాల్గొని 'వర్తమాన తెలుగు భాషా సాహిత్యాల గమనం, గమ్యం' అనే అంశంపై మాట్లాడారు. ఈ సమావేశానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య చింతకింద కాశీం అధ్యక్షత వహించారు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నూతన విద్యా విధానం (2020) ప్రకారం మాతృభాషలకు అత్యధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం సంస్కృతాన్ని ఇంటర్మీడియట్ తో పాటు డిగ్రీలో కూడా కంపల్సరీ అవుతున్న స్థితి కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు సిలబస్ రూపకల్పనలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించు కోవాలని, అలా చేయడా నికి విశ్వవిద్యాలయాల కేంద్రంగా స్వయం ప్రతిపత్తిని సమర్థవంతంగా ఉపయోగించు కోవాలని ఆచార్య దార్ల సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందే తెలుగువారి భాష, సాహిత్యం, సంస్కృతి, చరిత్రలను దృష్టిలో పెట్టుకొని 'తెలుగు డయాస్పోరా సాహిత్యం'అనే పాఠ్యాంశాన్ని హైదరా బాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ వారు రూపొందించి, అమలుచేస్తున్నారని ఈ సందర్భంగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలో మాతృభాషల అమలుకోసం కొన్ని అధికారిక సంఘాలు ఉన్నప్పటికీ,వాటికి కొన్ని పరిమితుల నేపథ్యంలో తెలుగు కాంగ్రెస్ మహాసభలు జరగాలనీ, దాన్ని ప్రతి ఏడాదీ నిర్వహించుకోవడానికి ఒక కమిటీనిఏర్పాటు చేసుకోవాలని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సూచించారు. తెలుగుభాషపూర్తిస్థాయిలో అమలు కావడానికి, పరిశోధనలు జరగడానికి పారిభాషిక నిఘంటువులు, నిఘంటువులు, మిశ్రమ భాషా నిఘంటువులు రూపొందించుకున్నప్పుడే ఆలోచనకు ఆచరణతోడవుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఆచార్య గంపావెంకట రామయ్య, ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి ఆచార్య పఠాన్ కాశీమ్ ఖాన్, తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఆచార్య రెడ్డి శ్యామల, తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి ఆచార్య పి.కనకయ్య, ఆచార్య లావణ్య, యోగి వేమన విశ్వవిద్యాలయం నుండి ఆచార్య పార్వతి, శ్రీపద్మా వతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య సుభాషిణి, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి ఆచార్య ఎన్.రజని, పాలమూరు విశ్వ విద్యాలయం నుండి ఆచార్యసుధారాణి, ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయంనుండి డా. గరికిపాటి గురజాడ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు: