"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

09 జూన్, 2023

డా.జి.వి.రత్నాకర్ గారి రెండు పుస్తకాలు ఆవిష్కరణ

నవతెలంగాణ దినపత్రిక, 9.6.2023 సౌజన్యంతో 


జన ప్రతిధ్వని దినపత్రిక, 9.6.2023 సౌజన్యంతో



చెన్నై న్యూస్ టైమ్స్ దినపత్రిక, 9.6.2023 సౌజన్యంతో 

ఈనాడు దినపత్రిక, 9.6.2023 సౌజన్యంతో 


దిశ దినపత్రిక, 9.6.2023 సౌజన్యంతో 


భూమి పుత్ర దినపత్రిక, 9.6.2023 సౌజన్యంతో 

నమస్తే తెలంగాణ దినపత్రిక, 9.6.2023 సౌజన్యంతో 


      నమస్తే దినపత్రిక, 9.6.2023 సౌజన్యంతో 


సాక్షి దినపత్రిక, 9.6.2023 సౌజన్యంతో 

డా. జి.వి.రత్నాకర్ గారి రెండు గ్రంథాల ఆవిష్కరణ 


  భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలకమైన పాత్ర పోషించిన స్వాతంత్ర్య సమరయోధుడు మాతాదిన్ భంగీ, కానీ, మంగల్ పాండేని మాత్రమే చరిత్రకారులు అత్యధికంగా కీర్తిస్తారని, చరిత్ర పునర్నిర్మాణం జరగవలసిన అవసరం ఉందని తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య పి కనకయ్య వ్యాఖ్యానించారు. గురువారం (8.6.2023) మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం గచ్చిబౌలిలో హిందీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ జి వి రత్నాకర్ రచించిన 'ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ యోధుడు మాతాదీన్, హిందీ అనువాదం కుసుమ ధర్మన్న గ్రంథాలను ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య పి కనకయ్య ఆవిష్కరించి మాట్లాడారు. 
డాక్టర్ జి వి రత్నాకర్ హిందీ నుండి తెలుగులోకి, తెలుగు నుండి హిందీలోకి చేస్తున్న అనువాదాలు భారత దేశంలోని భిన్న జాతుల సంస్కృతులను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో ఝల్కారీ భాయ్ జీవిత చరిత్రను తెలుగువారికి పరిచయం చేసిన డాక్టర్ జి వి రత్నాకర్ ఇప్పుడు మాతాదీన్ భంగి జీవితాన్ని పరిచయం చేయడం ద్వారా దళిత, బహుజన, గిరిజన యోధులు చేసిన భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర బయటకు వస్తుందని చెప్పారు. రచయిత డాక్టర్ జి వి రత్నాకర్ మాట్లాడుతూ తెలుగు నుండి కొన్ని రచనలు హిందీలోకి వెళ్లకపోతే తెలుగులో వచ్చిన గొప్ప సాహిత్యం ఉత్తరాది వారికి తెలియదని అందువలన తెలుగు నుండి హిందీకి కొన్ని రచనలను అనువాదం చేస్తున్నారని చెప్పారు. అలాగే హిందీ నుండి తెలుగులోకి కొన్ని రచనలు రావడం వలన తెలుగు సాహిత్యంలో పూరించవలసిన ఖాళీలు ఏమిటో తెలుస్తాయని, అందువలనే హిందీ నుండి తెలుగులోకి కూడా కొన్ని అనువాదాలు చేస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ శాఖ నుండి డాక్టర్ ఓం ప్రకాష్ , డాక్టర్ శరశ్చంద్ర, హిందీ నుండి డాక్టర్ దొడ్డా శేషుబాబు, డా.సంగీతరావు తదితరులు ఈ పుస్తకావిష్కరణ సభలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇటీవలే రిజిస్ట్రార్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆచార్య పి కనకయ్య గారిని డాక్టర్ జివి రత్నాకర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. 











 

కామెంట్‌లు లేవు: