"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

ద్వానాశాస్త్రి ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
ద్వానాశాస్త్రి ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

05 మే, 2008

త్వరలో డా.ద్వానాశాస్త్రి గారికి షష్టి పూర్తి !


ఈ మధ్య నన్నొకాయన చాలా సీరియస్ గా ఒక మాట అడిగాడు. "నీకు బ్రాహ్మణులంటే ద్వేషమా?" అని!
నాకు బ్రాహ్మణులే కాదు, ఎవరిమీదా వ్యక్తిగతంగా ద్వేషం లేదు" అన్నాను.
మరి నీ మాటల్లో, ప్రసంగాల్లో, రాతల్లో బ్రాహ్మణ వ్యతిరేకత కనిపిస్తుంది కదా!" అని అనుమానంగా నా వైపు చూశాడా పెద్దమనిషి.
నన్నింత బాగా అర్థం చేసుకున్నందుకు ఆయనకేమి చెప్పాలో నాకర్థం కాలేదు- కాసేపు!
ఆయన ఏ విషయాన్నెలా అర్థం చేసుకుంటాడో కదా అని కాస్త జాలీ కలిగింది.
అయినా... మనం ప్రతి మనిషినీ ఏదో ఒక్కోణం నుండే చూస్తాం. కొన్ని సార్లు ముందే ఎవరో చెప్పిన అభిప్రాయాల్ని అన్వయించుకొంటూ, మనం మళ్ళీ అదే మార్గం లో అంచెనా కొస్తుంటాం. మన సొంత ఆలోచనలు పక్కకి పోతుంటాయి. వ్యక్తిగతం, వ్యవస్థీకృతం వేర్వేరు. అవి రెండూ ఒక్కోసారి కలిసిపోతుంటాయి. వాటిని విడిగా అర్థం చేసుకోలేనప్పుడు మనం అలాగే అవగాహన చేసుకుంటాం. నేనూ సామాన్య మానవుణ్ణే! నాకూ కొన్ని అనుభూతులుంటాయి. కులమే అన్నింటికీ ప్రాతిపదిక కాదు. కానీ, కులమే చాలా వాటికి కారణమవుతుంది.వ్యక్తిగతమైన సంబంధాలు, వ్యవస్థకంతటికీ ముడిపెట్టలేం. కనుక, ఆ ద్వేషం వ్యవస్థపైనా? వ్యక్తిపైనా ? అనేది గుర్తించుకోవాలి. నా విషయంలోనే వ్యక్తిగతంగా చూస్తే నేనీ స్థాయిలో ఉండడానికి ఎంతోమంది బ్రాహ్మణులు కూడా కారణమయ్యారు. అలాంటి వారిలో డా.ద్వా.నా. శాస్త్రి ( ద్వాదశి నాగేశ్వర శాస్త్రి ) గారొకరు. ఇప్పుడు ఆయన గురించి నా మాటల్లో... అదే నా రాతల్లో..!
***
నేను ఇంటర్మీడియెట్ నుండి డిగ్రీ వరకూ స్పెషల్ తెలుగు ఒక ప్రత్యేకాంశంగా అమలాపురంలో చదువుకున్నాను. అక్కడో గొప్ప కాలేజీ ఉంది. దాని పేరు శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజ్. దాన్నిపొడి అక్షరాల్లో ఎస్. కె. బి. ఆర్. కాలేజ్ అని పిలు్స్తారు. ఆ పరిసర ప్రాంత విద్యార్ధినీ విద్యార్ధులకి ఆ కాలేజీలో సీటొచ్చిందంటే గొప్ప ఆనందం. అప్పుడే జీవితంలో ఏదో సాధించామనే ఫీలవ్వుతుంటారు. ఆ కాలేజీలో చదవడం ఒక అదృష్టం అన్నవాళ్ళను చూశాను. అందులో చదువుకోవడం గొప్పవరంగా భావించే వాళ్ళనీ చూశాను. దానికి వాళ్ళు రకరకాల కారణాల్ని చెప్తుంటారు.
నన్ను అడిగినా నేనూ అలాగే చెప్తాను. అయితే, ఆ కాలేజీలో చేరాలనుకున్నది మాత్రం ఒక గొప్ప రచయిత దగ్గర చదువుకోవాలనుకోవడమే ప్రధాన కారణమని చెప్తాను.
ఆయనే డా// ద్వానాశాస్త్రి గారు!
ఆ కాలేజీలో చేరక ముందే ఆయన గురించి నాకు కొద్దిగా తెలుసు. పత్రికల్లో తెలుగు సాహిత్యం గురించి విస్తృతంగా రాసే రచయితగా తెలుసు. ఆ కాలేజీలో చేరేవరకూ నేను ఆయన రూపాన్నెప్పుడూ చూడలేదు. ఆయన మాటల్ని కూడా అంతకు ముందెప్పుడూ విన్లేదు. పత్రికల్లో ఆయన రాసే రచనలను బట్టే ఆయన తెలుసు. తెలుగు సాహిత్యాన్నిఅందరికీ అందిచడానికి ఆయనేదో నడుముకట్టారనిపించేది.
మా కోనసీమ కేంద్రం అమలాపురంలో విస్తృతంగానే సాహిత్య సభలు జరుగుతుంటాయి. ఆ వార్తలను పత్రికలు కూడా ఫోటోలతో సహా ప్రముఖంగానే ప్రచురిస్తుంటాయి. వాటిని బాగా గమనిస్తుండేవాడ్ని.
ఆ సాహిత్య వార్తల్లో నేను కూడా ఒక వ్యక్తిని కావాలనిపించేది!
ఆ కాలేజీలో చేరకముందు మా సామాజిక వర్గంలో ఎవరూ సాహిత్యం రాసిన వారు లేకపోవడం గమనించాను. హైస్కూల్లో చదివేటప్పుడు తెలుగు మాష్టారు శ్రీకంఠం లక్ష్మణమూర్తి, సోషల్ మాష్టారు ఆతుకూరి లక్ష్మణరావు గార్లు నన్ను బాగా ప్రోత్సహించేవారు. ఇద్దరూ బ్రహ్మణ కులానికి చెందినవాళ్ళే! అయినా నన్ను ఎంతగానో ఇష్టపడేవారు. నాకూ వాళ్ల వృత్తులూ, ప్రవృత్తులూ బాగా నచ్చేవి.
అందులో ఒకరు శ్రీకంఠం లక్ష్మణమూర్తి తెలుగు సాహిత్యాన్ని గొప్పగా చెప్పేవారు.
మరొకరు ఆతుకూరి లక్ష్మణరావు గారు స్థానిక సమస్యల పరిష్కారం గురించీ ఆలోచించేవారు. రోడ్లు బాగుండక పోయినా, వీధి దీపాలు వెలగకపోయినా పత్రికల ద్వారా ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చేవారు. పత్రికల్లోని వార్తలను స్కూల్లో బ్లాక్ బోర్డ్ పై రాయించేవారు. అలా రోజూ వార్తలను పత్రికల నుండి సేకరించి, వాటిని ఆయనకు చూపించిన తర్వాత మా చేతనే బోర్డ్ పై రాయించేవారు. మంచి వార్తలను సేకరించగలిగిన వాళ్లకు, రెగ్యులర్ గా వార్తలను సేకరించే వాళ్లకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కూడా ఇచ్చేవారు. ఆ విధంగా ఆ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని బహుమతి సాధించడం కోసమైనా పత్రికలను చదవడానికి ఆసక్తి చూపించే వాళ్ళం. నాకు ఎనిమిదో తరగతిలో ప్రథమ బహుమతి వచ్చింది. అప్పుటి నుండే పత్రికల్లో డా//ద్వానాశాస్త్రి గారి పేరు ఎన్నోసార్లు చదివాను. ఆయన రాసిన వ్యాసాల్ని కూడ వార్తలుగా మా మాష్టారు దగ్గరకు రాసికెళ్ళి పట్టుకెళ్ళి చూపించేవాడిని. వాటిని సాహిత్య వ్యాసాలంటారనీ, వాటినీ వార్తాంశాలుగా పెట్టవచ్చంటూ చెప్పేవారు. అలా ఆయన నన్ను ఆ సాహిత్య పేజీలను కూడా చదివించేటట్లు ప్రోత్సహించేవారు. ఆ విధంగా పత్రికలు చదవడమే కాకుండా, స్థానిక సమస్యల గురించీ రాసేవాడిని. కథలు, వ్యాసాలు చదివి వాటిపై నాకు తోచిన అభిప్రాయాలనూ పత్రికలకు రాసి పంపించేవాడ్ని.
నాకు కూడా పత్రికల్లో పేరు చూసుకోవాలనీ, అదీ సాహిత్యం పేజీల్లో నా వ్యాసాలు రావాలనీ అనుకొనేవాడ్ని. ఎలా రాస్తే పత్రికల్లో వ్యాసాలు వస్తాయో డా// ద్వానాశాస్త్రి గార్ని అడిగితే బాగుంటుందనీ అనుకుంటుండేవాడ్ని! అందుకోసమైనా ఆ కాలేజీలో చేరాలనుకున్నాను.
నేను అనుకున్నట్లే, ఇంటర్మీడియెట్ చదువుకోవడానికి ఎస్.కె.బి.ఆర్. కాలేజీలో సీటొచ్చింది. అప్పుడు కాలేజీ షిప్టు సిస్టమ్‌ లో నడిపేవారు. మాకు ఉదయమే క్లాసులు జరిగేవి. మొదట్లో ఆ క్లాసులకు డా// ద్వానాశాస్త్రి గారు వచ్చేవారు కాదు.
కొన్ని రోజులు జరిగి పోయాయి.
డా// ద్వానాశాస్త్రి గార్ని కలవలేకపోయాను.
లెక్చరర్స్ ని కలవాలంటే భయం కదా!.
దానికి అనేక కారణాలు.
మా కాలేజీలో వార్షిక సంచికకు విద్యార్థి ప్రతినిథులను సృజనాత్మక పోటీల ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్ ఫస్టియర్ లో ఉండగా నిర్వహించిన వ్యాస రచన పటీల్లో నాకు ప్రథమ బహుమతి వచ్చింది.సంపాదక వర్గంలో తెలుగు ప్రతినిథిగా నన్ను ఎంపిక చేశారని కాలేజీ వాళ్ళు నోటీసు పంపించారు. అది చూసి,డా// ద్వానాశాస్త్రి గారు నాకు కబురు పెట్టి మరీ అభినందించారు.
ఎవరి కోసమైతే కాలేజీలో చేరానో, ఆయనే నన్ను దగ్గరకు పిలిచి మరీ అభినందించే సరికి నా ఆనందానికి అవధుల్లేవు.
ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆయన కూడా మాకు పాఠాలు చెప్పడానికి వచ్చేవారు. కేవలం పాఠాలే కాకుండా, వక్తృత్వ పోటీలకు శిక్షణ కూడా ఇచ్చేవారు. ఇతర కాలేజీలకు తీసుకెళ్ళేవారు. మా గురువు గారి అబ్బాయి కూడా అదే కాలేజీలో బి.ఎస్సీ., చదువుతుండేవాడు. అతను కూడా పోటీల్లో పాల్గొనేవాడు. అయినా గాని గురువు గారు నాకూ అనేక మెళకువలను చెప్పేవారు. ఆ పోటీల బృందంలో నేను ఒక్కడినే దళితుడ్ని కా వడం వల్ల సహజంగానే కొంత బిడియ పడుతుండే వాణ్ణి. అలాంటి సమయంలో నన్ను మా గురువు గారు, వాళ్ల అబ్బాయి, మిగతా వాళ్ళు నన్ను దళితుడ్ననే స్పృహ రానివ్వకుండా కలిసి మెలిసి ఉండేవారు. ఇతర ప్రాంతాల్లోని కాలేజీల్లో పోటీలకు వెళ్లేటప్పుడు అక్కడకి వెళ్ళి అందరం కలిసే పడుకొనేవాళ్లం. కలిసే తినేవాళ్లం. అప్పుడే నాకు ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గరగా పరిశీలించగలిగే అవకాశం కలిగింది. వాళ్ళు సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చి కూడా నా పట్ల ఎప్పుడూ వివక్షను ప్రదర్శించకపోవడం నేటికీ ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది.
మా గురువు గారు నన్ను సాహిత్య సభలకు పిలిచి మరీ తీసుకెళ్ళేవారు. నేను డిగ్రీలో ఉండగా రాజమండ్రిలో భారతీయ సాహిత్య పరిషత్ సభలు జరుగుతుంటే వాళ్ళ అబ్బాయితో పాటు నన్ను కూడా తీసుకెళ్ళారు. దారి ఖర్చులు కూడా ఆయనే పెట్టుకున్నారు. ఆ సభలు మూడు రోజులు జరిగాయి. గొప్పసాహితీ వేత్తల్ని ఎందర్నో అప్పుడే చూశాను. వాళ్లకి నన్ను పరిచయం చేసేవారు. కవిత్వం రాస్తాడనీ, మా విద్యార్థేననీ వాళ్లకి నా గురించి చెప్పేవారు. ఆ మాటలు నాకెంతో టానిక్కులా అనిపించేవి. ఆచార్య ముదిగొండ శివప్రసాద్, ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య, ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర ఆజాద్ వంటి వాళ్ళనెందరినో ఆ సభల్లోనే మొట్ట మొదటిసారిగా చూశాను. వాళ్ల ప్రసంగాల్లో ఏదో గొప్ప శక్తి ఉందనిపించేది. చదివితే తెలుగు సాహిత్యమే చదవాలనిపించేది. వాళ్ళతో కలిసి భోజనం చేయడం, వాళ్లతో మాట్లాడడం ఒక గొప్ప థ్రిల్లుగా అనిపించేది. తర్వాత వాళ్ళ పేర్లతో ఏదైనా రచన కనిపిస్తే దాన్ని చదివి లేఖలు రాసేవాడిని. చంద్రశేఖర ఆజాద్ గారి కథలు చాలా ఆసక్తిని కలిగించేవి. బాల సాహిత్యాన్ని బాగా రాసేవారాయన. వాటిని చదివి నా అభిప్రాయాలను కార్డ్ పై రాసేవాడ్ని. గుండ్రని అక్షరాలతో సమాధానాలు రాసేవారాయన. అలా చాలా మందితో పరిచయాలు ఏర్పడడానికి మా గురువు గారు డా//ద్వానాశాస్త్రి గారే ప్రధాన కారణం.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో చేరిన తర్వాత కూడా మా గురువు గారు డా//ద్వానాశాస్త్రి గారితో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగేవి. అప్పుడప్పుడూ నా కవితలు పత్రికల్లో వస్తుండేవి. వాటి గురించి గురువు గార్కి ఉత్తరాలు రాసి అభిప్రాయం చెప్పమనేవాడ్ని.అనేక సలహాలిచ్చేవారు. ఆయన రాసిన తెలుగు సాహిత్య చరిత్ర లో నా గురించి కూడా రాశారు. హైదరాబాదు వచ్చినప్పుడల్లా ఫోను చేసేవారు. కలిసేవాడ్ని. పుస్తకాలు ఎలా సేకరించుకోవాలో నేర్పారు. ఆదివారం హైదరాబాదులో అబిడ్స్ పరిసరాలన్నీ పాత పుస్తకాలతో కళ కళ లాడతాయనీ, అందులో చాలా విలువైన పుస్తకాలు దొరుకుతాయనీ చెప్పేవారు.
అలా నాకు ఎంతగానో గుర్తుండి పోయే అనేక సంఘటనలను స్మృతి పథం నుండి అక్షర రూపమివ్వడానికి వారి షష్టి పూర్తి సందర్భంగా అవకాశం కలిగించినందుకు కృతజతలు తెలియజేస్తున్నాను.
మా గురువు గారు ఆయురారోగ్యాలతో సంపూర్ణమైన జీవితాన్ని ఆనందమయంగా గడపాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.

11 డిసెంబర్, 2017

‘సాహిత్య, సామాజిక దార్శనికుడు డా. కట్టమంచి రామలింగా రెడ్డి ’.. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

సమాజంలోనూ, సాహిత్యంలోను గొప్ప దార్శనిక దృష్టి గల అభ్యుదయవాది డా.కట్టమంచి రామలింగారెడ్డి అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య  దార్ల వెంకటేశ్వరరావు అన్నారు.  కట్టమంచి రామలింగారెడ్డి జయంతి సందర్భంగా శ్రీ త్యాగరాయగానసభ, హైదరాబాదులో 10 డిసెంబర్ 2017 సాయంత్రం  జరిగిన సాహితీ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 
ఈ కార్యక్రమాన్ని శ్రీత్యాగరాయ గానసభ, ద్వానాసాహితీ కుటీరం సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. కట్టమంచి రామలింగారెడ్డి వ్యక్తిత్వాన్ని, సాహిత్య కృషిని, విద్యా సంస్కరణలను సోదాహరణంగా వివరించారు.
ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ద్వా.నా.శాస్త్రి అధ్యక్షత వహించిన ఈ సభలో కళా వి.ఎస్. జనార్ధనమూర్తి, ప్రముఖ కవులు రఘువీర్ ప్రతాప్, బండి శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు. సభలో ముందుగా కట్టమంచి రామలింగారెడ్డి గారి చిత్రపటానికి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పూలమాలవేసి, జ్యోతి ప్రజ్వలనం చేశారు.  తన  ఉపన్యాసాన్ని కొనసాగుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రతివాళ్లూ ఏ సాహిత్యాన్ని చదివినా ముందుగా తమ అస్తిత్వ మూలాలను వాటిలో వెతుక్కుంటారని , కట్టమంచి వారి రచనలు కూడా ఈఆ దృష్టితో చూసే అవకాశం ఉందన్నారు. నిజానికి అలా చూడవలసిన అవసరం  ఉందని కూడా చెప్పారు.

జ్యోతి ప్రజ్వనం చేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తదితరులు 
 ప్రస్తుతం తెలుగులో అస్తిత్వ ఉద్యమ సాహిత్యం  విస్తృతంగా కనిపిస్తోంది. ప్రతివాళ్ళూ  తమ గురించి ఆ సాహిత్యంలో కనిపించే తమ జీవితం గురించి చేసే అన్వేషణ మొదలైంది. కట్టమంచి వారిని నేను కూడా దృష్టితో చూశాను. నాకు ఆయన వ్యక్తిత్వంలో  సాహిత్యంలో మూడు ముఖ్యాంశాలు బాగా నచ్చాయి. మొదటిది సామాజిక అభ్యుదయ ఆకాంక్షతో అందరికీ కలగాలనే దృష్టి ఆయన వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. రెండవది ... ప్రాంతీయ దురభిమానం లేకుండా జాతీయ సమైక్యత సమగ్రతలను పెంపొందించే దృష్టి కలిగి ఉండటం. మూడవది లింగపరమైన వివక్షకు దారిలేకుండా స్త్రీ ఔన్నత్యాన్ని గుర్తించే రచనలు చేయటం. వీటితోపాటు సాహిత్యంలో సంప్రదాయాలతో పాటే ఆధునికతను తీసుకొచ్చారు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా, పాలనాదక్షుడుగా, మానవతావాదిగా  కట్టమంచి రామలింగారెడ్డి అనేక పార్శ్వాలలో కనిపిస్తాడని పేర్కొన్నారు.  ఆయన వ్యక్తిత్వాన్ని వివరించే అనేక  అంశాల్ని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వివరించారు. 

సభలో మాట్లాడుతున్న  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 
కట్టమంచి రామలింగారెడ్డి  మైసూరులో విద్యాశాఖాధిరిగా ఉన్నప్పుడే మొట్టమొదటిసారిగా దళితులకు విద్యాలయాల్లో చదువుకునే అవకాశాన్ని కలిగించారన్నారు. దానికోసం మైసూరు సంస్థాన దివానుగారితో కూడా పోరాడాల్సి వచ్చిందన్నారు. అప్పుడు మైసూరు రాజా కట్టమంచి వారి నిర్ణయాన్నిస్వాగతించారనివివరించారు.అలాగే, ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని విశాఖపట్టంలో పెట్టడానికి కట్టమంచి ఎంతో కృషిచేశారని, ప్రాంతీయ భేదాలు లేని వ్యక్తి అని కొనియాడారు. స్త్రీ ఔన్నాత్యాన్ని చాటిన గొప్ప అభ్యుదయవాదిగా ఆయన రాసిన ముసలమ్మ మరణం, నవయామిని కావ్యాలు తెలుపుతాయని వాటిలోని కొన్ని ఉదాహరణలను పేర్కొన్నారు. విద్యావేత్తగా ఉస్మానియా, మైసూరు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల స్థాపనలో ఆయన నివేదికలు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కొనియాడారు. పాఠం చెప్పడంలో, ప్రసంగాన్ని రక్తికట్టించడంలో, విద్యాసంస్కరణలు అమలు పరచడంలో కట్టమంచి ఎంతో పరిణత దృష్టితో వ్యవహరించేవారని, అందువల్ల ఆయన చేసిన కృషిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తన గురువు డా.ద్వానాశాస్త్రి గారు తననెంతో ్రపోత్సహించారనీ, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానంలో ఉండడానికి గురువులు, సహృదయులెందరి సహకారమో ఉంటుందనీ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చెప్పారు. డా. ద్వానాశాస్త్రి గారి దగ్గర తాను ఇంటర్మీడియెట్ నుండి డిగ్రీవరకు స్పెషల్ తెలుగు చదువుకున్నానని, ఆయన, మరికొంతమంది డా. చక్రపాణిరావు, డా. మార్గశీర్ష వంటి వారి సహకారంతో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో ఎం.ఏలోచేరానన్నారు. తర్వాత ఆ విశ్వవిద్యాలయంలోనే డాక్టరేట్ పూర్తిచేసి ఆచార్యుడిగా కూడా పనిచేయడం వెనుక గురువుల ప్రోత్సాహం  ఎంతో ఉందని గుర్తుచేసుకున్నారు. అలాంటి  గురువులెంతోమంది డా.కట్టమంచి రామలింగారెడ్డిగారికి దొరకడం వల్లనే  ఉన్నత వ్యక్తిత్వాన్ని అలవర్చుకున్నారరన్నారు. సంస్కృతాన్ని కాపాడ్డం కోసం మద్రాసు శాసనసభలో బడ్జెట్ కేటాయించాలని వాదించారనీ, అంతేకాకుండా శత్రువుల్ని సహితం ప్రేమించే గుణం ఉందనీ వివరించారు.
ఆహ్వాన పత్రం 

సభలో పరిచయ ప్రసంగం చేస్తూ డా.ద్వానాశాస్త్రిగారు కట్టమంచి రామలింగారెడ్డి తెలుగు సాహిత్య విమర్శకు దిక్సూచి వంటివారన్నారు. కవిత్వతత్వవిచారం తో తెలుగు సాహిత్య విమర్శ మలుపుతిరిగిందనీ, శాస్త్రీయత పొందిందనీ అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని ఘనం
తన గురువు డా.ద్వానాశాస్త్రి గారు తననెంతో ్రపోత్సహించారనీ, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానంలో ఉండడానికి గురువులు, సహృదయులెందరి సహకారమో ఉంటుందనీ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చెప్పారు. డా. ద్వానాశాస్త్రి గారి దగ్గర తాను ఇంటర్మీడియెట్ నుండి డిగ్రీవరకు స్పెషల్ తెలుగు చదువుకున్నానని, ఆయన, మరికొంతమంది డా. చక్రపాణిరావు, డా. మార్గశీర్ష వంటి వారి సహకారంతో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో ఎం.ఏలోచేరానన్నారు. తర్వాత ఆ విశ్వవిద్యాలయంలోనే డాక్టరేట్ పూర్తిచేసి ఆచార్యుడిగా కూడా పనిచేయడం వెనుక గురువుల ప్రోత్సాహం  ఎంతో ఉందని గుర్తుచేసుకున్నారు. అలాంటి  గురువులెంతోమంది డా.కట్టమంచి రామలింగారెడ్డిగారికిదొరకడంవల్లనేఉన్నతవ్యక్తిత్వాన్ని అలవర్చుకున్నారరన్నారు. సంస్కృతాన్ని కాపాడ్డం కోసం మద్రాసు శాసనసభలో బడ్జెట్ కేటాయించాలని వాదించారనీ, అంతేకాకుండా శత్రువుల్ని సహితం ప్రేమించే గుణం ఉందనీ వివరించారు. 
ఈ సందర్భంగా నిర్వాహకులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని ఘనంగా సత్కరించారు. తననింతగా గౌరవించిన గురువు డా.ద్వానాశాస్త్రి గార్ని తమ శిష్య, సతీసమేతంగా  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు శ్శాలువాతో సత్కరించారు. 


సభలో మాట్లాడుతున్న డా.ద్వానాశాస్త్రిగారు 
 ఆచార్య దా ర్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న డా.ద్వానాశాస్త్రి, కళా వి.ఎస్.జనార్ధనమూర్తి, బండిశ్రీనివాస్, శ్రీమతి వసుంధర తదితరులు  
డా.ద్వానాశాస్త్రిగార్ని సత్కరిస్తున్న సతీ, శిష్యసమేతంగా సత్కరిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

 సభలో పాల్గొన్నసాహితీవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు


09 ఫిబ్రవరి, 2015

‘సాహితీమూర్తులు-స్ఫూర్తులు’ గ్రంథావిష్కరణ విశేషాలు




నమస్తేతెలంగాణ, హైదరాబాదు 9-2-2015

సాక్షి, హైదరాబాదు 9-2-2015

ఈనాడు హైదరాబాదు, 9-2-2015

డా.దార్ల వెంకటేశ్వరరావు రచించిన ‘సాహితీమూర్తులు-స్ఫూర్తులు’ గ్రంథావిష్కరణ సభ దృశ్యం. గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న ప్రముఖరచయిత ఆచార్య ఎన్.గొపిగారు. వేదికపై వరుసగా డా.వంశీరామరాజు, ఆకెళ్ళ రాఘవేంద్ర, డా.ద్వానాశాస్త్రి, డా.దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఎన్.గోపి, శ్రీ బైసా దేవదాసు, ఆచార్య జి. అరుణకుమారి, డా. కళావేంకటదీక్షితులు, డా.తెన్నేటి సుధాదేవి మొదలైన వారున్నారు.
సభాధ్యక్షత వహించిన శ్రీ బైసదేవదాసుగారు,సంపాదకుడు, నేటినిజం దినపత్రిక

సభలో ఆశీనులైన జనం

సభలో ఆశీనులైన జనం

సభలో ఆశీనులైన జనం

సభలో ఆశీనులైన జనం

సభలో ఆశీనులైన జనం

సభలో ఆశీనులైన జనం

సభలో ఆశీనులైన జనం

గురువుగారు డా.ద్వానాశాస్త్రిగారికి డా.దార్ల వెంకటేశ్వరరావు తన పుస్తకాన్ని అంకితమిస్తున్న దృశ్యం
ముఖ్యఅతిథి, గ్రంథావిష్కర్త ఆచార్య ఎన్.గోపీ గారు ప్రసంగిస్తున్న దృశ్యం

శిష్యుడు.దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న గురువుగారు డా.ద్వానాశాస్త్రిగారు

శిష్యుడు.దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న గురువుగారు డా.ద్వానాశాస్త్రిగారు

శిష్యుడు.దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న గురువుగారు డా.ద్వానాశాస్త్రిగారు

డా.ద్వానాశాస్త్రిగార్ని సత్కరిస్తున్న డా.దార్ల వెంకటేశ్వరరావు గారి శిష్యులు

డా.ద్వానాశాస్త్రిగార్ని సత్కరిస్తున్న డా.దార్ల వెంకటేశ్వరరావు గారి శిష్యులు
గ్రంథరచయిత డా.దార్ల వెంకటేశ్వరరావునీ, అతని శ్రీమతి డా. మంజుశ్రీని సత్కరిస్తున్న దార్ల శిష్యులు

గ్రంథరచయిత డా.దార్ల వెంకటేశ్వరరావునీ, అతని శ్రీమతి డా. మంజుశ్రీని సత్కరిస్తున్న దార్ల శిష్యులు

గ్రంథరచయిత డా.దార్ల వెంకటేశ్వరరావునీ, అతని శ్రీమతి డా. మంజుశ్రీని సత్కరిస్తున్న దార్ల శిష్యులు
డా.ద్వానాశాస్త్రి, ఆచార్య ఎన్.గోపి, డా.దార్ల లతో విద్యార్థులు

డా.ద్వానాశాస్త్రి, ఆచార్య ఎన్.గోపి, డా.దార్ల లతో విద్యార్థులు

డా.ద్వానాశాస్త్రి, ఆచార్య ఎన్.గోపి, డా.దార్ల లతో విద్యార్థులు

డా.ద్వానాశాస్త్రి, ఆచార్య ఎన్.గోపి, డా.దార్ల లతో విద్యార్థులు

గ్రంథాన్ని అంకితం తీసుకున్న అనంతరం మాట్లాడుతున్న డా.ద్వానాశాస్త్రిగారు

డా.ద్వానాశాస్త్రిగార్ని సత్కరిస్తున్న విద్యార్థులు

డా.ద్వానాశాస్త్రిగార్ని సత్కరిస్తున్న విద్యార్థులు

డా.ద్వానాశాస్త్రిగార్ని సత్కరిస్తున్న విద్యార్థులు
రాజా పాటలతో సభ ఉర్రూతలూగింది

ఆత్మీయ అతిథి ఆచార్య జి. అరుణకుమారిగారు ప్రసంగిస్తున్నదృశ్యం

పుస్తక సమీక్ష చేస్తున్న శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్రగారు

సభలో అతిథులను పరిచయం చేసి సభను నిర్వహిస్తున్న డా. తెన్నేటి సుధాదేవిగారు

సభావేదికపై ఆశీనులైన అతిథులు
ఆచార్య ఎన్.గోపిగారి ప్రసంగం
డా.ద్వానాశాస్త్రిగారు ప్రసంగిస్తున్న దృశ్యం

డా.దార్ల వెంకటేశ్వరరావు స్పందన