"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

14 March, 2024

పోతన భాగవతం - అలంకారశిల్పం’ గ్రంథావిష్కరణ





డా.గొట్టే శ్రీనివాసరావు పరిశోధన గ్రంథం 'పోతన భాగవతం- అలంకార శిల్పం ' గ్రంథాన్ని స్వీకరిస్తున్న తెలుగు శాఖ అధ్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 


ఆచార్య పమ్మి పవన్ కుమార్ గార్కి పుస్తకాన్ని అందిస్తూ...

ఆచార్య పిల్లలమర్రి రాములు గార్కిపుస్తకాన్ని అందిస్తూ...



డా.గొట్టే శ్రీనివాసరావు పరిశోధన గ్రంథం 'పోతన భాగవతం- అలంకార శిల్పం ' గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న తెలుగు శాఖ అధ్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు , ఆచార్య పిల్లలమర్రి రాములు తదితరులు 

’పోతన భాగవతం - అలంకారశిల్పం’ గ్రంథావిష్కరణ


అలంకార శాస్త్రం పై పరిమితంగా పరిశోధనలు జరుగుతున్న ఈ కాలంలో పోతన రాసిన మహా భాగవతంలో అలంకార శిల్పం గురించి పరిశోధన చేయడం ఎంతో విశేషమైన కృషిగా ఆచార్య పిల్లలమర్రి రాములు వ్యాఖ్యానించారు. పటాన్ చెరువు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్న డాక్టర్ గొట్టే శ్రీనివాసరావు తన పరిశోధన గ్రంథం ’పోతన భాగవతం - అలంకారశిల్పం’ ను గురువారం (14.3.2024) తెలుగు శాఖ, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఆచార్య పిల్లలుమర్రి రాములు ఆవిష్కరించి మాట్లాడారు. తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహిస్తూ మహాకావ్యమైన ఆంధ్ర మహాభాగవతం పై పరిశోధన చేయడమే ఒక విశేషం అయితే దానిలోని అలంకారాలపై సమగ్రంగా అధ్యయనం చేయడం అత్యంత ప్రశంసనీయమని ఆయన అన్నారు. ఆచార్య పిల్లలమర్రి రాములు గారి దగ్గర ఇప్పటివరకు సుమారు 30 పీహెచ్డీలు 40 ఎంఫిల్ పరిశోధనలు జరిగినప్పటికీ ఇదేప్రచురితమైన తొలి పీహెచ్డీ గ్రంథం కావడం ఒక విశేషమని ఆచార్య దార్ల పేర్కొన్నారు. గ్రంథరచయిత డాక్టర్ గొట్టే శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను చదువుకొని పరిశోధన చేసిన తెలుగు శాఖలోనే తన పర్యవేక్షకుడి చేతుల మీదగా తన గ్రంథం ఆవిష్కరణ కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎం. గోనానాయక్ , ఆచార్య పమ్మి పవన్ కుమార్ ,ఆచార్య డి. విజయలక్ష్మి, ఆచార్య పి.వారిజారాణి, ఆచార్య త్రివేణి వంగరి,  డా.బాణాల భుజంగరెడ్డి, డా.డి.విజయకుమారి, డా.లచ్చయ్య, డా.భగ్గునాయక్ తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. 


ఆంధ్రజ్యోతి దినపత్రిక 15.3.2024 సౌజన్యంతో 

తెలుగు న్యూస్ టైమ్స్ చెన్నై దినపత్రిక 15.3.2024 సౌజన్యంతో 

ఈనాడు దినపత్రిక 15.3.2024 సౌజన్యంతో 

తెలుగు లోకం దినపత్రిక 15.3.2024 సౌజన్యంతో 

దిశ దినపత్రిక 15.3.2024 సౌజన్యంతో 


No comments: