ఆంధ్ర జ్యోతి దినపత్రిక సౌజన్యంతో
సాక్షి దినపత్రిక సౌజన్యంతో
నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో
గణేష్ దినపత్రిక సౌజన్యంతో
కా.రా.మరణం తెలుగు కథకు తీరనిలోటు
సుమారు ఏభై యేండ్ల ఉత్తరాంధ్ర జీవితాల్ని తన కథల్లో నిక్షిప్తం చేసిన గొప్ప కథకుడు కాళీపట్నం రామారావు అని హెచ్.సి.యు. తెలుగు శాఖ అధ్యాపకులు అభిప్రాయ పడ్డారు. ఇటీవల మరణించిన కా.రా. (కాళీపట్నం రామారావు ) సంతాప సభ సెంట్రల్ యూనివర్సిటీ, తెలుగు శాఖలో కోవిద్-19 నిబంధనలను పాటిస్తూ బుధవారం నాడు తెలుగు శాఖాధిపతి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. తొలుత కా.రా.కు రెండు నిమిషాలు మౌనం పాటించి, మరణించిన కా,రా. కు శ్రద్ధాంజలి ఘటించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న హెచ్ సి యూ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు ఆచార్య పిల్లలమర్రి రాములు మాట్లాడుతూ కా.రా.యజ్ఞం కథ ద్వారా తెలుగు సాహిత్యంలో పీడిత వర్గాల జీవితాన్ని శక్తివంతంగా ఆవిష్కరించారన్నారు. ప్రసిద్ధ కవి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో పీడిత, బహుజనులు, బుగతల జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించిన ఘనత కా.రా.కే దక్కుతుందన్నారు. తెలుగు కథకు పెద్దదిక్కైన గురజాడ, చాసో, కా.రా.తదితరులెంతోమంది ఉత్తరాంధ్ర నుండే వచ్చారన్నారు. వీరితో పాటు ఆచార్య జి.అరుణకుమారి, ఆచార్య ఎం.గోనానాయక్, ఆచార్య పమ్మి పవన్ కుమార్, ఆచార్య డి.విజయలక్ష్మి, డా.బి.భుజంగరెడ్డి, డా.డి.విజయకుమారి, బోధనేతర సిబ్బంది మధు, కృష్ణ తదితరులంతా కాళీపట్నం రామారావు గార్కి ఘనంగా నివాళులు అర్పించారు.
No comments:
Post a Comment