"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

23 అక్టోబర్, 2019

'సాహిత్యానికి స్ఫూర్తినిచ్చిన సాహితీవేత్త శేషేంద్ర శర్మ

ఈనాడు సౌజన్యంతో

నమస్తే తెలంగాణ సౌజన్యంతో

సాక్షి సౌజన్యంతో
'

సమకాలీన తెలుగు ఆధునిక సాహిత్యానికి కొన్ని ప్రమాణాలను నిర్దేశించి, సాహిత్యానికి ఒక దిశానిర్దేశం చేసి స్ఫూర్తినిచ్చిన కవి, విమర్శకుడు, సాహిత్య తాత్త్విక వేత్త గుంటూరు శేషేంద్ర శర్మ అని సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు పొదిలె అన్నారు. స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, తెలుగు శాఖ ఆధ్వర్యంలో 'గుంటూరు శేషేంద్ర శర్మ రచనలు-సమాలోచన' అనే అంశంపై ఒక రోజు జాతీయ సదస్సుకి ఆచార్య అప్పారావు అధ్యక్షత వహించి, మాట్లాడారు. సదస్సుని ప్రారంభించిన స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ ఆచార్య ఎస్.శరత్ జ్యోత్స్నారాణి మాట్లాడుతూ నిన్న స్మారకోపన్యాసంలో  శేషేంద్ర శర్మ సాహిత్యంలోని  మౌలికాంశాలను తెలుసుకున్నామని, నేడు ఆయన జీవితం, రచనలన్నింటినీ నిష్ణాతులైన ఆచార్యులు  లోతుగా విశ్లేషిస్తారని, దానివల్ల పరిశోధకులకు, విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె అన్నారు. సదస్సు సమన్వయకర్త ఆచార్య పిల్లలమర్రి రాములు సదస్సు లక్ష్యాన్ని వివరించగా, ఆచార్య స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.శ్రీనివాసరావు మాట్లాడుతూ శేషేంద్ర శర్మ సాహిత్యం భారతీయ ఆత్మను ఆవిష్కరిస్తుందనీ, భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతుందని వ్యాఖ్యానించారు. పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేసి, భారతీయ, పాశ్చాత్య సాహిత్య సమన్వయాన్ని తెలుగు సాహిత్యంలో చూపించారని పేర్కొన్నారు. 70, 80 దశాబ్దాల్లో తనదైన ముద్ర వేసిన శేషేంద్ర శర్మ సాహిత్యం తెలుగు సాహిత్యం విలువను మరింత పెంచిందన్నారు. కీలకీపన్యాసం చేసిన ప్రసిద్ధ సాహితీవేత్త ఆచార్య ఆర్వీయస్ సుందరం మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో కందుకూరి వీరేశలింగం, విశ్వనాథ సత్యనారాయణ లో తర్వాత నిజమైన బహుముఖ ప్రజ్ఞాశాలి అని అన్నారు. విశ్వవిద్యాలయంలో పనిచేసేవారికి సృజన, పరిశోధన శక్తి అనే మూడు పనులుండాలి. అలాంటి స్వభావం కలిగిన విశ్వవిద్యాలయేతర సాహితీవేత్త శేషేంద్ర శర్మ అని ఆయన అభివర్ణించారు.  శేషేంద్ర శర్మ గారు
ప్రాయోగికాత్మక విమర్శకులన్నారు.  
తర్వాత జరిగిన సమావేశంలో ఆచార్య తుమ్మల రామకృష్ణ, ఆచార్య గౌరీశంకర్, ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య ఎండ్లూరి సుధాకర్ , ఆచార్య నీ.సుబ్బాచారి,  జి.అరుణకుమార్ , డా.తరపట్ల సత్యనారాయణ, డా.ఎన్.ఈశ్వరెడ్డి, పగిడిపల్లి వెంకటేశ్వర్లు,   ఆచార్య ఎం.గోనానాయక్ తదితరులు వివిధ  అంశాలపై పత్రాలను సమర్పించారు. సమాపనోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొ.వైస్ ఛాన్సలర్ ఆచార్య బి.రాజశేఖర్ గుంటూరు శేషేంద్ర శర్మ సాహిత్య విశిష్టత ను వివరించారు. శేషేంద్ర శర్మ సతీమణి శ్రీమతి ఇందిరా ధనరాజ్ గిర్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.  ఈ సదస్సులో సుమారు పన్నెండు మంది పత్రాలను సమర్పించారు. వీటిని పుస్తక రూపంలో తీసుకొస్తామని నిర్వాహకులు ప్రకటించారు.




మాట్లాడుతున్న వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు పొదిలె

మాట్లాడుతున్న సెంట్రల్ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.కె.శ్రీనివాసరావు

జ్యోతి ప్రజ్వనం చేస్తున్న అతిథులు

సమాపనోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు ప్రొ.వైస్.ఛాన్సలర్ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్

మాట్లాడుతున్న  యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు ప్రొ.వైస్.ఛాన్సలర్ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్

కామెంట్‌లు లేవు: