"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

30 November, 2020

అసమర్ధుని జీవయాత్ర విద్యార్థి సదస్సు 29.11.2020

 ‘వ్యక్తి అభివృద్ధికి కుటుంబమే మూలం

వ్యక్తి మానసిక బలాబలాలకు కుటుంబమే ప్రధాన కారణవుతుందని దాన్ని గోపిచంద్ అసమర్థుని  జీవయాత్ర నవల సమర్థవంతంగా నిరూపించిందని ఆచార్య,జి, అరుణ కుమారి అన్నారు.      అసమర్ధుని జీవయాత్ర నవల- అరవై దృక్కోణాలు పేరుతో హైదరాబాద్ విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ వారు ఆదివారం ఒక్కరోజు నిర్వహిస్తున్న విద్యార్థి సదస్సుకు ముఖ్యఅతిథిగా తెలుగు శాఖ అధ్యక్షురాలు ఆచార్య,జి, అరుణ కుమారి విచ్చేసి మాట్లాడి  సదస్సును  ప్రారంభించారు. ఈ విద్యార్థి  సదస్సుకు  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. అంతర్జాలం ద్వారా ఈ విద్యార్థి సదస్సును నిర్వహిస్తూ విద్యార్థుల్లో వక్తృత్వ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి , ఏదైనా ఒక అంశంపై సమగ్రమైన దృష్టిని  అలవర్చుకోవాలని కి ఈ సదస్సు తోడ్పడుతుందని, అందువల్ల విద్యార్థి నిర్వహిస్తున్నట్లు ఆచార్య , దార్ల వెంకటేశ్వరరావు తెలియజేశారు.


ఈ సదస్సులో సుమారు అరవై అంశాలతో త్రిపురనేని గోపిచంద్ జీవితం,రచనల పరిచయం, సాహిత్య దృక్పథం, 'అసమర్థుని జీవయాత్ర నవలలో  ప్రతిఫలించిన  వివిధ కోణాలను ఈ సదస్సులో చర్చించారు. కందుకూరి వీరేశలింగం,  విశ్వనాథ సత్యనారాయణ,గుర్రం జాషువా, సి నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య, శ్రీ శ్రీ, పి శ్రీ దేవి, కేశవరెడ్డి మొదలైన సాహితీవేత్తల పేరుతో  వివిధ  సమావేశాలకు  పేర్లు పెట్టి విద్యార్థులే  సమావేశాలకు సమన్వయకర్తలుగా  వ్యవహరిస్తూ ఈ సదస్సును నిర్వహించారు.ఈ సదస్సులో పరిశోధక విద్యార్థి నలసాని రాంప్రసాద్  తన సహకారాన్ని అందించారు.



ఈ సదస్సులో హిమబిందు,సాయిస్వాతి,త్రిపురాంజనేయులు,రాజు,నవనీత్,తులసీ, శిరీష మొదలైనవారు వివిధ సమావేశాలకు సమన్వయకర్తలుగా వ్యవహరించారు.


 ముగింపుసమావేశంలో డా.భుజంగరెడ్డి గారు పాల్గొని అభినందనలు అందజేశారు.


 ఈ విద్యార్థి సదస్సు ద్వారా సదస్సును నిర్వహించడం,పత్ర సమర్పణ చేయడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని ఈ సదస్సులో పాల్గొన్న విద్యార్థులన్నారు. గ్రూపు సమన్వయకర్తలు హిమబిందు, నవనీతారెడ్డి, రాజు, రమణ, త్రిపురాంజనేయులు, శ్రీకాంత్, తులసి, శిరీష, సాయిస్వాతి సమర్థవంతంగా సమావేశాల్ని నిర్వహించారు 

హిమబిందు


నవనీతా రెడ్డి

రాజు

రమణ

త్రిపురాంజనేయులు

శ్రీకాంత్ 

తులసి

శిరీష

సాయిస్వాతి


No comments: