తెలుగు శాఖ అధ్యాపకుడు ఆచార్య ఎండ్లూరి సుధాకరరావు హఠాన్మరణం- నా ప్రగాఢ సంతాపం
తెలుగు శాఖ, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అధ్యాపకుడు ఆచార్య ఎండ్లూరి సుధాకర రావు గారు శుక్రవారం తెల్లవారుజామున (28.1.2022) గుండెపోటుతో మరణించారని ఆయన కుమార్తె మానస తెలిపారు. ఆచార్య సుధాకరరావుగారు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో చేరకపూర్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య పీఠం, రాజమహేంద్రవరంలో పనిచేశారు. ఆయన ప్రముఖ కవి, పరిశోధకుడుగా ప్రసిద్ధి చెందారు. వారి సతీమణి యేడాది 2019లో చనిపోయారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన రెండవ అమ్మాయి వివాహం ఈనెల 20 నా, రిసెప్షన్ 24 వతేదీన జరిగింది. ఆయన ఇప్పటికే రెండు సార్లు గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయన దీర్ఘకాలంగా డయాబెటిస్ , శ్వాస కోశ వ్యాధులతో బాధపడుతున్నారు. నిన్న రాత్రి శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందిపడుతుంటే గచ్చిబౌలి AIG ఆసుపత్రిలో చేర్చారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన మరణించారు. ఆయన మరణానికి తెలుగు శాఖ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తుంది.
ఇట్లు
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
తెలుగు శాఖ అధ్యక్షుడు, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్
28.1.2022
No comments:
Post a Comment