"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

17 April, 2024

పాట చైతన్య ప్రవాహిని... 16.4.2024

పాట మానవ చైతన్య ప్రవాహిని


ప్రతి ఉద్యమంలోనూ పాట మనిషిని ముందుండి నడిపించిందని ప్రముఖ సినీ గేయ రచయిత డా.సుద్దాల అశోక్ తేజ పేర్కొన్నారు. మానవ చరిత్రలో ఆదిమ కావ్యం పాటేనని, అది శ్రమనుంచే పుట్టిందని ఉత్పత్తి ప్రక్రియలోనూ కాయకష్టంలోనూ పనితో పాటే పాట వర్ధిల్లిందని ఆయన వివరించారు.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మాళవీయ  మిషన్ ఉపాధ్యాయ శిక్షణా కేంద్రం, కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాదు, కళాశాల విద్యాశాఖ ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లోని డిగ్రీ కళాశాలల తెలుగు అధ్యాపకులకు కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం (సామర్ధ్యాల నిర్మాణ కార్యక్రమం) మంగళవారం (16.4.2024) ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం యు. జి .సి.,మాళవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో పది రోజుల పాటు జరుగుతుంది.  ఈ కార్యక్రమం యు .జి. సి., మాళవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ సంచాలకులు ఆచార్య పి ప్రకాష్ బాబు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆచార్య పి. ప్రకాష్ బాబు మాట్లాడుతూ కేంద్రీయ విశ్వవిద్యాలయం లోని మాళవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్  ఉన్నత ప్రమాణాలతో విద్యా శాఖలోని అధ్యాపకులకు సహాయాచార్యులకు ఆచార్యులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉన్నత విద్యా ప్రమాణాలను పెంపొందించడంలోనూ, పరిశోధన పద్ధతులను, ప్రమాణాలను రూపకల్పన చేయడంలోనూ కీలకమైన పాత్ర పోషిస్తోందని తెలియజేశారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ మానవ మహాప్రస్థానంలో పాట అత్యంత కీలకమైనదని, మానవ నాగరికత ప్రతి మలుపులోనూ మానవ ప్రస్థానాన్ని ముందుకు నడిపించిన ప్రతి ఉద్యమంలోనూ పాట మనిషిని ముందుండి నడిపించిందని పేర్కొన్నారు. మానవ చరిత్రలో ఆదిమ కావ్యం పాటేనని, అది శ్రమనుంచే పుట్టిందని ఉత్పత్తి ప్రక్రియలోనూ కాయకష్టంలోనూ పనితో పాటే పాట వర్ధిల్లిందని వివరించారు. కానీ కారణాంతరాల వల్ల పాటకు ద్వితీయ స్థానాన్ని సాహిత్య చరిత్ర ఇచ్చిందని ఇది బాధాకరమైన విషయమని తెలియజేశారు. మనిషి ప్రతి భావోద్వేగానికి పాట వేదికైందని, మనిషి కష్ట సుఖాల్లో మానవుడికి తోడుగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాట పరిణామ క్రమాన్ని నదితో పోలుస్తూ బొట్లు బొట్లుగా  ప్రవాహంతో ప్రయాణమైన పాట ఈరోజు ప్రతి మానవుడి జీవితంలో భాగమైనటువంటి విషయాన్ని వివరించారు. అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు, సుద్దాల హనుమంతు అందెశ్రీ,గద్దర్ వంటి భక్తి ప్రజావాగ్గేయకారులను ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మానవీయ విభాగాల డీన్ ఆచార్య వీ కృష్ణ మాట్లాడుతూ నూతన విద్యా విధానం 2020 ఉన్నత విద్యా వ్యవస్థలో అనేకమైన కీలక మార్పులను తీసుకొచ్చిందని వాటిపైన ఇంకా విస్తృతమైన చర్చ జరగాలని విద్యా వ్యవస్థలోని మార్పులే సామాజిక మార్పులకు దారితీస్తాయని కాబట్టి విద్యా విధానం రూపకల్పనలో మేధావి వర్గమైన అధ్యాపకులు కీలక పాత్ర పోషించాలని, అందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు చక్కగా ఉపయోగపడతాయని తెలిపారు. తెలుగు విభాగాధిపతి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని యు.జి.సి., మాళవీయ మిషన్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం(MMTTC) ఆంధ్ర ప్రదేశ్ లోని డిగ్రీ కళాశాల అధ్యాపకులకు చాలా అంశాలలో శిక్షణ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసిందని తెలుగు సబ్జెక్టు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం తెలుగు శాఖకు గర్వకారణం అని తెలుగు భాషా సాహిత్యాలలో లబ్ద ప్రతిష్టులైన మరియు విశేష కృషిచేసిన ఎందరో సాహితీ భాషావేత్తలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ పి విజయ కుమార్ మాట్లాడుతూ తెలుగు భాష ఆధునిక కాలానుగుణంగా ఎదగాల్సిన అవసరం ఎంతో ఉందని అందుకు కావాల్సిన పరిశోధన సాంకేతికత వంటి అంశాలపై అధ్యాపకులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, పరిశోధనా ప్రాజెక్టులను చేపట్టి భాషా సాహిత్యాలలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని అందుకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు చక్కగా ఉపయోగపడతాయని వాటిని అధ్యాపకులు సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లో వివిధ కళాశాల నుంచి వచ్చిన అధ్యాపకులు, విశ్వవిద్యాలయ తెలుగు విభాగం ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.






26 March, 2024

హెచ్ సియు తెలుగు శాఖను సందర్శించిన సిఐఐఎల్ బృందం

 హెచ్ సియు తెలుగు శాఖను సందర్శించిన సిఐఐఎల్ బృందం


ఆంధ్రజ్యోతి దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో

వెలుగు దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో


నమస్తే దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో



తెలుగు న్యూస్ టైమ్స్ దినపత్రిక పత్రిక, 26.3.2024 సౌజన్యంతో

ఈనాడు దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో


సాక్షి దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో
నవతెలంగాణ దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో

దిశ దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో

మన తెలంగాణ దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో


నమస్తే తెలంగాణ పత్రిక, 26.3.2024 సౌజన్యంతో

మైసూర్ లో ఉన్న భారతీయ భాషా సంస్థలో శిక్షణ పొందుతున్న కొంతమంది పరిశోధకులు అధ్యాపకులు సోమవారం నాడు (25.3.2024) హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగుశాఖను, సందర్శించారు. దీంతోపాటు ఇక్కడే ఉన్న అంతరిస్తున్న భాషలు మరియు మాతృభాషల అధ్యయన సంస్థ (సి ఇ ఎల్ & ఎం టి ఎస్) శాఖను కూడా సందర్శించారు. 





 ఆరుగురు సభ్యులు గల ఈ బృందానికి డాక్టర్ మిరియాల సత్యనారాయణ నాయకత్వం వహించారు. వీరిని తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,  సి ఇ ఎల్ & ఎం టి ఎస్  శాఖ అధ్యక్షులు పమ్మి పవన్ కుమార్ నీ, తెలుగు శాఖలో ఉన్న ఇతర అధ్యాపకులు ఆచార్యులు ఎం. గోనా నాయక్, పి.వారిజారాణి,  వంగరి త్రివేణి,‌ డా.బాణాల భుజంగరెడ్డి, డా.పి.విజయ్ కుమార్, డా. భాశెట్టి లత తదితరులను కలిశారు‌ ఈ బృందంలో ఏ.ప్రేమ, సంతోష్, కవిత, దక్షిణామూర్తి, సి.బసవరాజు, కుముద తదితరులు ఉన్నారు. 

భారతీయ భాషా సంస్థ (సిఐఐఎల్) భారతప్రభుత్వానికి, పార్లమెంటుకు భాషాసంబంధమైన విషయాలలో ప్రధాన సలహాదారు సిఐఐఎల్ , భారతీయ భాషలకు సంబంధించిన పరిశోధన, పరరక్షణ వంటివెన్నో ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఈ బృందానికి నాయకత్వం వహించిన డా.మిరియాల సత్యనారాయణ వివరించారు. సిఐఐఎల్ లోని ప్రాంతీయ భాషా కేంద్రాలు( ఆర్ ఎల్ సి)భారతీయ భాషలను బోధించడంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నాయని డా.మిరియాల పేర్కొన్నారు. దక్షిణ ప్రాంతీయ భాషా కేంద్రం, మైసూరు త్రిభాషా సూత్రం ఆధారంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ఉపాధ్యాయులకు పరిశోధకులకు దక్షిణ భారతీయ భాషలను బోధిస్తోంది. పదినెలల కోర్సులో భాగంగా తెలుగు, మలయాళు కన్నడ, తమిళం కోర్సులను నేర్చుకునేందుకు మైసూరులో ప్రత్యకమైన శిక్షణనివ్వడం జరుగుతుందని డా.మిరియాల చెప్పారు . శిక్షణలో భాగంగా ఈ విద్యాసంవత్సరంలో (2023-24) తెలుగు భాషను నేర్చుకుంటున్న తెలుగు టీచర్లు రెండు తెలుగు రాష్ట్రాలలో భాషా వైవిద్యాన్ని తెలుసుకునేందుకు తెలుగు రాష్ట్రాలలో పర్యటన చేయడం లక్ష్యంగా పెట్టుకొని, ఈ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ ని ఎంపిక చేసుకున్నామని తెలిపారు.

జనప్రతిధ్వని దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో


తెలుగు భాషా సంస్కృతిక, చారిత్రిక, మత, సామాజిక, ఆర్థికాంశాలను మరింత లోతుగా తెలుసుకునేందుకు 14 రోజుల ఈ ఎడ్యుకేషన్ టూర్ ఎంతగానో ఉపకరిస్తుందని ఆయన అన్నారు. దీనిలో భాగంగానే,  తెలుగు భాషా సాహిత్య బోధనల్లో అత్యుత్తమ స్థాయిలో ఉన్న సంస్థలలో హెచ్ సియు, తెలుగు శాఖ ఒకటి కావడం వల్ల ఈ విశ్వవిద్యాలయాన్ని తమ బృందం సందర్శించామని, వివిధ కార్యక్రమాలను ఈ విశ్వవిద్యాలయంతో కలిసి చేయడానికి ఒక (యం ఓ యు)  చేసుకోవాలని భావిస్తున్నామని ఈ బృందానికి నాయకత్వం వహించిన డా.మిరియాల సత్యనారాయణ చెప్పారు. పరస్పరం కలిసి పనిచేయాలని ఆకాంక్ష మంచిదేనని అయితే అటువంటి ఒప్పందాలు చేసుకోవడానికి విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఒక విధానం ఉంటుందని, దాని ద్వారా చేయాలని, సంబంధిత ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేస్తారని తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చెప్పారు.


ప్రజాప్రశ్న దినపత్రిక, 26.3.2024 సౌజన్యంతో

ఇటువంటి సందర్శనవల్ల  భాషల స్థితిగతులు అవగాహన చేసుకోవచ్చని అంతరిస్తున్న భాషలు మరియు మాతృభాషల అధ్యయన సంస్థ (సి ఇ ఎల్ & ఎం టి ఎస్) అధ్యక్షులు ఆచార్య పమ్మి పవన్ కుమార్ చెప్పారు. తెలుగు నేర్చుకుంటున్న విద్యార్థులతో అధ్యాపకులు మాట్లాడారు. తెలుగు నేర్చుకోవడంలో ఉన్న కొన్ని మెళకువలను అధ్యాపకులు వివరించారు.