"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

29 November, 2021

పద్యసారస్వత పీఠం సమావేశంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సందేశం

మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 
 పద్యాన్ని ఇష్టపడాలంటే వచన కవిత్వాన్ని ద్వేషించేలా మాట్లాడకూడదనీ, తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన కవిత్వ రూపం పద్యమనీ యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం (28.11.2021) సాయంత్రం అంతర్జాలం ద్వారా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో ప్రాచీన సాహిత్యం పట్ల ఆసక్తి తగ్గిపోవడమే కాకుండా, పద్యం పట్ల వ్యతిరేకత కూడా రావడాన్ని గమనిస్తున్నామనీ, దానికి కారణాల్ని అన్వేషించాలని ఆయన సూచించారు. పద్యం పట్ల అందరికీ ప్రేమ పెరగాలంటే ఇలాంటి పద్యసారస్వత పీఠం లాంటి సంస్థల కృషి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. కందిశంకరయ్యగారు నేడు పద్యాన్ని నేర్పడంలో, ఆసక్తిని కల్గించడంలో గురువుగా వ్యవహరిస్తున్నారని, తాను ఒకప్పుడు పద్యాల్ని రాసినా, క్రమేపీ పద్యం పట్ల ఆసక్తి తగ్గిపోయి, వచనకవిత్వం వైపు మళ్ళానని ఆయన చెప్పారు. అటువంటి సమయంలో కందిశంకరయ్యగారు శంకరాభరణం బ్లాగు, వాట్సాప్ గ్రూపుల ద్వారా పద్యం పట్ల ఆసక్తిని పెంపొందిస్తున్నారని, అలాంటివన్నీ పద్యాన్ని మరలా పూర్వవైభవానికి తీసుకెళ్ళడానికి దోహదం చేస్తాయన్నారు. పద్య సారస్వత పీఠం కూడా అలాంటి ప్రేరణను కల్గిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు
పద్యసారస్వత పీఠం అధ్యక్షుడు అవుసుల భానుప్రకాశ్ సమావేశాన్ని చక్కగా నిర్వహించారు. 


No comments: