"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

16 October, 2009

బి.పి.కరుణాకర్ కథల సంపుటి ’ నిర్నిమిత్తం’ ఆవిష్కరణ దృశ్యాలు!

(ప్రముఖ కథరచయిత బి.పి. కరుణాకర్ రచించిన నిర్నిమిత్తం కథా సంపుటిని శుక్రవారం సాయంత్రం (17-10-2009) హైదరాబాదు లోని సుందరయ్య కళానిలయం, మినీ హాలు లో ఆవిష్కరించారు. నాటి సభలోని దృశ్యాలను పరిశోధక విద్యార్థి మద్దిరాల సిద్ధార్థ సౌజన్యంతో ఇలా అందిస్తున్నాను.. దార్ల )
మూడు తరాల జీవితాలకు ప్రాతినిథ్యం వహించే కథలుగా బి.పి.కరుణాకర్ కథల గురించి మాట్లాడుతున్న హైదరాబాదు విశ్వవిద్యాలయం అధ్యాపకుడు డా. దార్ల వెంకటేశ్వర రావు


సభాధ్యక్షత వహించి, కరుణాకర్ కథల్లో గల వస్తు, శిల్ప విశేషాలను వివరిస్తూ ఆహ్లాదభరితంగా సభను నిర్వహించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య పీఠాధిపతి ఆచార్య ఎండ్లూరి సుధాకర్.

నిర్మిమిత్తం కథాసంపుటిని ఆవిష్కరించిన డా.ధేనువకొండ శ్రీరామ మూర్తి
చక్కని తెలుగు వాక్యాలతో చిక్కని చిన్న కథను ఎలాంటి ఆర్భాటాలు లేకుండా బి.పి కరుణాకర్ కథలు రాశారని అభినందించిన శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ ఉపాధ్యక్షులు ఆచార్య కోలకలూరి ఇనాక్

కథారచయిత బి.పి కరుణాకర్ తన కథల్లో గల కొన్ని అంశాలను డా. దార్ల తో ముచ్చటిస్తున్న రచయిత. వేదిక పై గుడిపాటి ఉన్నారు.



సభలో మాట్లాడుతున్న డా.దార్ల వెంకటేశ్వరరావు
నిర్నిమిత్తం కథాసంపుటిలో గల కథల గురించి ఒక సెమినార్ పత్రంలా శ్రద్దగా రాసుకొచ్చి ప్రసంగించిన కె.పి. అశోక్ కుమార్

కరుణాకర్ కథల్లో ఉన్న విషయాలన్నీ అందరూ మాట్లాడేసిన తర్వాత, ఈ సమయంలో ఆయన్ని అభినందించడమే నాకు ఆనందం... మనందరికీ ఆనందం అని వ్యాఖ్యానించిన కస్తూరి మురళీ కృష్ణ

పాలపిట్టల ప్రచురణల ద్వారా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చి, అంబాలీసీ కథాసంపుటి తర్వాత శాస్త్ర సాంకేతికాంశాలపై కొత్త కోణంతో రాసిన కథలు ఇందులో ఉన్నాయని చెప్తూ వందన సమర్పరణ చేసిన ప్రచురణ కర్త గుడిపాటి
ఈ సభకు డా. పగడాల నాగేందర్ స్వాగతం పలికారు ( ఆయన ఫోటో అభించలేదు) . సభలో ప్రముఖ సాహితీవేత్తలు పాల్గొన్నారు.

రచయితకు సనానం

చిన్నకథ రాయడంలో ఆంగ్ల కథారచయితలు ఎంతో నైపుణ్యం సాధించారని, ఆ ప్రయత్నం తానూ చేస్తున్నాని, తనవి కథలని ప్రచురించి ప్రోత్సహించన వాళ్ళందరికీ రచయిత బి.పి. కరుణాకర్ ధన్యవాదాలు తెలుపుకున్నారు.

సభ ముగిసింది. ఎండ్లూరి, దార్ల వస్తున్నారు. రచయిత ఏదో చెప్తున్నారు
ఆచార్య ఎండ్లూరి వారికి రచయిత ధన్యవాదాలు తెలుపుతుంటే, బ్లాగు మిత్రుడు కస్తూరి కలిసినందుకు ఆనందంతో దార్ల

సభానంతరం వేదగిరి రాంబాబు గారితో దార్ల వారి సంభాషణ


సభ జరగడానికి ముందు శీలా వీర్రాజు గారి దగ్గర కూర్చొని క్షేమ సమాచారాలు అడుగుతూ దార్ల

..... ఇలా జరిగిందా ఆవిష్కరణ సభ! మర్నాడు వార్త పత్రిక ఫోటోతోనూ, సాక్షి కేవలం విషయాన్ని వార్తలుగా రాశాయి.

No comments: