"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

11 December, 2017

‘సాహిత్య, సామాజిక దార్శనికుడు డా. కట్టమంచి రామలింగా రెడ్డి ’.. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

సమాజంలోనూ, సాహిత్యంలోను గొప్ప దార్శనిక దృష్టి గల అభ్యుదయవాది డా.కట్టమంచి రామలింగారెడ్డి అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య  దార్ల వెంకటేశ్వరరావు అన్నారు.  కట్టమంచి రామలింగారెడ్డి జయంతి సందర్భంగా శ్రీ త్యాగరాయగానసభ, హైదరాబాదులో 10 డిసెంబర్ 2017 సాయంత్రం  జరిగిన సాహితీ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 
ఈ కార్యక్రమాన్ని శ్రీత్యాగరాయ గానసభ, ద్వానాసాహితీ కుటీరం సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. కట్టమంచి రామలింగారెడ్డి వ్యక్తిత్వాన్ని, సాహిత్య కృషిని, విద్యా సంస్కరణలను సోదాహరణంగా వివరించారు.
ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ద్వా.నా.శాస్త్రి అధ్యక్షత వహించిన ఈ సభలో కళా వి.ఎస్. జనార్ధనమూర్తి, ప్రముఖ కవులు రఘువీర్ ప్రతాప్, బండి శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు. సభలో ముందుగా కట్టమంచి రామలింగారెడ్డి గారి చిత్రపటానికి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పూలమాలవేసి, జ్యోతి ప్రజ్వలనం చేశారు.  తన  ఉపన్యాసాన్ని కొనసాగుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రతివాళ్లూ ఏ సాహిత్యాన్ని చదివినా ముందుగా తమ అస్తిత్వ మూలాలను వాటిలో వెతుక్కుంటారని , కట్టమంచి వారి రచనలు కూడా ఈఆ దృష్టితో చూసే అవకాశం ఉందన్నారు. నిజానికి అలా చూడవలసిన అవసరం  ఉందని కూడా చెప్పారు.

జ్యోతి ప్రజ్వనం చేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తదితరులు 
 ప్రస్తుతం తెలుగులో అస్తిత్వ ఉద్యమ సాహిత్యం  విస్తృతంగా కనిపిస్తోంది. ప్రతివాళ్ళూ  తమ గురించి ఆ సాహిత్యంలో కనిపించే తమ జీవితం గురించి చేసే అన్వేషణ మొదలైంది. కట్టమంచి వారిని నేను కూడా దృష్టితో చూశాను. నాకు ఆయన వ్యక్తిత్వంలో  సాహిత్యంలో మూడు ముఖ్యాంశాలు బాగా నచ్చాయి. మొదటిది సామాజిక అభ్యుదయ ఆకాంక్షతో అందరికీ కలగాలనే దృష్టి ఆయన వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. రెండవది ... ప్రాంతీయ దురభిమానం లేకుండా జాతీయ సమైక్యత సమగ్రతలను పెంపొందించే దృష్టి కలిగి ఉండటం. మూడవది లింగపరమైన వివక్షకు దారిలేకుండా స్త్రీ ఔన్నత్యాన్ని గుర్తించే రచనలు చేయటం. వీటితోపాటు సాహిత్యంలో సంప్రదాయాలతో పాటే ఆధునికతను తీసుకొచ్చారు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా, పాలనాదక్షుడుగా, మానవతావాదిగా  కట్టమంచి రామలింగారెడ్డి అనేక పార్శ్వాలలో కనిపిస్తాడని పేర్కొన్నారు.  ఆయన వ్యక్తిత్వాన్ని వివరించే అనేక  అంశాల్ని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వివరించారు. 

సభలో మాట్లాడుతున్న  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 
కట్టమంచి రామలింగారెడ్డి  మైసూరులో విద్యాశాఖాధిరిగా ఉన్నప్పుడే మొట్టమొదటిసారిగా దళితులకు విద్యాలయాల్లో చదువుకునే అవకాశాన్ని కలిగించారన్నారు. దానికోసం మైసూరు సంస్థాన దివానుగారితో కూడా పోరాడాల్సి వచ్చిందన్నారు. అప్పుడు మైసూరు రాజా కట్టమంచి వారి నిర్ణయాన్నిస్వాగతించారనివివరించారు.అలాగే, ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని విశాఖపట్టంలో పెట్టడానికి కట్టమంచి ఎంతో కృషిచేశారని, ప్రాంతీయ భేదాలు లేని వ్యక్తి అని కొనియాడారు. స్త్రీ ఔన్నాత్యాన్ని చాటిన గొప్ప అభ్యుదయవాదిగా ఆయన రాసిన ముసలమ్మ మరణం, నవయామిని కావ్యాలు తెలుపుతాయని వాటిలోని కొన్ని ఉదాహరణలను పేర్కొన్నారు. విద్యావేత్తగా ఉస్మానియా, మైసూరు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల స్థాపనలో ఆయన నివేదికలు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కొనియాడారు. పాఠం చెప్పడంలో, ప్రసంగాన్ని రక్తికట్టించడంలో, విద్యాసంస్కరణలు అమలు పరచడంలో కట్టమంచి ఎంతో పరిణత దృష్టితో వ్యవహరించేవారని, అందువల్ల ఆయన చేసిన కృషిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తన గురువు డా.ద్వానాశాస్త్రి గారు తననెంతో ్రపోత్సహించారనీ, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానంలో ఉండడానికి గురువులు, సహృదయులెందరి సహకారమో ఉంటుందనీ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చెప్పారు. డా. ద్వానాశాస్త్రి గారి దగ్గర తాను ఇంటర్మీడియెట్ నుండి డిగ్రీవరకు స్పెషల్ తెలుగు చదువుకున్నానని, ఆయన, మరికొంతమంది డా. చక్రపాణిరావు, డా. మార్గశీర్ష వంటి వారి సహకారంతో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో ఎం.ఏలోచేరానన్నారు. తర్వాత ఆ విశ్వవిద్యాలయంలోనే డాక్టరేట్ పూర్తిచేసి ఆచార్యుడిగా కూడా పనిచేయడం వెనుక గురువుల ప్రోత్సాహం  ఎంతో ఉందని గుర్తుచేసుకున్నారు. అలాంటి  గురువులెంతోమంది డా.కట్టమంచి రామలింగారెడ్డిగారికి దొరకడం వల్లనే  ఉన్నత వ్యక్తిత్వాన్ని అలవర్చుకున్నారరన్నారు. సంస్కృతాన్ని కాపాడ్డం కోసం మద్రాసు శాసనసభలో బడ్జెట్ కేటాయించాలని వాదించారనీ, అంతేకాకుండా శత్రువుల్ని సహితం ప్రేమించే గుణం ఉందనీ వివరించారు.
ఆహ్వాన పత్రం 

సభలో పరిచయ ప్రసంగం చేస్తూ డా.ద్వానాశాస్త్రిగారు కట్టమంచి రామలింగారెడ్డి తెలుగు సాహిత్య విమర్శకు దిక్సూచి వంటివారన్నారు. కవిత్వతత్వవిచారం తో తెలుగు సాహిత్య విమర్శ మలుపుతిరిగిందనీ, శాస్త్రీయత పొందిందనీ అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని ఘనం
తన గురువు డా.ద్వానాశాస్త్రి గారు తననెంతో ్రపోత్సహించారనీ, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానంలో ఉండడానికి గురువులు, సహృదయులెందరి సహకారమో ఉంటుందనీ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చెప్పారు. డా. ద్వానాశాస్త్రి గారి దగ్గర తాను ఇంటర్మీడియెట్ నుండి డిగ్రీవరకు స్పెషల్ తెలుగు చదువుకున్నానని, ఆయన, మరికొంతమంది డా. చక్రపాణిరావు, డా. మార్గశీర్ష వంటి వారి సహకారంతో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో ఎం.ఏలోచేరానన్నారు. తర్వాత ఆ విశ్వవిద్యాలయంలోనే డాక్టరేట్ పూర్తిచేసి ఆచార్యుడిగా కూడా పనిచేయడం వెనుక గురువుల ప్రోత్సాహం  ఎంతో ఉందని గుర్తుచేసుకున్నారు. అలాంటి  గురువులెంతోమంది డా.కట్టమంచి రామలింగారెడ్డిగారికిదొరకడంవల్లనేఉన్నతవ్యక్తిత్వాన్ని అలవర్చుకున్నారరన్నారు. సంస్కృతాన్ని కాపాడ్డం కోసం మద్రాసు శాసనసభలో బడ్జెట్ కేటాయించాలని వాదించారనీ, అంతేకాకుండా శత్రువుల్ని సహితం ప్రేమించే గుణం ఉందనీ వివరించారు. 
ఈ సందర్భంగా నిర్వాహకులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని ఘనంగా సత్కరించారు. తననింతగా గౌరవించిన గురువు డా.ద్వానాశాస్త్రి గార్ని తమ శిష్య, సతీసమేతంగా  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు శ్శాలువాతో సత్కరించారు. 


సభలో మాట్లాడుతున్న డా.ద్వానాశాస్త్రిగారు 
 ఆచార్య దా ర్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న డా.ద్వానాశాస్త్రి, కళా వి.ఎస్.జనార్ధనమూర్తి, బండిశ్రీనివాస్, శ్రీమతి వసుంధర తదితరులు  
డా.ద్వానాశాస్త్రిగార్ని సత్కరిస్తున్న సతీ, శిష్యసమేతంగా సత్కరిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

 సభలో పాల్గొన్నసాహితీవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు


2 comments:

Unknown said...

you ur insiparing telugu people sir
Latest Telugu News

vrdarla said...

thank you for your valuable comment.
Prof.Darla