🐘" *అంటరాని చరితను వ్రాయని కవులు అందుకే నా చరితను మరియు కవితను నేనే తిరిగి వ్రాస్తున్నా అంటున్న మాదిగ కవులు"* 🐘
ఎండ్లూరి సుధాకర్ - *(దాసును చూడాలి)
కొలుకులూరి ఇనాక్ - *(చెప్పులకు నమస్కరిస్తున్నాను*)
నాగప్పగారి సుందర్రాజు (మాదిగోడు)
దార్ల వెంకటేశ్వరరావు (మాదిగ మేనిఫెస్టో),
కత్తి కళ్యాణ్ చంద్ర (ఉనికి)
ఎమ్. జాన్సన్ (మాదిగ చైతన్యం),
రావినూతుల ప్రేమ్ కిషోర్ (దండోరా),
విజయరత్నం (మాదిగ మహత్తు),
ఆనంద్ (ఎల్లమ్మ జాతర),
కాశి మాదిగ (రోడ్డు మీద దండోరా),
తుడి మహేందర్ (మాదిగ జీవితం),
కొల్లూరి చిరంజీవి (నేను మాదిగోన్ని),
చిత్రం ప్రసాద్ (చాటింపు),
ఆశావాది శశాంకమౌళి (పెద్దింటోళ్ళ శ్వేత పత్రం),
వేమల ఎల్లయ్య (కత్తె ఆరిని పదును పెడుతున్నాం),
కొలుకులూరి శ్రీనివాస్ రావు (తెరదించుతాం),
రాజలింగం (ఓ మాదిగా ఉద్యమించు),
తాళ్ళూరి భానుప్రతాప్ (ఆహ్వానించు),
మష్టార్జీ (ఎవరనుకున్నారు)
నాగప్పగారి సుందర్రాజు చండాల చాటింపు” (1996) పేరుతో ఒక కవితా సంపుటిని ప్రచురించారు.
గ్యార యాదయ్య “గూటం దెబ్బ”, “ఎర్కోషి” కవితా సంపుటిలలో మాదిగ సంస్కృతిని వర్ణించారు.
రావినూతల ప్రేమ్ కిషోర్ (గుండె దరువు- 2000) అనే దీర్ఘ కావ్యాన్ని రాశాడు.
ఇంకా మల్లవరపు ప్రభాకరరావు, జూపాక సుభద్ర, గోగుశ్యామల, గౌరి, కదిరికృష్ణ, ఓబిలేసు, ఆంజనేయుడు, ఐనాల సైదులు, మణీందర్ ఇలా చాలా మంది మాదిగకవిత్వాన్ని రాస్తున్నారు.
ఇలా రాస్తున మాదిగ కవిత్వాన్ని విమర్శకులు ఆహ్వానించారు.
“మాదిగ కవులు రాసిన ప్రత్యేక కవిత్వం దళిత కవిత్వానికి సరికొత్త ట్రెండ్ అయి దాన్నింకా బలోపేతం చేయబోతోంది” అని ప్రముఖ విమర్శకుడు జి.లక్ష్మీనరసయ్య (1995 - 65) వ్యాఖ్యానించారు.
మాదిగ కవిత్వంలో నేనే మాదిగ అని తమ కవితలను తామే వ్రాసుకున్న మహనీయులు
మీ Dr.E.S.Giri.
🐘🐘🐘జై జంబుదీపే, జై భరత ఖండే, జై భీమ్🐘🐘🐘
No comments:
Post a Comment