తెలుగు విభాగం, ప్రభుత్వ సిటీ కళాశాల ( స్వయంప్రతిపత్తి) హైదరాబాద్ , తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో రెండురోజుల ( 9-10 మార్చి, 2023) పాటు తెలుగు సాహిత్యం - పర్యావరణ చైతన్యం పై అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. దీనిలో తెలుగు శాఖ అధ్యక్షలు, మానవీయ శాస్త్రాల విభాగం, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ కు చెందిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ‘ ఆధునిక తెలుగు కవిత్వం - జల సంరక్షణ’ అనే అంశంపై పత్ర సమర్పణ చేయడంతో పాటు ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు డా.కోయి కోటేశ్వరరావు ఈ సదస్సుకి సంచాలకులుగాను, డా.నీరజ సహ సంచాలకులుగాను వ్యవహరిస్తారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి