అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిఫలించిన నవల అవతలి గుడిసె
అంబేద్కర్ ఆశయాన్ని, బౌద్ధంలోని శాంతికాముకతను ప్రతిఫలించిన నవల 'అవతలి గుడిసె' అనీ, అహింస ద్వారానే దళితులు ప్రధాన జీవనంలోకి రాగలుగుతారని వక్తలు పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దళిత విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య వి.కృష్ణ హిందీ నుండి తెలుగు లోకి అనువాదం చేసిన అవతలి గుడిసె నవల ఆవిష్కరణ,చర్చను ఆదివారం నాడు అంతర్జాలం ద్వారా నిర్వహించారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యాపకుడు డా.గిన్నారపు ఆదినారాయణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నవలగురించి హెచ్ సి యూ తెలుగు శాఖాధిపతి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, అలహాబాద్ విశ్వవిద్యాలయం అధ్యాపకుడు డా.జి.రాజు మాట్లాడారు. హెచ్ సి యూ మానవీయ శాస్త్రాల విభాగం డీన్ , నవలను అనువాదం చేసిన ఆచార్య వి.కృష్ణ తన అనువాద లక్ష్యాన్ని తెలిపారు. సిలిపాక వెంకటాద్రి సమన్వయించిన ఈకార్యక్రమంలో ఆచార్య పిల్లలమర్రి రాములు, ఐనాల సైదులు, డియస్ యు సభ్యులు, పరిశోధకులు వేణు, కుమార్ రాజా, సుమన్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
భూమి పుత్ర దినపత్రిక,14.9.2021 సౌజన్యంతో
No comments:
Post a Comment