డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ ఆధ్వర్యంలో "బడిబాట"
''ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతున్న వాటిని సద్వినియోగం చేసుకునేవాళ్లు సగం కంటే తక్కువ మందే ఉంటారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు దీనికొక ప్రత్యక్ష ఉదాహరణ. నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు. ఈ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది. పేద పిల్లలకు ఉచితంగా దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటివి పెడుతున్నా ఈ పాఠశాలలో చేరడం లేదు. వీటి పట్ల సరైన అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. విద్యార్థుల ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటే తల్లిదండ్రులకు చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేయాలి. దీనిలో భాగంగానే డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ, గోగుల్ ప్లాట్స్, కూకట్ పల్లి వారి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో నేను కూడా పాల్గొనడం వల్ల చాలా సంతోషంగా ఉంది. నాతోపాటు డాక్టర్లు జేఎన్టీయూ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఈ పిల్లలతో కలిసి బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న నాకు ఎంతో ఆనందంగా ఉంది. ''
ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యావంతులైన టీచర్లు ఉన్నారని, ప్రభుత్వం అనేక వసతులు, సౌకర్యాలు కల్పిస్తోందని, మంచి యూనిఫామ్స్, డ్రెస్సులు, పుస్తకాలు అందిస్తోందని వాటిని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని హెచ్ సియు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం నాడు డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ ఆధ్వర్యంలో "బడిబాట’’ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా కూకట్ పల్లి, గోకుల్ ప్లాట్స్, వెంకటరమణ కాలనీ చుట్టుపక్కల గల మురికివాడల్లో నివసిస్తున్న పేద ప్రజల తల్లిదండ్రులు, విద్యార్థులకు చదువు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి, ప్రభుత్వం అందిస్తున్న అన్ని సహాయ సహకారాలను పొంది అభివృద్ధి పథంలో పయనించాలని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆయన చెప్పారు. ఆయనతోపాటు క డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ వాలంటీర్లు, జేఎన్టీయూ, ఐటీ విద్యార్థులు, డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ టీచర్లు నగరంలోని ఒక *స్లమ్ ఏరియాలో పర్యటించారు*. ఈ పర్యటనలో పేద, నిరుపేద పిల్లలు చాలా దీనమైన స్థితిలో కనిపించారు. వారు నివాసం ఉంటున్న పరిసర ప్రాంతాలన్నీ మురుగుతో, చెత్తతో నిండిపోయి ఉన్నాయి. సౌకర్యాలు లేని, నీటి వసతి లేని, రక్షణ లేని వాతావరణంలో, ఆరోగ్యం గురించి అంచనా వేయలేని పరిస్థితుల్లో వారు జీవిస్తున్నారు. కొంతమంది సింగిల్ పేరెంట్స్ కూడా చాలా దీనాతి దీనమైన జీవితం గడుపుతున్నట్లు అక్కడి పరిస్థితులను చూస్తే అర్థమైందనీ, తాము ఉన్నత విద్యావంతులైనప్పటికీ, పేద ప్రజల దీనస్థితిని మార్చాలనే ఉద్దేశంతో, మంచి సమాజ నిర్మాణం కావాలనే ఆశయంతో స్లమ్ ఏరియాకు వచ్చామని, తాము కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని ఉన్నత విద్యతోపాటు, ఉన్నతమైన ఉద్యోగాలలో స్థిరపడ్డామని ఆయన చెప్పారు. దయచేసి తమ విజ్ఞప్తిని అర్థం చేసుకోవాలని ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు గారు పేరెంట్స్ కి సవివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ వ్యవస్థాపకురాలు శ్రీమతి చావా అరుణ, డాక్టర్లు, జేఎన్టీయూ విద్యార్థులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి