"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

21 September, 2020

కవి సమ్మేళనం లో అతిథిగా ఆచార్య దార్ల

 


ఈరోజు (21.9.2020) సాయంత్రం ఒంగోలు శారద సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాల కవి సమ్మేళనం జరిగింది.ఈ కవి సమ్మేళనం ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారు శ్రీ హనుమంతరావు గారి పర్యవేక్షణలో నిర్వహించారు. దీనికి నన్ను అతిధిగా పిలిచారు.ఈ వారం చదువు- సంస్కారం అనే అంశంపై కవితలను ఆహ్వానించారు. చాలా మంది మంచి కవితలు చదివారు. కొంతమంది పాటల రూపంలో,  మరికొంతమంది పద్యాల రూపంలో, ఇంకొంతమంది వచన కవిత్వాన్ని చదివారు. కవులంతా చదువు- సంస్కారం గురించి మంచి కవిత్వాన్ని చదివి వినిపించారు. ముఖ్యంగా అప్పుడే రచనా ప్రపంచం లోకి అడుగుపెడుతున్న వారు ఈ సాహితీ సాంస్కృతిక సంస్థ ద్వారా ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు. వారిని ఈ సంస్థ బాగా ప్రోత్సహిస్తుంది.ఈ కరోనా లాక్డౌన్ సమయంలో కూడా ఉభయ రాష్ట్రాలలోని కవులు అంతర్జాల కవి సమ్మేళనం లో పాల్గొంటున్నారు. ఆ విధంగా ఇంటిదగ్గర అందరితో కలిసిమెలిసి ఉన్నామనే భావన కలిగేటట్లు
అంతర్జాల కవిసమ్మేళనాలు ఉపయోగపడతాయి. ఒక అంశం మీద కవిత్వం రాయడం వల్ల వాళ్ల ఆలోచన మంచి ఆలోచనలు రూపొందడానికి ఉపయోగపడుతుంది.అందుకని ఇటువంటి కవి సమ్మేళనంలో పాల్గొనమని ఆహ్వానించినప్పుడు నేనుకూడా పాల్గొంటున్నాను.  ఈ సందర్భంగా ఆంధ్ర మహా భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పిన 'చదివించిరి నను గురువులు' అనే పద్యం తర్వాత విద్య ప్రాధాన్యాన్ని తెలిపే  ఏనుగు లక్ష్మణ కవి  విద్య నిగూఢగుప్తమగు విత్తము... అనే పద్యం  చెప్పాను. అలాగే , విశ్వనాథ సత్యనారాయణ గారి ' మర,నిదేల...అనే పద్యం చెప్పి, ఎవరి అనుభవం వాళ్లకి కొత్తగా ఉంటుందని అందుకని ప్రతి పదంలోనూ కొత్తగా కవిత్వం రాస్తున్నవాళ్ళు ఒక కొత్త అనుభూతిని పొందుతారని వ్యాఖ్యానించాను. అటువంటి కొత్త తరానికి స్వాగతం చెప్తున్న  నిర్వాహకులను అభినందించాను.

No comments: