"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

31 మార్చి, 2025

ఆచార్య 'దార్ల' కు ఏ.పి.ప్రభుత్వ ఉగాది పురస్కారం

జనప్రతిధ్వని దినపత్రిక 31.3.2025 సౌజన్యంతో ...


హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీవిశ్వావ‌సు నామ సంవ‌త్స‌ర ఉగాది సంద‌ర్భంగా ఉగాది పురస్కారంతో సత్కరించింది. ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారి చేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వీరికి ఈ పురస్కారంతో పాటు దుశ్శాలువ, జ్ఞాపికలతోపాటు పది వేల రూపాయల నగదును బహుమతిగా ఇచ్చి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, అవనిగడ్డ శాసనసభ్యులు, అవార్డ్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ మండలి బుద్ధప్రసాద్,ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక సంఘం చైర్మన్ పొడపాటి తేజస్విని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్. మల్లికార్జున రావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. కవిగా ఆయన ‘దళిత తాత్వికుడు’, ‘నెమలి కన్నులు’ కవితా సంపుటాలను, ‘వీచిక’ సాహిత్య విమర్శ వ్యాసాలు, ‘బహుజన సాహిత్య దృక్పథం’, ‘పునర్మూల్యాంకనం’ ‘సాహితీసులోచనం’ ఆత్మకథ ‘నెమలికన్నులు’ తదితర గ్రంథాలు రచించారు. గతంలో సెంట్రల్ యూనివర్సిటీ వారు పరిశోధన బోధన రంగాలలో విశేషమైన కృషి చేసినందుకు గాను ఇచ్చే ఛాన్సలర్ అవార్డుతో పాటు లక్ష రూపాయల ప్రత్యేక పరిశోధన నిధిని అందుకున్నారు. వీటితోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఇచ్చే కీర్తి పురస్కారం, జాషువా జాతీయ పురస్కారం తదితర పరిష్కారాలు అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక విశ్వవిద్యాలయాలలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబెర్ గా ఉన్నారు. ఈ పురస్కారం రావడం పట్ల హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు అధ్యాపకులు, విద్యార్థులు  తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. 







ఆంధ్రజ్యోతి దినపత్రిక  31.3.2025 సౌజన్యంతో 

దిశ దినపత్రిక 31.3.2025 సౌజన్యంతో 


నవ తెలంగాణ దినపత్రిక  31.3.2025 సౌజన్యంతో 





ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారాచంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్యులు కందులదుర్గేష్ గార్ల చేతులమీదుగా 30.3.2025 తేదీన విజయవాడ లోని తుమ్దిమలపల్లి వారి క్షేత్యయ్య కళా క్షేత్రంలో ఉగాది పురస్కారం -2025 ని అందుకొంటున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 









 

కామెంట్‌లు లేవు: