కృష్ణవేణి, పుష్పిణిలకు సెంట్రల్ ‘వర్సిటీ డాక్టరేట్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పరిశోధనలు చేసిన గొంగులూరి కృష్ణవేణి, దారిశెట్టి పుష్పిణిలకు హెచ్ సియు పిహెచ్.డి. డాక్టరేట్ డిగ్రీలను ప్రకటించింది. తార ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సంగారెడ్డిలో పార్ట్ టైమ్ తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న శ్రీమతి జి. కృష్ణవేణి ‘తెలుగు సాహిత్య చరిత్రలు-పరిశీలన’అనే అంశంపైనా, శ్రీమతి దారిశెట్టి పుష్పిణి ‘మరుపూరు కోదండరామరెడ్డి జీవితం, రచనలు సమగ్రపరిశీలన’ అనే అంశంపై పరిశోధన చేశారు. ఇరువురూ యూజిసి వారి రీసెర్చ్ ఫెలోషిప్ పొంది, పరిశోధన చేశారు. ఇరువురూ ఎం.ఏ. తెలుగు, పిహెచ్.డి. లను సెంట్రల్ యూనివర్సిటీలోనే పూర్తి చేసి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పరిశోధన పత్రాలను సమర్పించారు. అనేక పరిశోధన పత్రికల్లో పరిశోధన పత్రాలను రాశారు. ఇరువురికీ డాక్టరేట్ డిగ్రీకి అర్హత పొందినట్లు హెచ్ సియు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కార్యాలయం వారు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇరువురికీ వచ్చే యేడాది అక్టోబరు లో జరిగే స్నాతకోత్సవంలో డిగ్రీపట్టాలను ప్రదానం చేస్తారు. తమ ఇరువురూ అధ్యాపక వృత్తి అంటే ఇష్టమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు, పర్యవేక్షకులు, తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఇతర అధ్యాపకులు, కుటుంబ సభ్యులు ఇరువురి పరిశోధకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
నినాదం దినపత్రిక 20.12.2025 సౌజన్యంతో
నమస్తే తెలంగాణ దినపత్రిక 20.12.2025 సౌజన్యంతో
ఆంధ్ర జ్యోతి నపత్రిక 20.12.2025 సౌజన్యంతో
సాక్షి దినపత్రిక 20.12.2025 సౌజన్యంతో
ఆంధ్రప్రభ దినపత్రిక 20.12.2025 సౌజన్యంతో
లోకల్ గైడ్ తెలంగాణ దినపత్రిక 20.12.2025 సౌజన్యంతో
మన తెలంగాణ దినపత్రిక 20.12.2025 సౌజన్యంతో
దిశ దినపత్రిక 20.12.2025 సౌజన్యంతో
జన ప్రతిధ్వని దినపత్రిక 20.12.2025 సౌజన్యంతో












కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి