"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

18 జులై, 2023

కీ.శే.డా.నాగప్పగారి సుందర్ రాజు గార్కి, దళిత విద్యార్థి సంఘం (డియస్ యు, హెచ్ సియు) నిర్వహించిన వర్థంతి కార్యక్రమం

 



నాగప్పగారి సుందర్రాజు సేవలు చిరస్మరణీయుడు



ప్రముఖ రచయత, ఉద్యమ కారుడు డా. నాగప్పగారి సుందర్రాజు గారి దళిత సాహిత్యానికి చేసిన విశేష కృషిని స్మరించుకుంటూ  సుందర్రాజు గారి 23 వ  వర్ధంతి సందర్భంగా సోమవారం  నాడు దళిత విద్యార్థి సంఘం (డి.యస్.యు) హెచ్ సియు వారు స్కూల్ ఆఫ్ హ్యూమానిటిస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఘన నివాళి అర్పించారు. సుందర్రాజు చిన్న వయసులోనే  చనిపోవడం తెలుగు సాహిత్యానికి తీరని లోటు అని కూడా అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన చేసిన ఉద్యమాలు నేటికీ ఎంతో స్ఫూర్తిదాయకమని వక్తలు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య  దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు సాహిత్య రంగంలో నాగప్ప గారి సుందరరాజు దళిత సాహిత్య వేదిక, మాదిగ సాహిత్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారని, దానిద్వారా తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ధోరణికి ఆద్యుడు గా నిలిచారని వ్యాఖ్యానించారు, ఆయన సంపాదకత్వంలో వెలువడిన మాదిగ చైతన్యం‌ కవితా సంకల్పం కిందివర్గాలలో గొప్ప ఆశను కలిగించిందని అన్నారు. అలాగే ఆయన రాసిన మాదిగోడు కథలు తెలుగు సాహిత్యంలో మాండలిక భాషకు, ప్రాదేశిక చైతన్యానికి చిరునామాగా మారిందని పేర్కొన్నారు. తులనాత్మక అధ్యయన కేంద్రం అధ్యక్షులు ఆచార్య భీమయ్య మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో సుందర్ రాజుకు విశేషమైన స్థానం ఉందని అన్నారు. ఆయన కథలు ఆయన సాహిత్యం వివిధ భాషల్లోకి అనువాదం అయ్యాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.  నాగప్ప గారి సుందర్రాజు గారి  సాహిత్యం గురించి తెలియజేస్తూ  దళిత  ఔన్నత్యం కోసం పోరాడిన వ్యక్తి అని, విశ్వ విద్యాలయాలలో విద్యార్థి ఉద్యమాలకు బాటలు వేసి, దళిత విద్యార్థి రాజకీయాలకు కొత్త అర్థం చెప్పిన సామాజిక ఉద్యమకారుడు అని దళిత విద్యార్థి సంఘం అధ్యక్షులు వేణు వివరించారు. మాదిగ జీవితాలను, మాదిగల సాంసృతిక జీవితాలను అక్షరీకరించిన రచయిత డా. సుందర్రాజు అని ఆయన కొనియాడారు.  ఈ కార్యక్రమంలో డి.ఎస్.యూ అధ్యక్షులు వేణు, కన్వీనర్ కుమార్ రాజ, సిలపాక వెంకటాద్రి, కమలాకర్, రాణాప్రతాప్, చరణ్, సందీప్, మిగతా డి.ఎస్.యూ  విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.


కీ.











నిన్న (17.7.2023) జరిగిన కీ.శే.డా.నాగప్పగారి సుందర్ రాజు గార్కి, దళిత విద్యార్థి సంఘం (డియస్ యు, హెచ్ సియు) నిర్వహించిన వర్థంతి కార్యక్రమాన్ని పత్రికల వారు బాగా ప్రచురించారు. వారందరికీ ధన్యవాదాలు.


కామెంట్‌లు లేవు: