హైదరాబాద్ విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ లో అధ్యక్షుడుగా, మానవీయ శాస్త్రాల విభాగం డీన్ గా పనిచేసి గత యేడాది మరణించిన ఆచార్య కె.కె.రంగనాథాచార్యుల అన్ని రచనలను ఇటీవల ప్రచురించారు. వీటితోపాటు ఆయన వ్యక్తిత్వం, సాహిత్య కృషిని తెలిపే ప్రత్యేక సంచికను కూడా ప్రచురించారు. వీటిని తెలుగు శాఖకు ఆయన దగ్గర పరిశోధన చేసి ప్రస్తుతం అధ్యాపకుడు ఆచార్య పిల్లలమర్రి రాములు సోమవారం నాడు తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కి అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు ఆచార్య ఎం.గోనానాయక్, ఆచార్య పమ్మి పవన్ కుమార్, ఆచార్య డి.విజయలక్ష్మి,, డా.బి.భుజంగరెడ్డి పాల్గొన్నారు.
No comments:
Post a Comment